Illu Illaalu Pillalu Dheeraj : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న సీరియల్స్ లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. కుటుంబంలో జరుగుతున్న పరిస్థితుల ఆధారంగా రూపొందిన ఈ సీరియల్ జనాలని బాగా ఎమోషనల్ గా కట్టిపడేస్తుంది.. కుటుంబంలోని పరిస్థితులను బట్టి మనుషుల మధ్య బంధాలు ఎలా ఉంటాయి? బంధుత్వాలు ఎలా ఉంటాయి అన్నది ఈ సీరియల్ స్టోరీ… ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రతిరోజు డిఫరెంట్ ట్విస్ట్ లతో వస్తున్నా ఈ డైలీ సీరియల్ లో రామరాజు మూడవ కొడుకు పాత్రలో నటించాడు ధీరజ్.. ఈయన గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ధీరజ్ కి రామరాజుకి మధ్య నిజమైన సంబంధం ఉంది అంటూ ఓ వార్త నెట్టింట్లో ప్రచారంలో ఉంది.. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య ఉన్న అసలు సంబంధం ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
ఈ సీరియల్లో రామరాజు పాత్రలో ఈటీవీ ప్రభాకర్ నటిస్తున్నాడు. కొడుకు పాత్రలో నితిన్ అద్వి నటిస్తున్నారు.. వీరిద్దరు కూడా తండ్రి కొడుకులు గా ఎవరికి వారే అన్నట్లు మంచిగా నటించారు.. అయితే తన తండ్రి మాటని వినకుండా.. తన కాళ్ళ మీద తన నిలబడడంతో పాటుగా తన భార్యను కూడా పోషించుకోవాలి అన్న పౌరుషంతో ఉంటాడు ధీరజ్. అంతే కాదు తన భార్య యొక్క కోరికను తీర్చడానికి ఎంత దూరమైనా వెళ్తాను అని ధీరజ్ అనుకుంటాడు. వీరిద్దరి మధ్య కన్వర్జేషన్ జనాలని బాగా ఆకట్టుకుంటుంది. అయితే ప్రభాకర్కు నితిన్ కొడుకు వరస అవుతాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ వీళ్ళిద్దరికీ తండ్రి కొడుకులు సంబంధం ఉంది అని ప్రచారంలో ఉంది. ఈ వార్తలపై వీరిద్దరిలో ఎవరో ఒకరు రెస్పాండ్ అయి క్లారిటీ ఇస్తే కానీ అసలు నిజం ఏంటో తెలియదు..
Also Read :ఎమోషనల్ అయిన అవని.. రాజేశ్వరిని నిజం చెప్పిన చక్రధర్.. పార్వతికి టెన్షన్..
రామరాజు రెండవ కొడుకు సాగర్ ఇంట్లోని డబ్బులను దొంగతనం చేసి గవర్నమెంట్ ఉద్యోగాన్ని కొనుక్కుంటాడు. లంచం తీసుకొని ఉద్యోగాన్ని కొన్నావా అంటూ రామరాజు తన కొడుకు పై కోపాన్ని పెంచుకుంటాడు. భర్త చేసిన తప్పుడు పనిని వెనకేసుకొని వచ్చింది అని నర్మదను కూడా దూరం పెట్టేస్తారు రామరాజు దంపతులు. నర్మదా తన భర్త చేసిన పనిని దాచి పెట్టిందని రామరాజు దంపతులు ఆమెపై కూడా కోపంగా ఉంటారు. అయితే నర్మదకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతాయి. ఎలాగైనా సరే తన భర్తను మంచి దారిలోకి తీసుకురావాలని ఆలోచిస్తుంది నర్మదా. మరి నర్మదకును వేదవతి అర్థం చేసుకుంటుందా..? మళ్లీ తన కోడల్ని దగ్గర తీసుకుంటుందా..? ధీరజ్ ప్రేమలో కొత్త కారుని కొంటారా? శ్రీవల్లి భాగ్యం అనుకున్నట్లుగా రైస్ మిల్లు బాధ్యతని ఆనందరావు తీసుకుంటాడా? విశ్వం అమూల్య పై చేయి సాధిస్తాడా..? ఇలాంటి వాటికి సమాధానం దొరకాలి అంటే కచ్చితంగా ప్రతిరోజు ఈ సీరియల్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..