Actress Anusha Hegde : ఈమధ్య తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు అటు బుల్లితెర ఇండస్ట్రీలో కూడా విడాకుల తంతు కొనసాగుతుంది. సీరియల్స్లలో నటిస్తున్న నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది యాక్టర్స్ విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు. ఇక కొంతమంది రెండో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఈమధ్య విడాకులు తీసుకున్న జంట అంటే సీరియల్ యాక్టర్స్ ప్రతాప్ సింగ్, అనూష హెగ్డే.. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే అనూష హెగ్డే రీసెంట్గా రెండవ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి బ్యాగ్రౌండ్ ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
ఇటీవల టీవీ ప్రపంచంలో కూడా డివోర్స్ అనే మాట కామన్ గా వినిపిస్తుంది.. స్టార్స్ గా ఎంతో జీవితాన్ని చూసినా టీవీ నటీనటులు నిజజీవితంలో మాత్రం ఎప్పుడూ సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు.. అనుషా హెగ్డే, ప్రతాప్ సింగ్ ఆరేళ్ళ తమ కాపురానికి ఇటీవలే గుడ్ బై చెప్పేసారు. ప్రతాప్ సింగ్ తో ప్రేమలో పడి, తరువాత అతన్ని వివాహం చేసుకుంది.. 2016లో ‘NH 37’ సినిమాలో అనూష హెగ్డే నటించింది.. డాన్సర్ గా కూడా చేసింది. అంతేకాదు రాధా రమణ అనే సీరియల్ లో కూడా నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రతాప్ సింగ్ తో కొన్ని రోజులు పాటు ప్రేమ అయినా నడిపిన అనూష హెగ్డే పెళ్లి చేసుకున్నారు. ఇటీవల అనుకుని కారణాలవల్ల వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న వెంటనే అనూష హెగ్డే కన్నడలోని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అతను కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన నటుడు అని తెలుస్తుంది.. అయితే అతనికి బాగా ఆస్తులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఆమె రెండో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది కానీ ప్రతాప్ సింగ్ మాత్రం ఇప్పటివరకు పెళ్లి ఊసరలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read :‘పెద్ది’ షూటింగ్ అప్డేట్.. 4 రోజులు షూటింగ్ అక్కడే..!
కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడ వరుసగా సీరియల్స్ చేసి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.. తెలుగులో ‘నిన్నే పెళ్లాడుతా’, ‘సూర్యకాంతం’, ‘ఆనంద రాగం’ వంటి సీరియల్స్తో డైనమిక్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నిన్నే పెళ్లాడుతా’ షూటింగ్ సెట్స్లో నటుడు ప్రతాప్ సింగ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.. 2019లో వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. 2021 ఫిబ్రవరి 12న వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. దాదాపు వీరిద్దరూ ఆరేళ్ల వరకు కలిసి కాపురం చేశారు. ఇక మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో వరుసగా సీరియల్స్లలో నటించే అవకాశాలను అందుకుంటు బిజీగా మారింది అనూష హెగ్డే..