E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లి దెబ్బకు నర్మదకు షాక్.. శోభనం క్యాన్సిల్..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లి దెబ్బకు నర్మదకు షాక్.. శోభనం క్యాన్సిల్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి పెద్దోడి శోభనానికి ముహూర్తం పెట్టించానండి. అలాగే నర్మదా వాళ్ళకి కూడా ఈరోజే శోభనం జరిపిద్దామని అడుగుతుంది. ఇంటి కోసం తన ప్రేమనే పెద్దోడు త్యాగం చేశాడు. పెళ్లి కాలేదని ఎందరో ఎన్నో అంటే అవమానాలు భరించాడు. ఇప్పటికీ ఓ మంచి అమ్మాయిని ఆ దేవుడు వాడి కోసం పుట్టించాడు.. పెళ్లయింది ఒక పిల్లో పిల్లోడ పుడితే వాడి జీవితం సార్థకమవుతుందని రామరాజు అంటాడు. అలాగే కానించి బుజ్జమ్మ ని శోభనం ఏర్పాట్లు చేయించు అని అని అంటాడు. ఇక అన్నానంటే అన్నారంటారు కానీ నర్మద వాళ్ల గురించి కూడా మీరు ఆలోచించాలి అని అంటుంది. బుజ్జమ్మ పంతులును అడిగి మరి ఇద్దరు కొడుకులకు శోభనం ఏర్పాట్లు చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. చందు, సాగర్ శోభనం జరుగుతుందని సంతోషంగా ఉంటారు. ఎప్పుడు శోభనం గదిలోకి వెళ్తామా అని వెయిట్ చేస్తుంటారు. అటు కామాక్షి ఇద్దరు మరదళ్లను శోభనానికి రెడీ చేస్తుంది. అయితే ఏదైనా అంటే అన్నాను అంటారు కానీ ఫైనాన్స్ కోడలు మరదలు కన్నా గవర్నమెంట్ మరదలే శోభనం చీరలో అందంగా ఉంది అని నర్మదను పొగిడేస్తుంది. నర్మద మాత్రం అక్క కూడా చాలా బాగుంది అని అంటుంది. ఏం బాగుంది నేను ఎంతోమందిని రెడీ చేశాను కానీ నిన్ను చూసినంతగా ఎవరిని చూడలేదు అని అంటుంది. నీకు తక్కువ నగలే వేశాను సింపుల్ గానే చీర కట్టాను నువ్వు చాలా అందంగా ఉన్నావు. అదే ఆవిడకి మరి చెట్టుకు చీర కట్టినట్టు ఉంది. నగలు అంటావా ఏదో దండం మీద వేసినట్లు ఉన్నాయి అని దారుణంగా అవమానిస్తుంది…

Advertisement

ఆ మాట వినగానే శ్రీవల్లి ఏడ్చుకుంటూ బయటికి వెళ్లిపోతుంది. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్తుంది. నేను ఇక్కడ ఉన్నాను అమ్మ నేను వచ్చేస్తాను అని భాగ్యంతో అంటుంది శ్రీవల్లి. నువ్వు అందంగా లేవని ఎవరన్నారు నువ్వు చాలా అందంగా ఉన్నావ్ ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ అందం గురించి కాదు. ఆ నర్మదా సాగర్ లకు పిల్లలు పుడితే నిన్ను మీ అత్తమామలు పట్టించుకోరు ముందు నిన్ను నువ్వు కాపాడుకో వాళ్ళకి శోభనం జరగకుండా చెయ్యి అనేసి ప్లాన్ చెబుతుంది. తనకి శ్రీవల్లి నువ్వు ఎలాగ చెప్తే అలాగే అమ్మ అనేసి అంటుంది.

వేదవతి రామరాజు ఇద్దరూ కొడుకులకు శోభన జరుగుతున్న సందర్భంగా సంతోషంగా ఉంటారు. మనిద్దరి కొడుకులకి పిల్లలు పుడితే నేనొక్కదాన్నే కాదు చూసుకోవాల్సిన సుమీ మీరు కూడా చూసుకోవాలని వేదవతి సరదాగా అంటుంది. మీరు రైస్ మిల్లు పక్కన పెట్టేసి పిల్లల్ని మాత్రమే చూసుకోవాలి అని అంటుంది. నా మనమని తీసుకొని రైస్ మిల్కీ వెళ్ళిపోతాను అని సరదాగా రామరాజు కూడా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే శ్రీవల్లి ఏడ్చుకుంటూ అక్కడికి వచ్చేస్తుంది. మావయ్య గారు అండి అత్తయ్య గారండి మీకు విషయం చెప్పాలి కానీ నా నోటితో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని కాస్త ఆలోచిస్తుంది.

Advertisement

మా శోభనాన్ని ఆపేయండి మావయ్య గారు అత్తయ్య గారు అని అడుగుతుంది.. ఆ మాట వినగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. వేదవతి ఏమైందమ్మా ఎందుకిలా అంటున్నావ్ ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతుంది. కి చూర్ కింద రెండు శోభనాలు జరిగితే అస్సలు బాగోదంట ఆ ఇంట్లో కీడు జరుగుతుంది అంట. ప్రాణమే పోయే ప్రమాదం ఉందని పంతులుగారు చెప్పారు అని అంటుంది. నేను పంతులు గారిని అన్ని కనుక్కొని మీ ఇద్దరికీ శాంతి ముహూర్తం ఏర్పాటు చేశాను. నీకు ఆ టెన్షన్ ఏం అవసరం లేదు అని వేదవతి అంటుంది. కానీ శ్రీవల్లి మాత్రం ఇప్పటివరకు ఇల్లు పచ్చగానే ఉంది నేను అడుగుపెట్టిన తర్వాత ఇలా మారితే అందరూ నాదే తప్పు అంటారు. మీరు ఆలోచించండి అత్తయ్య గారు అని అంటుంది. అప్పుడు అక్కడే ఉన్నా నర్మదా సాగర్లు ఫస్ట్ అన్నయ్యకి వదినకి శోభనం ఏర్పాట్లు చేద్దాం ఆ తర్వాత ముహూర్తం చూసుకొని మేము శోభనం చేసుకుంటామని అంటారు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో నర్మద శోభనం ఆగిపోతుందా? లేదా? అన్నది చూడాలి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×