Illu Illalu Pillalu Today Episode February 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. 20 లక్షలు ఎక్కడినుంచి పెట్టాలి నాకు అర్థం కావట్లేదు అని సాగర్ అంటాడు. మీ నాన్నని మోసం చేసి 20 లక్షలు తీసుకున్నప్పుడు నీకు అనిపించలేదా..? ఇప్పుడు 20 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తామని అంటే నర్మదా తన నగలని బయటకు తీస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ నగలని ఎందుకు తీస్తున్నావు.. ఇది తప్ప ఇప్పుడు మనకు వేరే పరిస్థితి లేదు ఈ నగలను తాకట్టు పెట్టేసి మనం 20 లక్షలు తీసుకురావాలి. ఆ తర్వాత నేను జాబ్ మీద లోన్ పెట్టుకొని నగలను బయటకు తీసుకొస్తాను అని అంటుంది. థాంక్స్ నర్మదా నువ్వు నన్ను కాపాడావు నా ప్రాణాలని పోకుండా చేశావు అని సాగర్ అంటారు.. అయితే ఆ నగలను తీసుకొని దొంగ చాటుగా వెళ్లిపోవడం చూసిన ఆనందరావు నర్మదా ఏదో పైట కింద దాస్తుంది వెంటనే ఈ విషయాన్ని భాగ్యంతో చెప్పాలని అనుకుంటాడు.
ఆ విషయం నీ భాగ్యంతో చెప్పగానే భాగ్యం ఇంకా ఎక్కడున్నావేంటి వాళ్ళు ఎక్కడికి వెళ్లారు ఏంటో కనుక్కోపు అనేసి పంపిస్తుంది. నర్మదా సాగర్ లో ఒక సేటు తాకట్టు కొట్టుకి వెళ్లి అక్కడ నగలను బయటపెట్టి డబ్బులు కావాలి అని అడుగుతారు. అయితే ఆ నగలను చూసినా సేటు కేవలం వీటికి తొమ్మిది లక్షలు మాత్రమే వస్తాయి అని అంటాడు ఆ మాట వినగానే నర్మదా సాగర్ షాక్ అవుతారు. ఏంటి 9 లక్షలు వస్తాయి మాకు 20 లక్షలు కావాలి అప్పుగా ఇచ్చిన పర్వాలేదు అని నర్మదా అంటుంది. నగలనీ ఇవ్వడం చూసిన ఆనందరావు వామ్మో 20 లక్షల కోసం ఇల్లు నగలని తాకట్టు పెట్టారా ఈ విషయాన్ని వెంటనే నేను భాగ్యంకి చెప్పాలి అని చెప్పేస్తాడు..నర్మద మాత్రం ఆ 20 లక్షలు తీసుకొని వనజ గారికి ఇచ్చి రామరాజు కుటుంబం గురించి గొప్పగా చెప్పి వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నర్మదా వనజకు 20 లక్షలు ఇచ్చి ఆ తర్వాత వెంటనే తన తండ్రితో ఈ విషయాన్ని తేల్చుకోవాలని తన పుట్టింటికి వెళ్తుంది.. ఎందుకు నాన్న నువ్వు ఇలాంటి పని చేశావు అని నర్మదా వాళ్ళ నాన్నని నిలదీసి అడుగుతుంది. మీ అల్లుడికి జాబ్ రావడం కోసం నువ్వు గొప్పగా చెప్పుకోవడం కోసం ఇలా లంచం ఇచ్చి జాబును కొనమని చెప్పావా? కొంచమైనా నీకు బుద్ధుందా? అని నర్మదా అంటుంది.. నేనేమీ తప్పు పని చేయలేదు. నా అల్లుడు గొప్పగా ఉండాలని అనుకున్నాను. అందుకే ఇలా చెప్పాను నేను పోస్ట్ చేసిన ఆ జాబ్ లో జాయిన్ అవ్వాలి. డబ్బులు కట్టాలి అని చెప్పలేదు అని ప్రసాద్ అంటాడు. అయినా కానీ రేపు డబ్బులు కట్టి జాబ్ తెచ్చుకున్నాడు అన్న విషయం తెలిస్తే నాకు ఇంట్లో మర్యాద గౌరవం ఉంటాయా..
జీవితాంతం నేను నిందలు మోస్తూ బతకాల అని నర్మదా ప్రసాద్ ని అడుగుతుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా లంచం వల్ల జాబ్ వచ్చిందా అని నర్మదా వాళ్ళ అమ్మ కూడా అడుగుతుంది. ఒక అమాయకురాలు అమ్మ నీకు ఏమీ తెలియదు మీ ఆయన గారు మా ఆయన గారు కలిసి ఇంత పెద్ద మోసం చేశారు.. ఇంట్లో ఈ విషయం తెలిస్తే నా పరిస్థితి ఏంటో ఆలోచించరా అని నర్మదా అడుగుతుంది.. మొత్తానికైతే ప్రసాద్ని నర్మదా దుమ్ము దులిపేస్తుంది దులిపేస్తుంది.. నా అల్లుడికి జాబ్ వచ్చింది సాగర్ ని అల్లుడుగా పరిచయం చేయడానికి ఈ పార్టీని అరేంజ్ చేశాను అని చెప్తాడు.. నా కూతురు అల్లుడు సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటాను కదా అందుకే ఈ పార్టీ అని ప్రసాద్ నర్మదాతో అంటాడు.
ఇద్దరూ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి అని నర్మదా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. మావయ్య గారు మీరేం ఫీల్ అవ్వకండి నేను మా ఇంట్లో వాళ్ళని నర్మదను ఒప్పించి తీసుకొని వస్తాను అని సాగర్ వెళ్లిపోతాడు.. వేదవతి బయట చెట్లకు నీళ్లు పోస్తూ ఉండగా అమూల్య బయటకు వచ్చి అమ్మ నాతో మాట్లాడవా అని అడుగుతుంది. ఎన్నిసార్లు పిలిచినా సరే వేదవతి మాత్రం మౌనంగా ఉంటుంది. తన కోపాన్ని అమూల్య మీద చూపిస్తుంది. బకెట్ లో ఉన్న నీళ్ళని అమూల్య పైపు వస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్లి నేను చాలా కోపంగా ఉన్నాను అని ప్రేమతో అంటుంది.. ప్రేమ అమూల్య కనిపించిందా అని వేదవతి తో అడుగుతుంది.
అసలే నేను మండి పోతున్నాను ఇప్పుడు మళ్లీ నన్ను అడగద్దు అని వేదవతి అంటుంది. ధీరజ్ ఆ కారు ఓనర్ అన్న మాటల్ని పట్టుకొని చాలా కోపంగా ఉన్నాడు. వాడికి ఇట్టి ఇచ్చి కోపాన్ని తగ్గిస్తానని ప్రేమ అనుకుంటుంది. ప్రేమ మాటల్ని మనసులో పెట్టుకున్న ధీరజ్ ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయాలని తాను సంపాదించిన డబ్బులు అన్నిటిని బయటకు తీస్తాడు. ప్రేమను తీసుకుని వెళ్లాలని వంటగదిలోకి రాగానే వేదవతి సీరియస్ గా ఉండడం చూసి షాక్ అవుతాడు. ఇక ప్రేమ ధీరజ్ఇ ద్దరు కలిసి బయటికి వెళ్లాలని అనుకుంటారు.. బయట ఉన్న అమూల్యను చూసి ధీరజ్ బాధపడతాడు.
Also Read :మీనాక్షిని చంపేందుకు పల్లవి స్కెచ్.. తల్లి కోసం అవని కన్నీళ్లు.. చక్రధర్ కు దిమ్మతిరిగే షాక్..
అమ్మ కోపంగా ఏదో అలా చేసింది నువ్వేమీ పట్టించుకోవద్దు.. ఇవి అమ్మ కన్నీళ్లు అనుకో అని ఓదారిస్తాడు. కనీసం నువ్వైనా నాతో మాట్లాడావా అన్నయ్య నా జీవితానికి ఒక అర్థం అనేది ఇప్పుడు కనిపిస్తుంది అని ఫీల్ అవుతుంది అమూల్య.. ఇక శ్రీవల్లి భాగ్యం ఆనందరావు ముగ్గురు కూడా గెటప్ లు మార్చుకొని సాగర్ కి జాబ్ ఇచ్చినా ఏజెంట్ దగ్గరికి వెళ్తారు.. అక్కడ అతన్ని మాటల్లో పెట్టి శ్రీవల్లి అతనికి లైన్ వేసినట్లు నాటకమాడి నిజమే రాబట్టాలని అనుకుంటారు.. ఆ ఏజెంటు శ్రీవల్లి మాయలో పడిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో సాగర్ ఉద్యోగం గురించి అసలు రహస్యం బయట పడుతుందా? ప్రేమ ఎస్సైగా సెలెక్ట్ అవుతుందా చూడాలి..