Intinti Ramayanam Today Episode January 4th : నిన్నటి ఎపిసోడ్ లో.. స్కూల్లో పిల్లలకి భోజనం పెట్టాలని అక్షయ్ అవనీలు అనుకుంటారు.. ఇక స్కూల్లో ఉన్న పిల్లలకి భోజనం ఏర్పాటు చేస్తారు. రాజేంద్రప్రసాద్ కుటుంబం మొత్తం కూడా పిల్లలకి భోజనం పెడుతూ వారు సంతోషంగా ఉండడం చూసి వీళ్ళు కూడా సంతోషపడతారు.. అవని పిల్లలకు అడిగిమరీ భోజనం పెడుతూ ఉంటుంది. భోజనం ఎలా ఉంది అని అడుగుతుంది. ఇలాంటి భోజనాన్ని మేము ఎప్పుడు తినలేదు. చాలా బాగుంది అని ఆ పిల్లలు చాలా సంతోషంగా తింటారు అలా తింటూ ఉండగానే పిల్లలందరూ ఒకేసారి వాంతి చేసుకోవడానికి వెళ్తారు.
ఏంటి పిల్లలు అందరూ ఒకేసారి వాంతులు చేసుకుంటున్నారు ఏమైంది అని రాజేంద్రప్రసాద్ కుటుంబం కంగారు పడతారు. ఏంటండీ పిల్లలందరూ ఒకేసారి వాంతులు చేసుకుంటున్నారు నాకేంటో భయంగా ఉంది అనేసి అవని అంటుంది. పిల్లలకి ఏమన్నా అయితుందేమో అని ఇంట్లోనే వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అక్షయ్ కంగారు పడిపోతూ పిల్లలకి ఏమవుతుందని భయపడుతూ డాక్టర్ కి ఫోన్ చేస్తాడు. డాక్టర్ అసలు విషయాన్నీ చెప్పి పిల్లల్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఏక లింగం ఈ ఊరిని తెలుసుకోకపోతే మీరు ఇంకా చాలా చూడాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. స్కూల్లో తెరిపించామని కక్ష తోనే ఏక లింగం ఇలా చేశారని అందరూ అనుకుంటారు… పోలీసులు అక్షయ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత అందరూ అక్కడికి వెళ్తారు.. మా ఆయన ఏ తప్పు చేయలేదు అండి అని అవని అంతగా చెప్తున్నా సరే ఆ ఎస్ ఐ మాత్రం ఏ మాట వినడు. మీ ఆయన కథ ఒప్పుకున్నాడు తానే పిల్లలకు భోజనం పెట్టాడని అన్నారు. ఈ కేసు ఇంకా స్ట్రాంగ్ అయింది ఇప్పుడు మీరు ఏమి చేయలేరు అని ఎస్ ఐ అంటాడు. నేను ఒక లాయర్ ని బెయిల్ కు ట్రై చేస్తాను అని శ్రీకర్ అంటాడు. ఇక్కడ ఏ లాయర్ బెయిలు పనిచేయదు.. మీ ఊరు సర్పంచ్ ఏకలింగం ఏది చెప్తే అదే ఫైనల్ అని ఎస్ఐ అంటాడు..
ఇప్పుడు నాకు అర్థమైంది అన్నయ్య నువ్వు స్కూల్లో తెరిపించి ఈ ఊరికి మంచి చేయాలని చూస్తావు అందుకే ఆ ఏక లింగమే కావాలని నేను ఇలా ఇరికించాడు అని కమల్ అంటాడు.. నువ్వు ఒక్కమాట చెప్పు అన్నయ్య. వాడి అంతు చూస్తాను అని కమల్ సీరియస్ అవుతాడు.. ఆకు కన్నయ్య ప్రతిదానికి ఆవేశపడితే మనం ఇంకా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అని అవని అంటుంది.. మీరేమైనా మాట్లాడాలి అనుకుంటే అవి ఏక లింగంతో మాట్లాడండి అని ఎస్ఐ అనగానే అందరూ షాక్ అవుతారు.. మీరేం కంగారు పడకండి మిమ్మల్ని ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని అవని ధైర్యం చెప్పి వెళ్ళిపోతుంది..
ఇంటికి వెళ్ళగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా అక్షయ్ జైలుకు వెళ్ళబోతున్నాడు అని తిడతారు. అవని ఇలాంటి పనులు చేయడం వల్లే ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తుంది అని అందరూ తిట్టడంతో అవని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఆ తర్వాత అవనిని అందరూ తల ఒక మాట అంటారు.. ఇంట్లోకి వెళ్లి అక్షయ్ ని ఎలా బయటికి తీసుకురావాలో ఆలోచిస్తూ ఉంటారు.. అప్పుడే శ్రీయ ఇంట్లోని వస్తువుల అన్నిటిని విసిరిస్తూ ఉంటుంది. ఏంటి శ్రియా నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇవన్నీ విసిరేస్తున్నావ్ అని అంటే నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్తుంది.. శ్రీయ గుడ్ న్యూస్ చెప్పడంతో అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు.. కానీ పల్లవి మాత్రం షాక్ అవుతుంది..
Also Read :బాలుకు దొరికిపోయిన రోహిణి.. బాలు సీరియస్ వార్నింగ్.. ఈ వీక్ ట్విస్ట్ ఇదే..
అవని ఎలాగైనా సరే అక్షయని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. స్కూలుకు వెళ్లిన అవని భోజనాలని నేను ఇంటి నుంచి తెచ్చాను. మరి పాయిజన్ ఎక్కడ కలిసిందో అర్థం కావట్లేదు అని స్కూల్ టీచర్ ని అవని అడుగుతుంది.. ఆ తర్వాత తాను ఒక నిజం తెలుసుకొని పోలీస్ స్టేషన్ ఎక్కువ వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్సైకి ఒక వీడియోని చూపిస్తుంది.. అక్షయ్ ను బయటకు తీసుకొస్తుంది.. ఇక పల్లవి నీ ఇదంతా చేసింది అని అవనీకి తెలిసిపోతుంది ఏమో పల్లవిని కొడుతుంది.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..