Kadiri Child Murder: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఐదేళ్ల కుమారుడిని తల్లి అతి దారుణంగా చంపింది. దీంతో ఈ సంఘటన కలకం రేపింది. ముక్కుపచ్చలారని పసిగుడ్డును చంపడంతో పాటు భర్తను నమ్మించే ప్రయత్నం చేసింది.
శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 12న కొడుకును తల్లి చంపింది. అనారోగ్యంతో కొడుకు మృతి చెందినట్లు భర్త డాక్టర్ విజయ్ బాబును సైతం నమ్మించింది. దీంతో భార్యపై అనుమానంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో కదిరే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసారు.
Also read: JNTUH Inspections: మేడ్చల్లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్టీయూహెచ్ దాడులు!
పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొడుకును తల్లి నందిని మెడకు చున్నీతో బిగించి హత్య చేసినట్లు కదిరి పోలీసులు నిర్ధారించారు. కుటుంబ కలహాలతో కొడుకును చంపినట్టు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు నందినిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా నందినికి 14 రోజులు రిమాండ్ను కోర్టు విదించింది. దీంతో నిదితురాలును అనంతపురం సబ్ జైలుకు తరలించారు.
Also read: SVIMS Admissions: తిరుపతి స్విమ్స్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!