Gundeninda GudiGantalu Today episode February 24th : నిన్నటి ఎపిసోడ్ లో.. బొమ్మలకొలువు గురించి వీళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ సంతోషాన్ని చూసి ప్రభావతి వస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి అంటుంది అని సత్యం ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తాడు. మెల్లగా దిగు ప్రభ జాగ్రత్త అని కావాలనే వాళ్ళకి హింట్ ఇస్తాడు.. అయితే ప్రభావతి కూడా అప్పుడే రావడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఇక కొత్త నాటకం మీ మొదలు పెడతారు. ఏంటి ఈ బొమ్మలు పెడితే పిల్లలు పుడతారా? ఇదంతా నాన్సెన్స్ నేను అసలు నమ్మను అని శృతి అంటుంది. రవి శృతి మీనా ప్రభావతి బాలు అందరూ కూడా ఒక్కసారిగా గొడవలోకి ఎంటర్ అవుతారు.. వీళ్ళిద్దరూ తోడుకోడలు ఇంకా కలిసిపోలేదు అనుకుంటా.. బాగానే గొడవ పడుతున్నారు. గొప్పింట్లోంచి వచ్చిన అమ్మాయిలకి అలాంటి ఇంట్లో అమ్మాయిలకి పెద్ద తేడా ఉండదు.. ప్రభా కూడా మళ్లీ ఆ సీన్ లోకి ఎంటర్ అవుతుంది. ప్రభావతి స్టూడెంట్స్ గురించి మీనా నిజం చెప్పినా ప్రభావతి మాత్రం అస్సలు నమ్మదు. పైగా ప్రభావతికి అనుమానం కూడా వస్తుంది. ఇక రోహిణి గురించి నిజం తెలిసిపోతుందని రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనా బాలు ఇద్దరు కలిసి ఒక అవ్వ తాత దగ్గరికి వెళ్తారు. మీనా బాలు ఇద్దరు కలిసి ఇవ్వాలని చాలా సంతోషంగా ఉంచాలి అని అనుకుంటారు. ఆ తాత చెప్పినా డైలాగులు జనాలను కన్నీళ్లు తెప్పించేలా ఉంటాయి. ఈ సీరియల్ కి ఇదే ఎమోషనల్ ట్విస్ట్. మనోజ్వచ్చిన లెటర్ ని తెలుసుకోవడానికి గుడికి వెళ్తారు.. అక్కడ ఒక స్వామీజీ రోహిణి గురించి బండారం బయట పెట్టబోతాడు.. అయితే రోహిణి ఖచ్చితంగా ఈ వేషంలో వచ్చింది దినేష్ అని ఫీల్ అవుతుంది. వీడు నా గురించి అంత నిజాలను బయట పెట్టేలా ఉన్నాడు. ఏదో ఒకటి చేసి ఆపాలి అని ఎంతగా ప్రయత్నించినా సరే దినేష్ మాత్రం మనోజ్ ని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు.
ఆ తర్వాత దినేష్ ఈ లెటర్ చదువు నీకే అర్థమవుతుంది అని మరో లెటర్ ని మనోజ్ కి ఇస్తాడు. ఎవరు ఇచ్చారు స్వామి అంటే ఒక అబ్బాయి ఇచ్చాడు. మీ ఇంట్లో వల్లే ఇచ్చినట్లున్నారు అని అనగానే మనోజ్ కచ్చితంగా నా చుట్టూ ఎవరో ఉన్నారు అని అనుకుంటాడు. పవన్ కళ్యాణ్ సినిమాలలో పేర్లలో అతని పేరు వస్తుంది.. అని చెప్పగానే తమ్ముడు బాలు అని రాగానే బాలు నీది అంత చేశాడని మనోజ్ ఫిక్స్ అయిపోతాడు. ఆ తర్వాత మనోజ్ బాలు దగ్గరికి వెళ్లి ఇది కచ్చితంగా తేల్చుకోవాలి అని అనుకుంటాడు. కానీ రోహిణి ఎంత ఆపినా సరే ఆగకుండా ఇంటికి వచ్చి పెద్ద రచ్చ చేస్తాడు.. సీన్లోకి ఎంటర్ అయిన బాలు బాడీగార్డ్ కి దిమ్మతిరిగేలా షాక్ ఇస్తాడు.. నేనైతే ఎందుకు ఇస్తాను లెటర్లు వాడెవడో నేను కనిపెట్టి తీరుతాను అని బాలు అంటాడు.
ఆ తర్వాత బాలు వాడెవడో తెలుసుకోవాలి ఆ పార్లర్మ్మ ఏదో దాస్తుందని నాకు బాగా అర్థమవుతుంది.. పోలీసులను తీసుకొస్తామని అంటున్న సరే ఆమె వద్దు అని అంటుంది అంటే కచ్చితంగా ఆమె ఏదో నిజాన్ని దాయాలనుకుంటుంది అని బాలు అనుమానపడతాడు. ఇక బాలు వెంటనే ఆ గుడికి వెళ్తాడు. రోహిణి విద్యను కలిసి బాలు దగ్గర ఉన్న ఫోన్ ని కొట్టేయాలని సలహా ఇస్తుంది. నువ్వు బాలు క్యాబ్ బుక్ చేసుకుని ఆ వీడియో నాకు పంపించు ఆ తర్వాత అతని ఆడుకుంటాను అని అంటుంది.. గుడికి వెళ్లిన బాలు అక్కడున్న స్వామీజీ గురించి నిజం తెలుసుకొని షాక్ అవుతాడు. విని కచ్చితంగా పట్టుకొని అసలు నిజం ఏంటో కక్కియ్యాలి అని అనుకుంటాడు..
Also Read : కన్నతండ్రికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న అమూల్య.. శ్రీవల్లి ప్లాన్ వర్కౌట్ అయ్యిందా..?
తన క్యాబ్ ని బుక్ చేసుకుని తీసుకున్న బాలు షాక్ అవుతాడు. అయితే రోహిణి గురించి విద్య అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది. బాలు కి అనుమానం కూడా వస్తుంది. రోహిణి చెప్పినట్లు బాలు ఫోన్ ని విద్య తీసుకుంటుంది.. కానీ అంతలోపే మీనా ఫోన్ చేయడంతో ఆ ఫోన్ ని మళ్లీ బాలు తీసుకుంటాడు.. ఇక బాలు మీనా తో దినేష్ దొరికినట్లు చెప్తాడు.. ఆ మాట విన్నా విద్యా షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి ఎపిసోడ్లో రోహిణి బండారం బయట పడుతుందేమో చూడాలి..