Intinti Ramayanam Today Episode March 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం భూమి పూజకు వెళ్లాలని అందరూ హడావిడిగా రెడీ అవుతుంటారు. అయితే అవని ఇంకా పల్లవి లేవలేదు ఏంటి అని పల్లవి దగ్గరికి వెళ్తుంది.. పల్లవి పడుకుని ఉండడం చూసి అక్కడ ఉన్న వాతావరణం చూసి తాను మా అందరితో సంతోషంగా లేకపోయినా భర్తతో సంతోషంగానే ఉంది అని అనుకుంటుంది.. పల్లవిని లేపితే పల్లవి నిద్రలో కూడా నాకు అదే గొంతు వినిపిస్తుంది. ఏంటి అని అంటుంది. కానీ చివరికి పల్లవిని లేపడంతో పల్లవి హడావిడిగా అన్ని పనులు చేస్తానక్కా కాస్త లేట్ అయింది అని అంటుంది.. కానీ పూజకు వెళ్లాలి నువ్వు వెళ్లి స్నానం చేసి రెడీ అవ్వు అని పల్లవి తో అవని అంటుంది.. అందరూ కలిసి రెడీ అయ్యి బయటకు వస్తారు.. చక్రధర్ ఇది నిజాన్ని ఎలాగైనా సరే తాను అవనీత చెప్పాలి అని అనుకుంటాడు. ఇకపోతే మీనాక్షి దగ్గరికి వెళ్లిన చక్రధర్ ను చూసి మీనాక్షి చాలా సంతోషపడుతుంది.. ఈ ఆ తర్వాత మీరు ఇక్కడికి వస్తారని అసలు ఊహించలేదండి అని అంటుంది..
ఎందుకు వచ్చావు అని అడుగుతావని అనుకున్నాను కానీ మీరు వస్తారని అనుకోలేదు అని అనడంతో నా మనసు ఇది అయిపోయింది మీనాక్షి అని చక్రధర్ అంటాడు.. లోపలికి రండి మీకు ఇష్టమైన సొంటిటీని పెట్టుకుని వస్తాను అని మీనాక్షి అంటుంది.. మీనాక్షి దగ్గరికి భోజనానికి వచ్చిన చక్కధరకు భారత్ షాక్ ఇస్తాడు.. నేను నీ కన్న తండ్రిని అని ఎంత చెప్పినా సరే అతను వినకుండా నీలాంటి వాడు మా ఇంటి వరకి రావద్దు అని వార్నింగ్ ఇస్తాడు. ఇక అవని వాళ్ళందరూ కలిసి భూమిపూజ కనే సైట్ కి వెళ్తారు. అక్కడ పల్లవికి ఘోరంగా అవమానం జరుగుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. తమ సైట్ కి భూమి పూజ కోసం అని ముగ్గురు అన్నదమ్ములు ఫ్యామిలీని తీసుకొని అక్కడికి వెళ్తారు.. అక్కడ దంపతులు కలిసి పూజ చేయాలని అనగానే.. అవని నేను పల్లవి కమల్ అక్షయలు జనరల్ గా కూర్చొని పూజ చేస్తామని అంటుంది.. ఇది భూమి పూజ దీన్ని మంచి మనసున్న వాళ్ళే చేయాలి. స్వచ్ఛమైన మనసుతో ఉన్నవాళ్లు ఈ పూజ చేస్తే అది పది కాలాలు పచ్చగా ఉంటుంది అని పార్వతి అంటుంది. ఇక తర్వాత పల్లవిని వద్దని చెప్పగానే పల్లవి ఫీల్ అయిపోతుంది. ఇక నేను ఆ పూజ చేయను లేండి అని వెనక్కి వెళ్ళిపోతుంది.. తర్వాత అవని పూజ చేస్తూ ఉంటే పల్లవి అవని పై కోపాన్ని పెంచుకుంటుంది.. అవని వల్లే నాకు ఈ అవమానం జరిగింది అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది..
అవని పార్వతి అన్న మాటని తలుచుకొని బాధపడిపోతూ అవమానంగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అది చూసినా శ్రియ పల్లవి అవమానంగా ఫీల్ అవుతుందేమో అని అంటుంది. హరి ఫీల్ అవుతున్నట్లు ఉంది రా అమ్మ అన్నందుకు అని అనగానే.. ఏం పర్లేదు అన్నయ్య అనే కమల్ లైట్ తీసుకుంటాడు దాంతో ఇంకా ఫీల్ అయిపోతుంది పల్లవి. వీటన్నిటికీ కారణం అవని అవని ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలి అప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉంటాను అని పల్లవి అనుకుంటుంది. నెక్స్ట్ మనం సైట్ కి వెళ్ళాలి అక్కడ బిల్డింగ్ ని చూడాలి అని కమల్ చెప్పిన మాటను గుర్తు చేసుకుంటుంది.. అక్కడ సైట్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తికి ఫోన్ చేసి అవని అనే అమ్మాయిని చంపాలి అని చెప్తుంది. అతను ప్లాన్ చెప్పగానే పల్లవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఇక పంతులుగారు అక్కడ ఇటుకలను పేర్చి దానిమీద సిమెంట్ పెట్టి మీ పూజనీ పూర్తి చేయండి అని అంటాడు. ముగ్గురు అన్నదమ్ములు ఆ పని చేస్తారు.. ఇక అక్కడున్న కార్యక్రమాలన్నీ పూర్తి అయిన తర్వాత మన సైట్ కి వెళ్ళాలి పదండి అని అక్షయ్ అంటాడు. అయితే అవినీకి చక్రధర ఒక నిజం చెప్పాలి. నా కొడుకు నాకు దూరం అయ్యాడు ఎంత కఠినమైన పర్వాలేదు కానీ ఆ నిజాన్ని మాత్రం బయట పెట్టాలి అని ఫిక్స్ అవుతాడు. ఇక అవనికి చక్కగా ఫోన్ చేసి ఎక్కడున్నావమ్మా అని అడుగుతాడు. ఇప్పుడే భూమి పూజ చేసుకున్నాము సైటుకు వెళ్తున్నాము అని అంటుంది. ఆ మాట వినగానే చక్రధారి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటాడు. అంత ముఖ్యమైన విషయం అయితే సైట్ కి రండి అని అడ్రస్ పంపిస్తుంది.
అయితే అక్కడ సైట్ కి వెళ్ళగానే నేను కట్టే డ్రీమ్ ప్రాజెక్ట్ ఇలాగే ఉంటుంది అమ్మ.. ఇది కూడా నేను డిజైన్ చేసింది అని అక్షయ్ అంటాడు.. చాలా బాగుందిరా చాలా పెద్దగా ఉంది అని పార్వతి తన కొడుకుని పొగిడేస్తూ ఉంటుంది. మిగిలిన అందరూ కూడా ఆ బిల్డింగ్ చాలా బాగుంది అని ప్రశంసలు కురిపిస్తారు. శ్రీయ అయితే బావగారు మీరు డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏదో అనుకున్నాను. ఇంత పెద్ద ప్రాజెక్టుని మీరు చేస్తున్నారంటే మీరు నిజంగా గ్రేట్ బావగారు అని పొగిడేస్తూ ఉంటుంది. ఇక పార్వతి నేను అదంతా తిరగలేను రా నేను కార్ లోనే కూర్చుంటాను మీరు వెళ్లి చూసేసి రండి అని అంటుంది. అందరూ కలిసి సైటును చూడడానికి అక్కడికి వెళ్తారు. పల్లవి తను ప్లాన్ చేసినట్టుగా ఓ వ్యక్తికి ఫోన్ చేసి చంపాల్సింది ఆమెనే అని అవనిని చూపిస్తుంది.
Also Read : ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా అవుట్..
కమల్ పల్లవిని ఇక్కడే ఉన్నావేంటి బొట్టు పెట్టి పిలవాలా రా.. లోపలికి వెళ్లి నీకు అన్నీ సైకిల్ చూపిస్తానని బలవంతంగా తీసుకొని వెళ్తాడు.. అయితే పల్లవి టార్గెట్ చేసిన ఏరియాలో రాగానే అతనికి ఫోన్ చేసి అరే అది నా మీదకు వస్తుంది రా ఆఫ్ చెయ్ రా అని అంటుంది.. ఇక లోపలికి వెళ్లిన అవని అక్షయ్ లు మొత్తం చూసి చాలా సంతోషంగా ఉంటారు.. ఇక తర్వాత అవని ఆరాధ్యకు లోపల చూపించండి నేను బయటకు వెళ్లి మొత్తం చూస్తాను అని బయటకు వస్తుంది.. పల్లవి ఫోన్ చేసి ఆమె బయటకు వచ్చింది అని చెప్పగానే అతను తన ప్లాన్ ని వర్కౌట్ చేసే పనిలో ఉంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..