Intinti Ramayanam Today Episode December 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. తన ఆస్తులు గురించి ఏకలింగం చేసిన మోసాన్ని రాజేంద్రప్రసాద్ బయట పెట్టాలని అనుకుంటాడు. ఆస్తులు విషయంలో మోసపోయామని తెలుసుకున్న కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏకలింగం ని ఎలాగైనా సరే బెదిరించి మన ఆస్తులు మనం తీసుకోవాలి అని అనుకుంటారు.. అయితే ఇంట్లో వాళ్లకి చెప్తే వాళ్ళందరూ కూడా మీరు చాలా తప్పు చేశారు అలాంటి వారిని నమ్మకుండా ఉండాల్సింది అని అంటారు.. మీరు కోట్లు ఆస్తి తీసుకెళ్లి వాడు చేతిలో పెట్టాడు వాడు ఏం చేస్తాడు ఏంటో అని ఆలోచిస్తూ ఉంటారు.. ఇక్కడున్న ఆస్తులుకు మీకు ఏ సంబంధం లేదు ఇది కేవలం అక్షయ్ వాళ్ళ అమ్మ గారి ఆస్తులు మాత్రమే అని రాజేంద్రప్రసాద్ అనగానే శ్రీయ పల్లవి ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏక లింగానికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని అందరూ అనుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఆరాధ్య ఎక్కడుంది అమ్మ తీసుకొని రా అనేసి అవనితో రాజేంద్రప్రసాద్ అంటాడు.. అయితే మధ్య దగ్గరికి వెళ్లి అవని లేకపోతే తను అమ్మ అంటూ కలవరిస్తూ భయపడిపోతూ ఉంటుంది. తనకి జ్వరం కూడా ఉండడంతో ఆరాధ్యకు బాగా జ్వరం వచ్చింది డాక్టర్ని తీసుకురావడానికి బయటకు వెళ్తారు.. కానీ ఏక లింగం చెప్పిన మాటలు విని ఆ డాక్టర్ రావడానికి నిరాకరిస్తాడు. అక్షయ్ నాకు అర్థమైంది నేను వెళ్లి టాబ్లెట్స్ తీసుకొని వస్తాను అని బయటికి వెళ్లిపోతాడు. అక్షయ్ టాబ్లెట్స్ కోసం ఎంతగా వెతికినా సరే అక్కడ ఎవరూ టాబ్లెట్స్ ఇవ్వడానికి ఒప్పుకోరు.. ఊర్లో ఉన్న మెడికల్ షాపులను నేను చూపిస్తానని ఏకలింగం మనిషి అక్షయతో పాటు వెళ్తాడు. కానీ అక్షయ్ వెనకాల ఉన్న వ్యక్తి ఏ మెడికల్ షాప్ కు వెళ్ళినా ఇవ్వద్దు అని సైగలు చేస్తాడు. దాంతో ఎవరు కూడా భయపడి ఇవ్వరు.
అక్షయ్ ఊర్లో వాళ్ళందరూ కూడా ఏంటి ఇలా చేస్తున్నారు అని బాధపడుతూ ఉంటారు. ఆరాధ్యకు జ్వరం ఎక్కువైపోయిందని ఇంట్లోని వాళ్ళందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. జ్వరం ఎక్కువవుతుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. దాంతో ఏం చేయాలో అర్థం కాక అక్షయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.. చివరిగా ఉన్న మెడికల్ షాప్ కి వెళ్ళగానే అక్కడ ఏకలింగం మనిషి మందులు ఇవ్వద్దు అని సిగ్నల్ ఇస్తాడు. అయితే అది గమనించిన అక్షయ్ అతన్ని కొడతాడు.. ఎందుకు మందులు ఇవ్వాలని అంటున్నావో నాకు అర్థం అయిపోయింది అని ఏకలింగం మనిషిని కొట్టగానే అతను మందులు ఇస్తానని అంటాడు..
ఆ మందులను తీసుకొని అక్షయ్ ఇంటికి వెళ్తాడు. అయితే ఇంట్లో బెడ్ మీద ఆరాధ్య కనిపించకపోవడంతో ఏం జరిగిందని కంగారు పడిపోతూ ఉంటాడు. ఎవరు కూడా ఆరాధ్యకు ఏమైంది అన్న విషయాన్ని చెప్పరు. దాంతో భయపడి పోయిన అక్షయ్ ఏమైందిరా అని గట్టిగా అరుస్తాడు.. ఇక అవని ఏం కాలేదు లోపల పడుకుంది జ్వరం తగ్గిపోయింది మీరు టెన్షన్ పడకండి అని అంటుంది.. జ్వరం తగ్గిపోయిందా ఎలా అని అక్షయ్ అడుగుతాడు.. ఆరాధ్యుని చూసి వచ్చిన అక్షయ్ ఏకలింగం ఇదంతా చేశాడు అని అంటాడు.. మనకి మందులు కూడా దొరకకుండా చేయాలని అనుకుంటున్నాడు అని అక్షయ్ చెప్తాడు. ఆ తర్వాత అక్షయ్ మందులు ఎవరి తెచ్చారు అని అడుగుతాడు. అన్న ప్రాణాలు తీయాలని చూస్తే తమ్ముడు మాత్రం ప్రాణాలను కాపాడాడు ఇతని పేరు కోటిలింగం ఏకలింగం తమ్ముడు అని అంటుంది అవని..
అతని చూడగానే కోపంతో రగిలిపోయిన అక్షయ్ ఏం మందులు ఇచ్చావు రా జ్వరం తగ్గే మందులు ఇచ్చావా లేదా అని అంటాడు.. లేదు జ్వరం తగ్గే మందులు ఇచ్చాను నేను ఎందుకు అలా చేస్తాను అని అమాయకంగా కోటిలింగం అంటాడు.. ఆరాధ్య నా ప్రాణాలను కాపాడింది.. నాకు అమ్మ లాంటిది. అలాంటి అమ్మని నేనెందుకు చంపాలని చూస్తాను తప్పండి మీరు మాట్లాడేది అని కోటిలింగం అంటాడు. మనం ఇలాగే చూస్తూ ఊరుకుంటే వాడు ఇంకేదైనా చేస్తాడు అని శ్రీకర్ అంటాడు.. ముందు ఈ ఊర్లోని స్కూలు హాస్పిటల్ ని ఓపెన్ చేసి వాడికి జనాలు భయపడేలా కాకుండా చేయాలి అని అనుకుంటారు.
Also Read : ప్రభావతికి కడుపుమంట..రోహిణి పై అనుమానం.. సత్యం కోసం బాలు నిర్ణయం..?
రాజేంద్రప్రసాద్ కుటుంబం ఊర్లో వాళ్ళ అందరితో మాట్లాడి పిల్లలని స్కూల్ కి పంపించమని అడుగుతారు.. స్కూల్ పనులు పూర్తవ్వగానే పిల్లలందరూ స్కూల్లో వచ్చి చదువుకుంటారు. ఆ తర్వాత హాస్పిటల్ ని కూడా మొత్తం మార్చేసి పేషంట్లకు మంచి సదుపాయాలను ఇవ్వాలని అనుకుంటారు.. అంతేకాదు ఒక డాక్టర్ ని కూడా సిటీ నుంచి పల్లెటూరికి తీసుకొని వస్తారు. ఈ విషయాన్ని ఏకలింగం మనిషి ఏక లింగానికి చెప్తాడు.. వల్లిలన్ని గొప్ప పనులు చేస్తూ ఉంటే మనము దెబ్బడిపోతాము. ఆ అవని అవమానించాలో ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు. ఏం చేసి అవని దెబ్బ కొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.. పల్లవి సాయంతో చేయాలనుకున్నది చేస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..