Intinti Ramayanam Today Episode April 12th: మీనాక్షి పొద్దున వెళ్లిన చక్రధర్ఇంకా ఇంటికి రాలేదు అని కంగారు పడిపోతూ, గుమ్మం చుట్టూ ఎదురు చూస్తూ ఉంటుంది.. పొద్దున అనగా వెళ్లినా మీ చక్రధర్ మామయ్య ఇంకా ఇంటికి రాలేదు.. అని మీనాక్షి అనగానే వస్తాడులే అత్తయ్య అని ప్రణతి అంటుంది.. అప్పుడే ఇంటికి వచ్చిన భరత్ ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు ఆయన గారు లేరా అని అడుగుతాడు.. మనకు కావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదు అని ఎవరికోసమైనా టెన్షన్ పడతారు అని భరత్ తో మీనాక్షి అంటుంది. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన ఆయన గురించి నువ్వు ఆలోచిస్తున్నావు గాని మనం పడ్డ బాధల గురించి నువ్వు ఆలోచించట్లేదు అని మీనాక్షి పై సీరియస్ అవుతాడు భరత్..
అసలు నిన్నగాక మొన్న వచ్చిన ఆయన గురించి నువ్వు ఇంతగా పట్టించుకుంటున్నావు. కానీ కొడుకు మీద నీకు ఏమాత్రం ప్రేమ లేదు అని భరత్ అంటాడు.. నువ్వు ఏమనుకున్న పర్వాలేదు కానీ ఆయన ఇంకొక నాలుగు రోజుల్లో ఇకనుంచి కాళీ చేయకపోతే నేను నీకు శాశ్వతంగా దూరమైపోతాను అని అంటాడు.. ఏంటమ్మా ప్రణతి వీడి కోపం నాకు అర్థం కావడం లేదు ఆయన అక్కడ లేదు అని ఇక్కడికి వచ్చాడు. కన్న తండ్రి గురించి అలా మాట్లాడితే ఏం చెప్పాలి అని అంటుంది.. నువ్వు ఒకసారి వాడికి అర్థమయ్యేలా చెప్పు అని ప్రణతితో చెప్తుంది. కానీ ప్రణతి మాత్రం మీరు చెప్తేనే వినలేదు నేను చెప్తే వింటాడా అని అడుగుతుంది.
అవనీని కలిసిన మీనాక్షి భరత్ చెప్పిన విషయాన్ని అవనితో చెప్తుంది. భరత్ ఎంత చెప్పినా సరే మీ నాన్న గురించి తప్పుగానే అర్థం చేసుకుంటున్నాడు.. ఒకవైపు తన గురించి ఏం ఆలోచించినా కూడా అతను మాత్రం తప్పుగా అని అనుకుంటున్నాడు.. ఆయనని ఎలా వెళ్ళిపొమ్మని చెప్పాలి వాడు మాత్రం ఇలా మొండిగా ఉంటున్నాడు అని మీనాక్షి అవనితో అంటుంది. కానీ అవని మాత్రం నాన్న కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పిన్నికి అవ్వడానికి కారణం ఆయనే.. నాన్న మళ్ళీ ఎక్కడికి వెళ్లి పోతే బాగుంటుంది అని అవని అంటుంది. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని మీనాక్షి కూడా అంటుంది..
నర్సు రాజేశ్వరి గదిలోకి వెళ్లి అక్కడ తాను లేదు అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు.. పల్లవి కమలు మామ్ ఎక్కడికి వెళ్లిందో అర్థం కావట్లేదు బావ అని అనుకుంటుంది.. అసలు మామ్ ఇకనుంచి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది నాకు చాలా టెన్షన్ గా ఉంది బావా అని పల్లవి అంటుంది. నువ్వేమీ కంగారు పడకు ఎక్కడికి వెళ్లి ఉండదు ఇక్కడే ఉంటుంది అని కమలంటాడు. మిషన్ ఎలాగైనా సరే వదినకు చెప్పాలి అని వాళ్ళు చెప్పగానే అవని అక్కడికి వచ్చి పిన్ని ఎక్కడికి వెళ్లిందని వెతుకుతుంది. తనకి రాజేశ్వర్ ని కనిపెట్టి ఇంటికి తీసుకొని వెళ్తారు. అవని హారతి ఇచ్చి మరీ లోపలికి తీసుకురావడంతో పల్లవి షాక్ అవుతుంది.
ఇంటికి తీసుకెళ్లిన అవని తో రాజేశ్వరి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి పక్కకు రమ్మని పిలుస్తుంది. ఏమై ఉంటుందో ఏంటో అని అవని లోపలికి వెళ్తుంది. ఇద్దరి మధ్య అంతగా సీక్రెట్స్ ఏముంటాయి అని పల్లవి వాళ్ళ మాటల్ని వినాలని అనుకుంటుంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నా కొడుకు భరత్ నాకు ఇప్పుడు కావాలి నువ్వు తీస్కో చేస్తావని అడుగుతుంది.. అవనితో పాటుగా ఆ విషయం విన్న పల్లవి కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఏంటి భరత్ మామ్ కు కొడుకా? నేనే ఎలా మరి? అసలేం జరుగుతుంది. నేను ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలి అని పల్లవి అనుకుంటుంది. ఇక ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో పల్లవికి అసలు నిజం తెలుస్తుందా లేదా అన్నది చూడాలి.. ఏది ఏమైనా కూడా ఈ సీరియల్ మాత్రం ఇప్పుడు టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.
Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ నర్మద షాకింగ్ నిర్ణయం.. జీవితంలో ఆ తప్పు చెయ్యను..