Gundeninda GudiGantalu Today episode march 21st : నిన్నటి ఎపిసోడ్ లో.. ముగ్గురు పీకలదాకా తాగి రావడం చూసినా సత్యం షాక్ అవుతాడు.. ఏంటి ఇలా జరిగింది అని సత్యం అడుగుతాడు. పార్టీలో వీలు ముగ్గురి ఎంత చెప్తున్నా వినకుండా తాగొచ్చారు మావయ్య అని చెప్తున్నా సరే సత్యం మాత్రం వీళ్లు ఇంకా మారరు అని అంటాడు. ఇక ముగ్గురు కలిసి పొంతన లేకుండా మాట్లాడడం చూసిన సత్యం ఇంకా సీరియస్ అవుతాడు.. ముగ్గురు అన్నదమ్ములు కలిసి తాగు వచ్చి ఇంటి దగ్గర పెద్ద రచ్చ చేస్తారు. అవును ఈ అంకుల్ ఎవరు ఎక్కడున్నారు ఏంటి అని ఆ ముగ్గురు సత్యం మీ అనగానే ఏంటి నేను అంకుల్ నా అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. ఇక బాలు కూడా ఆ ఇద్దరితో కలిసి సత్యంని అనడంతో ఒక్కసారిగా కోపంతో రగిలిపోతాడు..
ఈ ముగ్గురిని ఏం చేయమంటారు మీ ముగ్గురు చెప్పండి అని సత్యం అంటారు. ప్రభావతి ఇంట్లో నుంచి బయటికి రాగానే ఏంటి ముగ్గురు ఇలా తాగొచ్చారు. అంతా బాలు గడి పనేనా ఏంటి మీనా వాళ్ళలా మాట్లాడుతుంటే మాట్లాడవేంటి అని మీనాతో సీరియస్ గా మాట్లాడుతుంది.. ఇంకా ప్రభావతిని చూసినా ఆ ముగ్గురు ఏంటి ఆంటీ ఎవరు మన ఇంట్లో ఉండే ఇంటి అని వెటకారంగా మాట్లాడేస్తారు. ఏంట్రా నేను ఆంటీనా నువ్వు ఇంకా ఆంటీ వే నేను అంకుల్ని కూడా అనేసి సత్యం అంటాడు… వీళ్ళిద్దరూ ఇలా మారడానికి కారణం ఈ బాలు గాడి అయి ఉంటాడు అని ప్రభావతి అంటుంది.. మొత్తానికి బాలు మీనాలు మళ్లీ కలిసిపోయి సంతోషంగా ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. బాలు ఫోన్ ని ఎలాగైనా కొట్టేయాలని వచ్చిన రోహిణి వీళ్లిద్దరు ముచ్చట్లు చూసి కోపంగా ఉంటుంది.. ఏంటి వీళ్లిద్దరూ రాత్రంతా ఇలాగే ముచ్చట్లు పెట్టుకునేలా ఉన్నారు.. ఎలాగైనా సరే బాలు ఫోన్ కొట్టేసి ఆ వీడియోని తీసుకోవాలి అని రోహిణి అనుకుంటుంది. కానీ రోహిణి పప్పులేమి అక్కడ ఉడకవు. మిగతా ఇద్దరు నిద్రపోయినా సరే బాలు మాత్రం మేలుకొని మీ నాతో ముచ్చట్లు పెట్టడంతో రోహిణికి దిమ్మ తిరిగే షాక్ ఎదురవుతుంది. చూస్తుండగానే తెల్లారిపోతుంది. ఇక మీనా ఎప్పుడు ఎప్పుడు తలుపు తీస్తే బాలు లోపలికి తీసుకొని వద్దామని ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే శృతి రోహిణి కూడా అక్కడికి వచ్చి ఏంటి మీనా ఇంకా తలుపు తీయలేదు అని అడుగుతారు. మావయ్య నేను చెప్పేంతవరకు తలుపు తీయొద్దని అన్నారు. అందుకే వెయిట్ చేస్తున్నాను. మామ ఇంకా రాలేదు వచ్చిన తర్వాత డోర్ ఓపెన్ చేస్తాను అని నేను అంటుంది. అక్కడికి వచ్చిన సత్యం మీనా డోర్ ఓపెన్ చేయమని అంటాడు.
డోర్ ఓపెన్ చేయగానే అందరూ పడుకుని ఉంటారు. వాళ్లని లేపమ్మా అని అనగానే ముగ్గురు కోడలు కూడా తమ భర్తలను లేపుతారు. అయితే లేచిన ముగ్గురు కూడా రాత్రి ఏం జరిగింది ఎందుకు బయట పడుకున్నాము అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక మనోజ్ అయితే ఏంటి మా రూమ్ గోడల్ని లేపేసారా ఏం జరిగింది? ఇక్కడున్నాను ఏంటి నేను అని అంటాడు.. నీ అద్దాలు పెట్టుకొని చూడు నువ్వు ఎక్కడున్నావో అని రవి అంటాడు. అవే కనిపిస్తే ఇక్కడ నేను ఎందుకు వెతుక్కుంటాను అని మనోజ్ అంటాడు మొత్తానికి అద్దాలు తీసుకొని పెట్టుకొని ఏంటి బయట పడుకున్నామని అడుగుతారు..
అందరూ లేచి లోపలికి రాగానే నీ ముగ్గురిని ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని సత్యం అంటాడు. ఒళ్ళు తెలియకుండా తాగొచ్చి చాక్ ఏదో దుప్పటేదో తెలియకుండానే కప్పుకొని పడుకున్నారు. ఇన్ని రోజులు బాలునే ఇలా చేస్తున్నాడని బాధపడ్డాను కానీ ఇప్పుడు మీ ముగ్గురు కలిసి ఇంటి పరువుని తీసేస్తున్నారు అని సత్యం క్లాస్ పీకుతాడు. ఎందుకు అంతగా తాగారు నేను తాగొద్దని చెప్పాను కదా అయినా కూడా వినకుండా ఇలా చేశారేంటి అని మాట్లాడుతాడు. ఇక అక్కడ వచ్చిన ప్రభావతి ఏంటమ్మా అలా ఉన్నావు అని అడుగుతారు. రాత్రి ఆంటీ అని మాట్లాడారు ఈ ఆంటీ ఇక్కడ ఎందుకు ఉంది అనేసి అంటారు. 30 ఏళ్ల క్రితం ఈ ఆంటీని ఈ అంకుల్ పెళ్లి చేసుకుని ఇంటికి భార్యగా తీసుకొని వచ్చారు. అది తెలియకుండానే మీరు ఇలా మాట్లాడుతున్నారా అని ప్రభావతి అందరికీ క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత అసలు ఇలా చేస్తారని ఊహించనేలేదు ఎందుకు ఇలా చేశారు అని ప్రభావతి కూడా ముగ్గురిని తిడుతుంది.
Also Read : ఫీల్ అయిపోయిన పల్లవి..నిజం చెప్పబోతున్న చక్రధర్.. అవనిని చంపేందుకు పల్లవి ప్లాన్..
ఇక రోహిణి ఇంత ప్లాన్ చేసిన కూడా మనోజ్ కి తిట్లు పడుతున్నాయి కానీ బాలు దగ్గర నుంచి ఫోన్ కొట్టే లేకపోయని బాధ పడిపోతూ ఉంటుంది. ఇక ఏం జరిగినా కూడా సంతోషమే కదా నాన్న నాకు మంచి డీల్ వచ్చింది అనేసి అగ్రిమెంట్ ని చదవగానే ఏదైనా కారణాల వల్ల అగ్రిమెంట్ క్యాన్సిల్ అయితే 50 లక్షలు కట్టాలని ఉంది అని అందులో రాసి ఉందని మనోజ్ షాక్ అవుతాడు. అసలు ముఖేష్ కి రాత్రి ఏం మాట్లాడావ్ రా ఎందుకు వెళ్లిపోయాడు రా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నా నెత్తి మీదకు వచ్చేలా ఉంది అని మనోజ్ బాలుని అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక సోమవారం ఎపిసోడ్లో మనోజ్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా అన్నది చూడాలి..