E-Paper
Advertisement

Rajahmundry Adulterated Milk Case: రాజమండ్రి కల్తీ పాల కేసు.. డేంజర్ కెమికల్స్ వినియోగం

Rajahmundry Adulterated Milk Case: రాజమండ్రి కల్తీ పాల కేసు.. డేంజర్ కెమికల్స్ వినియోగం

Rajahmundry Adulterated Milk Case:  రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం కొత్త మలుపు తిరిగిందా? మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోందా? ఇప్పటివరకు ఐదుగురు మృత్యువాత పడ్డారా? పాలలో ఇథనాల్ గైకోల్ గ్యాస్ కలవడమే అసలు కారణమా? పాలు తీసుకున్న కొందరు పరిస్థితి విషమంగా ఉందా? పాలు పోసే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారా? అవుననే అంటున్నారు అధికారులు.

రాజమండ్రి కల్తీ పాల కేసు.. వెలుగులోకి కొత్త విషయాలు 

ఏపీ వ్యాప్తంగా కలకలం రేపుతోంది రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దర్యాప్తు వేగంగా చేయాలని ఆదేశించడంతో అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. తాజాగా ఈ ఘటనలో బాధితుల కుటుంబాలకు పాలు పోసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు.

కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన పాల వ్యాపారి గణేష్‌ని విచారణ చేస్తున్నారు అధికారులు.  వరలక్ష్మి డెయిరీ పేరిట అనధికారికంగా రెండు కూలింగ్ ఛాంబర్లు నిర్వహిస్తున్నాడు. ఈ రెండింటిలో పాలు నిల్వ చేస్తున్నాడు పాల వ్యాపారి గణేష్. పదేళ్లకు పైగా పాల వ్యాపారం చేస్తున్న గణేష్, 125 మంది ఆయనకు ఖాతాదారులున్నారు.  సోమవారం సాయంత్రానికి 64 కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరించి వివిధ పరీక్షలకు వాటిని పంపించారు. చికిత్స పొందుతున్నవారి రక్త నమూనాలను సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌తోపాటు విశాఖపట్నం,హైదరాబాద్‌ ల్యాబ్‌లకు పంపించారు.

మిల్క్ ట్రేడర్ అరెస్ట్.. డేంజర్ కెమికల్స్ వినియోగం

సేకరించిన పాలకు సంబంధిత కేంద్రంలో ఇథలీన్‌ గ్లైకాల్‌ అనే కూలెంట్‌ రసాయనం కలవడం వల్ల ఈ దారుణం జరిగినట్లు ఓ అంచనాకు వచ్చారు అధికారులు.  ఓ డెయిరీలో దీన్ని కలిపినట్టు సమాచారం. ఇథలీన్‌ గ్లైకాల్‌ రసాయనం కేవలం కార్లు, సిస్టం తయారీ పరిశ్రమల్లో మాత్రమే ఉపయోగిస్తారట. ఇథనాల్ గైకల్ అత్యంత ప్రమాదకరమైన రసాయనం. 100 నుంచి 200 మిల్లీగ్రామ్ మనిషి శరీరంలోకి వెళ్తే ప్రమాదమని చెబుతున్నారు.

రాజమండ్రి హాస్పిటల్లో ఉన్నవారు ఇథనాల్ గైకల్ పాలలో కలవడం వల్లే చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దశాబ్దమున్నరపాటు పాల వ్యాపారం చేస్తున్నాడు గణేష్. రాజమండ్రిలోని పాలు, పెరుగు వర్తక సంఘాల్లో సభ్యత్వం తీసుకున్నాడు. రాజమండ్రి పరిసరాల్లో పాలు అమ్మకాలు చేసే వర్తకులు కచ్చితంగా తమ సంఘంలో రిజిస్టర్ చేసుకుంటారని తెలిపింది పాలు వర్తకుల సంఘం.

ALSO READ: అమాయకుడిపై ఖాకీ ప్రతాపం.. కట్ చేస్తే సీన్ రివర్స్!

అధిక లాభాలు గడించాలన్న అత్యాశతో బయట ఊళ్ళ నుంచి వచ్చినవాళ్లు సంఘంలో చేరకుండా వ్యాపారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు రాజమండ్రి పాలు-పెరుగు వర్తకుల సంఘం. దీనివల్ల పాల వ్యాపారంపై జీవించేవారిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు రాజమండ్రి పాల వర్తక సంఘం.

 

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×