E-Paper
Advertisement

Rain Alert: జాగ్రత్త..! రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలో వడగండ్ల వానలు

Rain Alert: జాగ్రత్త..! రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలో వడగండ్ల వానలు
Advertisement

Rain Alert: వేసవికాలం వస్తున్న తరుణంలో భారీగా వర్షాలు.. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరానికి సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ వ్యవస్థ ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తెలంగాణ వైపు భారీగా తేమ గాలులు వీస్తున్నాయి. ఫలితంగా, ఫిబ్రవరి 22, 23, 24 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం కూడా ఉంది.

ఈ జిల్లాలో భారీ వర్షాలు..
నేటి నుంచి మొదలుకుని మరో రోజులు భారీ వర్షాలు.. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట, సూర్యాపేట, భద్రాచలం వంటి జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఫిబ్రవరి 22న ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాలలో వర్షాలు ప్రారంభమై, 23, 24 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన (Hailstorms) పడే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు – ఉక్కపోత..
వర్ష సూచన ఉన్నప్పటికీ, అల్పపీడన గమనం వల్ల గాలిలో తేమ శాతం పెరిగి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. శుక్రవారం నాడు భద్రాచలంలో 36.2°C, ఆదిలాబాద్‌లో 35.8°C, ఖమ్మంలో 35.4°C గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం 35-42% మధ్య ఉండటంతో ప్రజలు తీవ్రమైన ఉక్కపోతకు గురవుతున్నారు. వర్షాలు కురిసిన తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

రైతులకు హెచ్చరిక..
ఈ అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కావున, ప్రస్తుతం రాష్ట్రంలో యాసంగి పంటలు కోత దశలో ఉన్నందున, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. కోసిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వడగండ్ల వాన ముప్పు ఉన్నందున తోటల పెంపకందారులు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు కోరుతున్నారు.

Advertisement

Also Read: బిగ్ టీవీ చైర్మన్ కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు.. చామల కిర‌ణ్ కుమార్ రెడ్డి

జాగ్రత్తలు..
ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు, ప్రయాణీకులు వాతావరణ పరిస్థితులను గమనించి తదనుగుణంగా తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. రాబోయే 48 గంటల్లో వాతావరణంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు అధికారిక బులిటెన్లను ఫాలో అవ్వడం శ్రేయస్కరం.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×