Intinti Ramayanam Today Episode April 18th: శ్రీయ శ్రీకర్ని మట్టిబుర్రని అక్షయతో కలిపి తిడుతుంది. మట్టిబుర్రని అంటావేంటి అన్నదమ్ములు అందరూ కలిసి బిజినెస్ చేసుకుంటూ చాలా బిజీగా ఉండాలని అనుకుంటారు.. వాళ్లు పైకి వెళ్లడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. అవని శ్రీయని తిడుతున్నా కూడా శ్రీకర్ మౌనంగా ఉండడంతో తను చూసారా అత్తయ్య నేను బయట ఉన్న సరే నన్ను ఇంతగా పెట్టనుంచి ఎలా ఇస్తుంది మీ పెద్ద కోడలు. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారు కొంచమైనా మీరు ఆలోచించరా అని శ్రియ అడుగుతుంది. ఇందులో పల్లవి కూడా ఏదో ఒకటి అనడంతో పార్వతీ సీరియస్ అవుతుంది.. శ్రీయ మాత్రం నేను ఎక్కడికి రాను అని గట్టిగా తెగేసి చెప్తుంది దాంతో అందరూ షాక్ అవుతారు.
శ్రేయ ఎంత చెప్పినా సరే మొండిగా ఉండడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక తను అక్కడికి రాదు అని అనుకుంటారు.. అవని మాట్లాడడానికి ప్రయత్నించినా సరే నువ్వు ఇందులో మాట్లాడద్దు నీతో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు అని శ్రియ అవనిని అవమానించేలా మాట్లాడుతుంది. మీరు ఇంకెవరు నాతో మాట్లాడడానికి వీల్లేదు ఇకనుంచి వెళ్ళిపోండి అని శ్రేయ అనగానే అందరూ కూడా ఒక్కసారిగా బాధపడిపోదు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. శ్రేయ ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి అని అందరూ అనుకుంటూ ఉంటారు. శ్రీకర్ మాత్రం తన కుటుంబం బాధపడుతూ వెళ్తుంది అని అనుకుంటాడు.
శ్రియ మాటలకు బాధపడ్డ శ్రీకర్ తన వాళ్లని బాధ పెడుతున్నాను అని అనుకుంటాడు. తాను ఏం చేసినా ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నాను అని అనుకుంటాడు. కడుపుతో ఉన్న శ్రియని ఎలాగైనా సరే మంచిగా మార్చుకోవాలని ఎంత ప్రయత్నించినా సరే తాను మాత్రం ఆ ఇంటికి రాను అని చెప్తుంది. ఆ ఇంట్లో వాళ్ళు నాకు గౌరవం ఇవ్వకపోయినా నేను అక్కడే ఉండాలా ఎలా కనిపిస్తున్నాను శ్రీ అని తను అంటుంది. ఆ మాటతో శ్రీకర్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.
తన కొడుకు దూరం అయిపోయాడు అని బాధపడుతున్న పార్వతిని చూసి అవని బాధపడుతుంది. ఎంతగా ఓదార్చడానికి ప్రయత్నిస్తున్న సరే అక్షయ్ అవన్నీల దగ్గర పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తాను ఏం చెప్పినా సరే మాట వినదు అని వాళ్ళు అనుకుంటారు.. ఇంకా శ్రీకర్ ఈ ఇంటికి రాడేమో అని పార్వతి బాధ పడిపోతూ ఉంటుంది. అక్షయ అవని ఇద్దరు కూడా అమ్మ ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను అని అనుకుంటారు.. స్వీకరిని ఒప్పించిన సరే శ్రేయ మాత్రం తన మాట కూడా వినడం లేదు అని వాళ్ళు అనుకుంటారు. ఏదో ఒకటి చేసి శ్రీకర్ శ్రీయను మళ్లీ ఇంటికి తీసుకురావాలి అని అవని అంటుంది.. తను ఏం చెప్పిన సరే మాట వినడం లేదు అని అందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు..
తన కుటుంబాన్ని ఎలాగైతే చిన్నభిన్నం చేశారో ఇప్పుడు అవని వల్లే ఆ కుటుంబం మళ్లీ ఇలా మారిపోయింది అని పల్లవి చాలా సంతోషంగా డాన్సులు వేస్తూ ఉంటుంది.. కమల్ తన అన్న వదిన ఇంట్లోంచి వెళ్లిపోవడం బాధగా ఉంది అని అనుకుంటాడు.. పల్లవి బాధపడుతున్నట్లు నటిస్తూనే ఇంట్లో వాళ్ళని ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అయితే కమల్ కూడా పల్లవికి దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తూనే ఉంటాడు. ప్రతిరోజు ఏదో ఒక సమస్య వస్తుంటే నువ్వు మాత్రం ఎలా దాన్ని ఇంకా పెద్దది చేయాలా అని చూస్తావని అవని కూడా పల్లవికి వార్నింగ్ ఇస్తుంది.
భరత్ తన ఆఫీసులో ఉన్నాడన్న సంతోషంతో రాజేశ్వరి తన కొడుకు తన దగ్గరే ఉన్నాడని చాలా సంతోషంగా ఉంటుంది. భరత్ తినడానికి ఏదైనా తెచ్చుకున్నావా అని తన దగ్గరికి వెళ్లి అడుగుతుంది. ఏంటి ఓన్లీ ఆవకాయ మాత్రమే తెచ్చుకున్నావు అని భరత్ ని అడగ్గానే ఇవాళ టైం లేదు కదా మేడం అందుకే ఇలా పెట్టారు అని ఏదో ఒకటి చెప్పి సర్దుకుంటాడు.. కాని రాజేశ్వరి మాత్రం తన కొడుకుకి తన చేతితోనే వడ్డించాలి అని అనుకుంటుంది.. అయితే భరత్ ని తన క్యాబిన్ కి తీసుకుని వెళ్లి దగ్గరుండి ప్రేమగా వడ్డిస్తుంది. భరత్ నీకు ఇష్టమైన ఏదో చెప్పు అని అడుగుతుంది కానీ భరత్ మాత్రం మొహమాట పడినా కానీ ఇప్పుడు మాత్రం నాకు చేపల పులుసు అంటే చాలా ఇష్టమని చెప్తాడు. కొడుకు కోసం చేపల పులుసు చేసుకొని వచ్చి దగ్గరుండి తినిపించాలని రాజేశ్వరి అనుకుంటుంది. ఇలానే కొనసాగితే మరికొన్ని రోజుల్లో భరత్ తనకు దగ్గరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…