Intinti Ramayanam Today Episode December 29 th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఏక లింగం గురించి నిజం తెలుసుకున్న రాజేంద్ర ఆస్తులు వివరాలు కావాలి అని అడుగుతాడు. మాకు అప్పజెప్పాలి అని రాజేంద్ర కండిషన్ పెడతాడు. ఏంట్రా అప్పగించేది వీళ్ళు సంగతి ఏంటో చూడండి రా అని తన మనుషుల్ని వాళ్ళ మీదకి పంపిస్తాడు..ముగ్గురు అన్నదమ్ములు కూడా ఏకలింగం మనుషుల్ని చితగ్గొట్టేసి అతనికి దిమ్మతిరిగిపోయే షాక్ ఇస్తారు.. రాజేంద్రప్రసాద్ తన ఆస్తులు ఇవ్వకుంటే ఏం చేయాలో అది చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఈ ఊరికి మాత్రమే ప్రెసిడెంట్ మిగతా వాటికి కాదు కదా నీ సంగతి ఎలా తేల్చాలో నాకు తెలుసు అని రాజేంద్ర అంటాడు..ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు.. భానుమతి పార్వతి ఇద్దరు కూడా బజ్జీలు తింటూ ఈ ఊరు చాలా బాగుందని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అప్పుడు అక్కడికి వచ్చిన పల్లవిశ్రీ చేయాలని చూసి ఆడుకునే వాళ్లకు ఏం వేలాపాల లేదు డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేసారు అని భానుమతి అంటుంది. ఏంటి మీరు చెప్తే అర్థం కాదా బయటికి వెళ్ళండి అని పార్వతి కూడా సీరియస్ అవుతుంది. అత్తయ్య మేము అడుక్కునే వాళ్ళం కాదు పల్లవి శ్రీయలము అని అంటారు. మీరేంటి అవతారంలో ఉన్నారు అంటే మావయ్య గారు ఇదంతా చేశారు. అన్ని పనులు చేసి వచ్చేలా ఉంది అని అనుకుంటూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. తన ఆస్తులు గురించి ఏకలింగం చేసిన మోసాన్ని రాజేంద్రప్రసాద్ బయట పెట్టాలని అనుకుంటాడు. ఆస్తులు విషయంలో మోసపోయామని తెలుసుకున్న కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏకలింగం ని ఎలాగైనా సరే బెదిరించి మన ఆస్తులు మనం తీసుకోవాలి అని అనుకుంటారు.. అయితే ఇంట్లో వాళ్లకి చెప్తే వాళ్ళందరూ కూడా మీరు చాలా తప్పు చేశారు అలాంటి వారిని నమ్మకుండా ఉండాల్సింది అని అంటారు.. మీరు కోట్లు ఆస్తి తీసుకెళ్లి వాడు చేతిలో పెట్టాడు వాడు ఏం చేస్తాడు ఏంటో అని ఆలోచిస్తూ ఉంటారు..
మీకు ఇక్కడ ఉన్న ఆస్తులకు ఏ సంబంధం లేదు. అదంతా అక్షయ వాళ్ళ అమ్మ గారిది అని అనగానే శ్రేయ షాక్ అవుతుంది. వాటిని తిరిగి ఎలా వెనక్కి తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఇప్పుడు ఆస్తులు ఎవరివి అన్నది కాదు ముందు ఆ పోయిన ఆస్తిని వాళ్ళ దగ్గర నుంచి ఎలా రాబట్టలో మనం చూసుకోవాలి అని శ్రీకర్ అంటాడు. పల్లవి ఎవరూ లేని సమయం చూసి ఆ ఏకలింగం కి ఫోన్ చేస్తుంది. ఏంటి మా ఆస్తులు అన్నిటినీ లాగేసుకున్నావంట అని పల్లవి అడుగుతుంది. ఎవరికైనా ఆస్తులు మీద ఆశ ఉంటుంది. ఖాళీగా ఉన్న వాటిని వాడుకోక ఇంకేం చేస్తారు అని అంటాడు.
నువ్వు మీ వాళ్ళతో ఉంటే నీకు ఆస్తి వచ్చేది పావలా వంతు నాతో కలిస్తే నీకు సగం రాసిస్తాను అని ఏకలింగం అనగానే పల్లవి ఆలోచిస్తుంది. చెప్తే అది చేస్తాను అని అంటుంది.. ఇక తర్వాత అవన్నీ నిన్ను కొట్టిందని విన్నాను నిజమేనా అని పల్లవి అడుగుతుంది.. తాచూ పాము లాంటి నన్ను కొట్టింది అది బతకడానికి వీల్లేదు అని ఏకలింగం అంటాడు. నన్ను ఎదిరించిన వాళ్ళు ఎవరు కూడా బ్రతికి బయటపడలేదు. ఇవాళ ఆ అవని అంతు చూస్తాను అంటాడు..
నువ్వు నాకు సాయం చేస్తే నీ రుణం తీర్చుకోకుండా నీకు రావాల్సిన ఆస్తిని నేను ఇస్తాను అని ఏకలింగం అంటాడు.. ఏక లింగం ఏదో చేస్తానని అన్నాడు కదా ఏం చేస్తాడా అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఆ తర్వాత గదిలోకి వచ్చిన కమల్ పల్లవిని వెనకాల నుంచి హగ్ చేసుకుంటాడు.. ఇవాళ వీడు ఏదో చేస్తానన్నారు కదా అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. కమల్ మెల్లగా నాతో రొమాన్స్ చేయడానికి ఇష్టపడుతున్నాడు అని పల్లవి తనని ఎలాగైనా సరే మళ్లీ దారి మళ్ళించకుండా చూసుకోవాలని అనుకుంటుంది.. ఆ తర్వాత ఇంట్లోకి ఎవరో వచ్చినట్లు ఉండడంతో పల్లవి ఎవరు వచ్చారో చూడాలని వెళ్తుంది..
అవని నిద్రపోగానే అవని గదిలోకి మనుషులు వెళ్లడం పల్లవి గమనిస్తుంది.. పల్లవిని చంపడానికి మనుషులు పంపించినట్లు ఉన్నాడు ఒకవేళ అది చస్తే మా ఆస్తి మొత్తం మాకు రాకుండా పోతుంది అని పల్లవి ఏక లింగంకు ఫోన్ చేసి అడుగుతుంది.. నా మాట కాదని వాళ్ళు ఎవరూ లేరు నేను ఏది చెప్పే వాళ్లకు అదే వేధం అని ఏకలింగం అనగానే పల్లవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ఇకపోతే అవని గదిలోకి వెళ్లిన వ్యక్తి ఎవరిని చంపబోతుంటే అక్షయ్ చూసి వాడిని పట్టుకుంటాడు.. అందరూ కూడా దొంగ అని అరవగానే అలర్ట్ అయ్యి వాళ్ళని పట్టుకోడానికి వస్తారు.. కచ్చితంగా కొడతారు అని తెలుసుకున్న ఆ దుండగులు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు.. మొత్తానికి ఇద్దరు కలిసి పారిపోతారు.. కచ్చితంగా ఆ ఏకలింగం పని అయ్యుంటుంది అని అనుకుంటారు..
ఉదయం లేవగానే వాడి సంగతి చూడాలి వాడి మీద పోలీస్ కేసు పెట్టాలి అని శ్రీకర్ అంటాడు.. పోలీస్ కేసు పెడితే వాడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎవరు వాడి మాట నమ్మరు. మనం ఏం చెప్తే అది చేయడానికి ఇక్కడ ఎవరూ లేరు ఒక చట్ట ప్రకారం మనం వెళ్లాలి అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. ఉదయం లేవగానే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు.. రియల్ మాత్రం ఫామ్ హౌస్ కి వెళ్లకుండా ఉండాలి అంటే కచ్చితంగా ఈ పనులు చేయాలి అని బయట ఊడుస్తూ ఉంటారు.. అయితే కాసేపు పొడవు గాని నడుము నొప్పులు వస్తున్నాయని అనగానే పార్వతి మీరు ఈ కాసేపు ఉడకని నడుము నొప్పులు వచ్చాయా మరి అవని అందరికీ చేసి పెడుతుంది తనకి నొప్పులు రావాలని అంటారు..
Also Read : మీనా, బాలు పై ప్రశంసలు.. మళ్లీ అడ్డంగా దొరికిపోయిన మనోజ్.. ప్రభావతికి షాక్..
ఆ తర్వాత ఆరాధ్య ఎక్కడుంది అమ్మ తీసుకొని రా అనేసి అవనితో రాజేంద్రప్రసాద్ అంటాడు.. అయితే మధ్య దగ్గరికి వెళ్లి అవని లేకపోతే తను అమ్మ అంటూ కలవరిస్తూ భయపడిపోతూ ఉంటుంది. తనకి జ్వరం కూడా ఉండడంతో ఆరాధ్యకు బాగా జ్వరం వచ్చింది డాక్టర్ని తీసుకురావడానికి బయటకు వెళ్తారు.. కానీ ఏక లింగం చెప్పిన మాటలు విని ఆ డాక్టర్ రావడానికి నిరాకరిస్తాడు. అక్షయ్ నాకు అర్థమైంది నేను వెళ్లి టాబ్లెట్స్ తీసుకొని వస్తాను అని బయటికి వెళ్లిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..