Intinti Ramayanam Avani : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇంటింటి రామాయణం ఒకటి. టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సీరియల్లో స్టోరీ డిఫరెంట్ ట్విస్టులతో మలుపులు తిరుగుతూ ఉంటుంది. సినిమాను మించిన కథగా జనాలను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబాన్ని ఎలాగైనా సరే నాశనం చేయాలని చూసే మూడో కోడలికి మొదటి కోడలు సమాధానం చెబుతుంది. తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇవ్వకుండా చేసి నా కుటుంబం పై పగ తీర్చుకోవాలని కోడలు పల్లవి అనుకుంటుంది.. ఆ ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు సంతోషంగా ఉండకూడదు అని ఏదో ఒకటి చేస్తూ వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతూ వస్తుంది. తను కావాలనే పగతోనే ఇలా చేస్తుందని తెలుసుకున్న మొదటి కోడలు ఆమెకు వార్నింగ్ ఇస్తూ వస్తుంది. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ పాత్రలో నటించింది అవని.. అవని అసలు పేరు పల్లవి శెట్టి. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వీడియో వైరల్ అవుతుంది.. ఆ వీడియోలు తన మొదటి రెమ్యూనరేషన్ గురించి బయట పెట్టింది. అంతే కాదు ప్రస్తుతం ఉన్న సీరియల్ హీరోయిన్లకు ఎంత అమౌంట్ ఇస్తున్నారు అన్న విషయాన్ని కూడా బయటపెట్టింది..
బుల్లితెర హీరోయిన్ పల్లవి రామిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గతంలో ఎన్నో డైలీ సీరియల్ లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ లో మెయిన్ లీడ్ క్యారెక్టర్ లో నటిస్తుంది. ఆ సీరియల్ టాప్ టెన్ లో టాప్ 4 లో కొనసాగుతుంది.. కుటుంబాన్ని నాశనం చేయాలని చూసే వాళ్ళ నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచించే ఓ మహిళగా ఈమె నటించింది.. ఇదిలా ఉండగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సీరియల్స్ కు డైలీ పేమెంట్ ఉంటుందని చెప్పింది. తాను మొదట షార్ట్ పిలిమ్స్ చేశాను. ఆ తర్వాత బుల్లితెర పై అడుగుపెట్టినట్లు ఆమె చెప్పింది. అప్పటిలో నా ఫస్ట్ రెమ్యూనరేషన్ 2500 తీసుకున్నాను అని చెప్పింది.. డైలీ అమౌంట్ ఇస్తారు అని ఆమె అన్నారు.
Also Read: అయ్యో.. ప్రభావతి, మనోజ్ నిమ్మకాయ భయం.. మరొక దొంగతనం.. బయటపడతారా?
భార్యామణి, ఆడదే ఆధారం, వసుంధర, మాటే మంత్రము, అత్తారింటికి దారేది సీరియల్స్ మంచి స్టార్ నటిగా మారింది.. సీరియల్స్ కెరీర్లో ఫుల్ బిజీగా తన కెరీర్ సాగుతున్న క్రమంలోనే 2019లో దిలీప్ కుమార్ను పెళ్లి చేసుకున్ని వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. ఆమెకు ప్రస్తుతం ఒక బాబు ఉన్నాడు. ఇప్పటివరకు ఆమె నటించిన ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాబు పుట్టిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈమె ఇప్పుడు మళ్లీ వరుసగా సీరియల్స్ చేసేందుకు రెడీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న సీరియల్ ఇంటింటి రామాయణం… ఉత్తమమైన కోడలు పాత్రలో నటిస్తుంది. ఈ సీరియల్ మొత్తం ఈమె చుట్టూ తిరుగుతుంది.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియస్లలో ఈ సీరియల్ కూడా ఒకటి.. ఇందులో నటించినందుకు గాను ఈమె ప్రతిరోజు దాదాపు 25 వేల నుంచి 30 వేలకు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది. ఈ లెక్కను చూస్తే నెలకు లక్షల్లో సంపాదిస్తుంది.