Illu Illalu Pillalu Today Episode March 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదని ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆయన లంచం ఇచ్చి ఉద్యోగం కొన్నాడు అని హేళన చేస్తూ అవమానిస్తారు. వాళ్ల మాటలు విన్న నర్మదా బాధ పడిపోతుంది.. అయితే నర్మదతో పాటు పనిచేస్తున్న మరొక ఆవిడ అక్కడికి వచ్చి నర్మద గురించి మనకు తెలియదా ఎందుకు మీరు ఇలా తప్పుగా మాట్లాడుతున్నారు అని అంటుంది.. ఏరోజైనా లంచాలు తీసుకొని తప్పు చేసిందా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు కొంచెం బుద్ధుండాలి అని ఆమె ఇద్దరిని కడిగి పడేస్తుంది. నర్మదా నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నేను ఇంటికి వెళ్తాను అని వెళ్ళిపోతుంది.. ధీరజ్ డబ్బుల కోసం టెన్షన్ పడుతున్నాడు అని ప్రేమ బాధ పడిపోతుంది.. ఎలాగైనా సరే వాడిని ఈ మూడు నుంచి బయటికి తీసుకురావాలని ఐస్క్రీం కొనివ్వమని బ్రతిమలాడుతుంది.. ఇద్దరు కలిసి కాసేపు ఐస్ క్రీమ్ తింటూ సరదాగా మాట్లాడుకుంటారు.. అయితే ధీరజ్ బాధపడిపోతూ ఉంటే ఏంటి డబ్బులు కోసం బాధపడిపోతున్నావా మరేం బాధపడకు రా.. నా నగలు ఉన్నాయి కదా.. వాటిని తాకట్టు పెట్టి ఆ కారు కొందాం ఆ తర్వాత మళ్లీ నువ్వు ఇద్దువు అనేసి ప్రేమ అంటుంది..
ఆ మాట వినగానే ధీరజ్ షాక్ అవుతాడు.. అమ్మ తల్లి ఇంట్లో జరుగుతున్నవి సరిపోవా ఇప్పుడు మళ్లీ నువ్వు నగల గురించి తీసుకొస్తావేంటి అని అంటాడు.. మీ నాన్న కాళ్ళ మీద పడరా అప్పుడు నీకు డబ్బులు ఇస్తాడు కదా అని అంటే మా నాన్న కాళ్ళ మీద పడడం నాకు ఇబ్బంది కాదు. కానీ మా నాన్నకు తెలియకుండా నేను పైకి రావాలి అన్నది నా పాలసీ. అందుకే నేను మా నాన్న దగ్గరికి వెళ్లడం లేదు అని ధీరజ్ అంటాడు.. నర్మదా ఆఫీసులో తనని అందరూ బాధపెట్టారని బాధపడిపోతూ వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. రామరాజు తిరుపతిని తీసుకొని కలెక్షన్ల కోసం ఎక్కడికి వెళ్లాలో చూపిస్తానని వెళ్తాడు.. ఇక్కడికి వెళ్ళగానే కలెక్షన్స్ డబ్బులు కోసం అడుగుతాడు.. మొదటినుంచి మా తిరుపతి మీ దగ్గర డబ్బుల కోసం వస్తాడని చెప్తారు.. అద్దెను వసూలు చేసుకోవడానికి వచ్చిన సేన సాగర్ గురించి అడగ్గానే దారుణంగా అవమానిస్తాడు. ఆ తర్వాత రామరాజు కొడుకు ఎలాంటి పని చేశాడో తెలుసా అని చెప్పేసి అతని అవమానించేస్తాడు.. అతను కూడా వాళ్ళు చెప్పింది నమ్మేసి రామరాజు గురించి తప్పుగా అనుకుంటారు.. భద్ర కూడా వచ్చి చెప్పడంతో అక్కడ అవమానంగా ఫీల్ అయిన రామరాజు వెళ్లిపోతాడు..
ఇన్ని రోజులు ఆ రామరాజు గాడు పడుకున్నాడు నాకు ధైర్యం ఉంది అని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. కానీ అలాంటి వాడే డబ్బులతో గవర్నమెంట్ సంపాదించడంతో కుంగిపోతున్నాడు. చాలా సంతోషంగా ఉంది అక్క అని భద్రసేన ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. ఏంటి బావ అలా వదిలేసావు. గట్టిగా బుద్ధి చెప్పి ఉంటే సరిపోయేది కదా అని తిరుపతి అంటున్న సరే రామరాజు మన వైపు తప్పుంది కాబట్టి.. మౌనంగానే ఉండాలి అని అంటాడు.. కానీ వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు బావ అదే నాకు నచ్చలేదు అని తిరుపతి ఫీలవుతూ ఉంటారు.
మిల్లు నుంచి ఇంటికి వచ్చినా శ్రీవల్లి దగ్గరికి వేదవతి వస్తుంది.. మీ మామయ్య గారు మిల్లు కొచ్చారు కదా ఉన్నారా ఎలా ఉన్నారు అని అడుగుతుంది. మావయ్య గారికి ఏమైంది బాగానే ఉన్నాడు కదా మరి కొత్తగా అడుగుతున్నావేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. అది కాదే బాధపడుతున్నాడా సంతోషంగా అన్ని పనులు చేసుకుంటున్నాడా అని వేదవతి అడుగుతుంది.. మావయ్య గాన్ని చూసుకోవడానికి నేను మీ పెద్దబ్బాయి గారు ఉన్నాం కదా మీరు ఏమీ కంగారు పడకండి. మిగిలిందంతా మేము చూసుకుంటాము మీరు రెస్ట్ తీసుకోండి అని వేదవతితో శ్రీవల్లి అంటుంది.
అది సరే కానీ ఇప్పుడు మీ మామయ్య ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు అని అడుగుతుంది వేదవతి. మావయ్య గారు చాలా బాగున్నారు షాపుల నుంచి కలెక్షన్ కోసం తిరుపతి బాబాయ్ ని తీసుకొని వెళ్ళాడు అని అనగానే శ్రీవల్లి నోట్లో చక్కర పోయాలి మంచి న్యూస్ చెప్పావు అని అంటుంది వేదవతి. అప్పుడే ఇంట్లో కూర్చున్నా నర్మదా ఎలాగైనా సరే ఈరోజు వేదవతి తో మాట్లాడాలి అని వెనకాలే అత్తయ్య అత్తయ్య అని పిలుస్తుంది. కానీ వేదవతి మాత్రం అసలు వినకుండానే కావాలనే నానా మాటలు అనేస్తుంది.. మీ గవర్నమెంట్ ఉద్యోగి మీతో మాట్లాడాలనుకుంటుంది అని ఇంకాస్త రెచ్చగొట్టేలా శ్రీవల్లి మాట్లాడుతుంది..
Also Read :బాలు ప్లాన్ గ్రాండ్ సక్సెస్.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావే.. మరోసారి మోసపోయిన మనోజ్..
తలకి నూనె పెడతాను తీసుకురా పో అని మళ్లీ నేను పంపిస్తుంది వేదవతి. అయితే వల్లి రాగానే తలకి కొబ్బరి నూనె పెడుతూ వేదవతి నర్మదపై సీరియస్ అవుతుంది.. అటు నర్మదా ఎంతగా మాట్లాడాలి అని అనుకుంటున్నా సరే వేదవతి మాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. చేసినంత చేసి ఇప్పుడు అత్తయ్యని నైస్ గా మాట్లాడితే ఎలా కరిగిపోతాను అని అంటుంది. ఇక తర్వాత వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా నర్మదా పిలుస్తుంది. ప్రేమ ఎలాగైనా సరే సెంటిమెంటల్ గా కొట్టాలి అని నర్మదని కావాలని కింద పడేస్తుంది.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి సోమవారం ఎపిసోడ్లో నర్మదను వేదవతి క్షమిస్తుందా లేదా చూడాలి…