Illu Illalu Pillalu Today Episode February 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. 20 లక్షల గురించి ఆలోచిస్తూ సాగర్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అయితే నర్మదా సాగర్ కి భోజనం తీసుకొని వస్తుంది. భర్త రోజంతా నిలబడి పని చేశాడు అలాంటిది ఇప్పుడు నేను భోజనం పెట్టకుండా ఉంటే ఎలా ఉంటుంది. నీకు భోజనం తినిపిస్తాను అని భోజనం తినిపిస్తూనే నర్మదా సాగర్ ని నువ్వు ఎప్పుడు ఎగ్జామ్ రాసావు అని అడుగుతుంది. సాగర్అనుమానం వస్తే నర్మదైక వదిలిపెట్టదు అని అనుకుంటాడు..
అసలు ఆ 20 లక్షలు నువ్వు ఎక్కడకి తీసుకొని వెళ్లావు అర్థం కావడం లేదు అని నర్మదా అంటుంది.. ఒకసారి నా ఫ్రెండ్ కు కాల్ చేసి మీ ముందే మాట్లాడుతాను అని నర్మదా అంటుంది.. నా ఫ్రెండ్ రమ్య కి ఫోన్ చేసి విషయాన్ని కనుకుంటుంది దాంతో సాగర్ షాక్ అవుతాడు.. ఇక సాగరు నర్మదకు దొరికిపోయానని అసలు విషయాన్ని బయట పెట్టేస్తాడు.. నువ్వు నన్ను మోసం చేశావని షాక్ అవుతుంది నర్మదా.. సాగరు నర్మదను బ్రతిమలాడుతూ ఉంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. శ్రీవల్లి అక్కడికి వచ్చి నేను ముగ్గు వేయడం నేర్పిస్తాను లెండి అని అంటుంది. అమూల్యని ఎంతగా బతిమిలాడినా సరే నువ్వు చేయడం వలన నా జీవితం ఇలా మారింది అని బాధ పడిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసిన ప్రేమ ఏం మాట్లాడుతున్నావ్ వల్ల అక్క అని గట్టిగా అరుస్తుంది.. ఏమీ లేదు ముగ్గు వేయడం నేర్పిస్తున్నాను ఆ ఇంట్లో వాళ్ళు నిన్ను సరిగా చూసుకుంటున్నారా లేదా అని అడుగుతున్నాను అంతే అని ప్రేమ అంటుంది.. ఇక శ్రీవల్లి లోపలికి వెళ్ళగానే ప్రేమ ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితులను బయట పెట్టొద్దు అని మాట తీసుకుంటుంది.. నువ్వు బాధపడితే ఇంట్లోనే వాళ్ళు కూడా బాధపడతారు.. విశ్వం నిన్ను బాధ పెట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఒకవేళ నువ్వు వాడికి భయపడితే మాత్రం నిన్ను చూసి ఇంట్లోనే వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు.
నువ్వు ఎట్టి పరిస్థితులను ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి అని ప్రేమ అమూల్యకు హీత బోధ చేస్తుంది. ఇక ధీరజ్ రావడంతో ప్రేమా మీ అన్నయ్య వస్తున్నాడు నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత ధీరజ్ తన కారుని ఫ్రెండ్స్ తీసుకుని వెళ్లి చెట్టుకు గుద్దేసి యాక్సిడెంట్ చేశారని మాట్లాడి టెన్షన్ పడిపోతూ ఉంటాడు. వాళ్ళు అనుకున్నట్లుగానే కారుని ఆక్సిడెంట్ గురి చేశారంట మా ఓనర్ నన్ను తిడుతున్నాడు.. ఆ కార్ ఎక్కడుందో కనుక్కోవాలి ఫస్ట్ నేను ఓనర్ తో మాట్లాడాలి అని ధీరజ్ వెళ్తూ ఉంటాడు.
ప్రేమ నువ్వు ఒక్కడివే వెళ్తే బాగోదు రా నీకు ఆవేశం ఎక్కువ ఖచ్చితంగా అక్కడికి వెళ్లి గొడవ పెట్టుకుంటావు అందుకే నేను కూడా నీతో వస్తాను అని ప్రేమ ధీరజ్ తో పాటే వెళ్తుంది.. ఇక తర్వాత ఇంట్లో రామరాజు చందు రైస్ మిల్లులో వచ్చిన లాభాలలో 2000 తగ్గాయని టెన్షన్ పడిపోతూ అవి ఎక్కడ తగ్గాయో లెక్కలు వేస్తూ ఉంటారు. అయితే ఆ 2000 ఎక్కడికి వెళ్ళాయో అర్థం కావడంలేదని ఇద్దరు బుర్ర గోక్కుంటారు. అయితే ఈ 2000 నేనే కొట్టేసింది అని ఆనంద్ రావు అనుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీవల్లితో ఇప్పుడు మనం సీన్లో కి దిగాలి అని అంటుంది భాగ్యం..
అన్నయ్య గారు మీతో ఒక విషయం చెప్పాలంటే అని భాగ్యం అంటుంది. ఇప్పుడు బ్యాంకు ఓపెన్ చేసే టైం అయింది కదా అన్నగారు నిన్న ఆ వనజ వచ్చి చాలా గోల చేసింది ఆవిడకి సాగర్ నీ డబ్బులు తెచ్చి ఇవ్వమని అన్నారు కదా మీరు ఒకసారి డబ్బులు తీసుకురమ్మని చెప్తారని గుర్తు చేశానని రామరాజుతో అంటుంది భాగ్యం.. అవునమ్మా సమయానికి బాగానే గుర్తు చేశావు. సాగరు ఆ డబ్బులు తీసుకొని ఇచ్చి ఇవాళ కట్టాలి లేదంటే ఆ వనజ దగ్గర మళ్లీ పరువు పోతుంది అని అంటుంది.. అయితే సాగర్ నీ పిలవమని వేదవతి తో చెప్తాడు రామరాజు.
Also Read : శ్రీయకు స్ట్రాంగ్ వార్నింగ్..పల్లవికి దిమ్మతిరిగే షాక్.. జైలు నుంచి చక్రధర్ రిలీజ్..?
శ్రీవల్లి సాగర్ ని పిలుస్తుంది. ఆ వనజ గారికి డబ్బులు ఇవ్వమని మీకు చెప్పారు కదా మరి అతను కొత్త జాబు మోజులో పడిపోయి మర్చిపోయినట్లున్నాడు.. మీరు అల్లుడుగారు ఎలాగో డబ్బులు విషయంపై బ్యాంకుకు వెళ్తున్నారు కదా మీరే స్వయంగా వెళ్లి ఆ డబ్బులని వాళ్లకి ఇస్తే బాగుంటుంది కదా అని భాగ్యం అంటుంది నేను ఆ డబ్బులు ఇస్తాను నాన్న అని ఎంతగా అంటున్న సరే భాగ్యం చెప్పిన మాటను విని రామరాజు పాస్ బుక్ ని అడగమని చందూతో చెప్పాడు. పలు ఉద్యోగస్తులు కదరా మనం మూటలు మూసుకునే వాళ్ళం ఆ డబ్బులని మనమే తెచ్చి ఇద్దామని రామరాజు అంటాడు కానీ సాగర్ భయపడిపోతూ ఉంటాడు అప్పుడే సీన్లోకి ఎంటర్ అయిన నర్మదా అతనికి ఇచ్చిన బాధ్యతని అతనే పూర్తి చేస్తాడు అని రామరాజుతో అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…