Intinti Ramayanam Today Episode December 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ పిలిచినా భోజనానికి ఎవరూ రాలేరని అవని బాధపడుతుంది. మీరు కూర్చోండి నేను వెళ్లి తీసుకొస్తాను అని అవని అంటుంది. మీరు పిలిచినా కూడా వాళ్లు రారు అని అక్షయ్ అంటాడు. చక్రధర్ మామయ్య చేసిన అన్యాయం గురించి చెప్తేనే వీళ్ళు ఇలా అంటున్నారు. ఆయన మనల్ని ఇబ్బంది పెట్టడు అని మనకు నమ్మకం. బయటికి వచ్చిన తర్వాత ఆ దుర్మార్గుడు మరింతగా రెచ్చిపోతాడు.. నేను ఎంత చెప్పినా వీళ్లకు అర్థం కావడం లేదు అని అక్షయ్ అంటాడు. పల్లవి రాజేంద్రప్రసాద్ భానుమతి పార్వతి ఎవరు కూడా భోజనం చేయరు. ఎన్ని రోజులు ఉంటారో ఉండనివ్వు ఆ దుర్మార్గున్ని బయటికి తీసుకొచ్చే పనేలేదు అని అక్షయ్ అంటాడు. మా నాన్న జైల్లో ఉంటే నేను ఎలా తింటూ కూర్చుంటాను అని పల్లవి అంటుంది. మీ నాన్న ఏం అంత మంచివాడు కాదు నువ్వు అంతగా ఫీల్ అయిపోయి కడుపు మార్చుకోవడానికి.. నువ్వు రావు కదా మీది కూడా నేనే తినేస్తాను అని కమల్ అక్కడి నుంచి వస్తాడు. అమ్మ నాన్న రాలేదని తెలుసుకొని బాధపడతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… పల్లవి భోజనం చేయకుండా తన గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. పార్వతి నువ్వు ఉదయం నుంచి భోజనం తినలేదు కాస్త భోజనం చెయ్యమ్మా అని అడుగుతుంది. తన తల్లి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడిన అవని మా అమ్మ కోసం ఏమి చేయలేదు చూశారా మీరు తన తప్పుల్ని క్షమించి ఇంట్లోకి తీసుకొచ్చిన సరే తను మాత్రం మారలేదు అని పల్లవి ఇంకాస్త పార్వతీని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.. భానుమతి కూడా పల్లవికి తోడై పార్వతిని రెచ్చగొడతారు. పార్వతి ఆ అవని సంగతి నేను చూసుకుంటాను అని వెళ్ళిపోతుంది.
జైల్లో ఉన్న చక్రధర్కలవడానికి వెళుతుంది పల్లవి.. మిమ్మల్ని మామ్ అంతగా జైలు నుంచి తీసుకురావాలని ఎంత చెప్పినా సరే ఆ అవని మిమ్మల్ని తీసుకొచ్చేందుకు ఇష్టపడడం లేదు. అవని వల్లే మీరు ఇప్పుడు జైలు నుంచి బయటకు రాలేకపోతున్నారు డాడ్ అని పల్లవి అంటుంది.. నేను ఏమీ చేయలేకపోతున్నాను అవని చంపేద్దామని అంత కోపంగా ఉంది నాకు అని పల్లవి అంటుంది.. అవనిని చంపితే మనకి ఏమి రాదు మన ఆస్తి కూడా అవనితో పాటి పోతుంది.. అక్షయ్ నో లేకపోతే మీనాక్షినో చంపేస్తే మనం ఆ అవనికి కన్నీళ్లు మిగిల్చిన వాళ్ళం అవుతాము అని చక్రధర్ పల్లవి కుట్ర చేస్తారు..
తర్వాత అవని అక్షయ్ ఇద్దరు కూడా రాజేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్తారు.. వాళ్లను చూసిన రాజేశ్వరి చాలా కోపంగా అక్కడే ఆగండి అని అంటుంది. నా భర్తను విడిపించమని మిమ్మల్ని వేడుకున్న సరే మీరు అందుకు ఒప్పుకోలేదు ఇప్పుడు ఎందుకు నా ఇంటికొచ్చారు చచ్చాను బతికాను చూడడానికి వచ్చారా అని అంటుంది. మొన్నటి వరకు మీ భర్త గురించి అన్ని తెలిసిన మీరే తనకు శిక్ష పడాలని కోరుకున్నారు.. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని రాజేశ్వరిని అక్షయ్ అవని అడుగుతారు.. అక్కడికి వచ్చిన పల్లవి రాజేశ్వరిని ఇంకాస్త రెచ్చగొట్టి ఎలా చేస్తుంది. చక్రధర్ ని ఎట్టి పరిస్థితులను బయటికి తీసుకొచ్చే పని చెయ్యము అని అక్షయ్ అంటాడు. ఆ మాట విన్న పల్లవి రాజేశ్వరి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు..
పార్వతి బట్టలు ఆరేయడానికి వెళ్తే ఇటువంటి అత్తయ్య నేను ఆరేస్తాను అని అవని అంటుంది. కానీ పార్వతి మాత్రం ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంట్లోంచి వచ్చిన ఆరాధ్య. బామ్మ చచ్చిపోవాలని ఏదో చేసుకుంటుంది లోపలికి రండి అని అంటుంది.. భానుమతి తనపై పెట్రోల్ పోసుకొని చచ్చిపోవాలని అనుకుంటుంది. ఇంట్లో ఇవాళ అందరూ కూడా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఎందుకు చచ్చిపోవాలని అనుకుంటున్నావు అని అడ్డుపడతారు. ఈ వయసులో నా కూతురు పరిస్థితిని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నేను చచ్చిపోతాను అని అంటుంది.. నువ్వు మేమెంత చెప్పినా వినట్లేదు కదా ఆగు నీకు ఒకటి చూపిస్తాను అని అక్షయ్ లోపలికి వెళ్తాడు.
Also Read:కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. సత్యం, ప్రభావతిని కలిపిన సుశీల.. మనోజ్ కు షాక్..
ఆ తర్వాత పల్లవి ఇంట్లోంచి బయటికి వెళ్తున్న మీనాక్షిని చూసి ఆమెను ఫాలో అవుతుంది. బలే దొరికింది.. అసలు ఇలా దొరుకుతుందని అనుకోలేదు ఎలాగైనా దీన్ని ఈరోజు చంపేయాలి అని పల్లవి ప్లాన్ చేస్తుంది.. తన మనుషులకి మీనాక్షి గురించి చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మీనాక్షిని చంపబోతారు రౌడీలు. అవని మాత్రం తన తల్లి ఎక్కడికో వెళ్లిపోయిందని టెన్షన్ పడుతూ వెతుకుతుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…