Intinti Ramayanam Today Episode july 17th:బాబుకి బారసాల చేసేందుకు అన్ని ఏర్పాటు చేసి ఉంటారు.. అయితే పల్లవి కుళ్ళుకుంటుంది.. శ్రేయ శ్రీకర్ ఇద్దరు కూడా బాబుని అవని అక్క ఉయ్యాల్లో వేస్తే బాగుంటుంది తను మా బాబుకి పుణ్యం ఇచ్చింది అని పొగిడేస్తూ ఉంటారు.. ఇక పాపకు సంబంధించిన అన్ని కార్యక్రమాలని అవని దగ్గరుండి చేయడంతో శ్రేయ శ్రీకర్లు చాలా సంతోషంగా ఉంటారు. ఇక పేరు కూడా పెట్టేస్తారు. అందరూ సంతోషంగా ఉన్న టైంలో పార్వతి కడియాలు అవి బాబుకు పెట్టలేదు కదా నేను వెళ్లి తీసుకొని వస్తాను అని అంటుంది.. ఆ మాట వినగానే పల్లవి టెన్షన్ పడుతుంది..
పార్వతి బాబు కోసం వచ్చిన నగలను తీసుకొని వస్తానని పైకి వెళ్లి అక్కడికి ఎంత వెతికినా సరే నగలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను ఇక్కడే పెట్టాను కదా మరి నగలు ఎక్కడికి పోయాయి నాకు అర్థం కావడం లేదు అని కంగారు పడిపోతూ ఉంటుంది.. ఈ విషయాన్ని వెంటనే అందరికీ చెప్పాలని కిందకి పరిగెత్తుకుంటూ వస్తుంది.. ఈ విషయాన్ని వెంటనే చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. బాబుకు తెచ్చిన నగలు కనిపించలేదా ఏమయ్యాయి ఎవరిదీశారు అని అందరూ ఆశ్చర్యపోతారు. అయితే పార్వతీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏం చేయాలి అవని అని ఆలోచిస్తుంది.. పల్లవి మాత్రం తన మీదకు ఎక్కడ వస్తుందని టెన్షన్ పడిపోతూ ఉంటుంది..
పార్వతి టెన్షన్ పడిపోతూ ఉండగా ఏమి టెన్షన్ పడిపోవద్దమ్మా ఆ దొంగ ఎవరో నేను కనిపెడతాను అని అంటాడు.. అయితే పక్కనే ఉన్న పల్లవిని పల్లవి ఇప్పుడు నిజం చెప్పు ఆ నగలని ఏం చేశావు అని అనగానే పల్లవి గుండెలు గుబేల్ అవుతాయి. అసలు నేను దొంగతనం చేసానని నువ్వు ఎలా చెప్తున్నావని పల్లవి ఎంతగా చెప్పాలని ప్రయత్నించినా సరే కమల్ మాత్రం నువ్వే చేసావు ఎక్కడ పెట్టావు అని సీరియస్ గా అడుగుతాడు. నేను చేశాను నీ దగ్గర ప్రూఫ్ ఉండాలి పల్లవి అడుగుతుంది.. డాక్యుమెంట్లను దొంగతనం చేసావ్ డబ్బులను దొంగతనం చేసావు కాబట్టి ఇది కూడా నువ్వే దొంగతనం చేసి ఉంటావు అని కమలంటాడు. నేను దొంగతనం చేయలేదు అవని వాళ్ళ అమ్మ మీనాక్షి దంతన చేసింది ఇదిగో ప్రూఫ్ అని ఒక వీడియోని చూపిస్తుంది.. అది చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
మీనాక్షి దొంగతనం చేసింది అని ఒక వీడియోని పల్లవి చూపించగానే అందరూ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. ఏంటి మీనాక్షి దొంగతనం చేసిందా అని అందరూ చూస్తూ ఉంటారు.. నేను ఈ దొంగతనం చేయలేదు దొంగతనం చేసింది అని చెప్పగానే మీనాక్షి కూడా షాక్ లో ఉండిపోతుంది.. ఇక జరిగింది ఏంటో అని గుర్తు చేసుకుంటుంది. నగలని కొట్టేసిన తర్వాత పల్లవి అందరికీ నా మీద డౌట్ వస్తుంది ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తే ఆలోచిస్తుంది. అక్కడ మీనాక్షి సద్దుతూ కనిపించడంతో ఇక నేరాన్ని మీనాక్షి మీద వేయాలి అని పక్కా ప్లాన్ ప్రకారం మీనాక్షిని ఇరికిస్తుంది. మీనాక్షి నా కూతురు నా మీదే ఇలాంటి నిందలు వేస్తుందని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నా కూతురు దొంగతనం చేసింది అని తెలిస్తే వీళ్ళందరూ చీ కొడతారు. ఆ దొంగతనం నేనే చేశాను అని ఒప్పుకుంటాను ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అని మీనాక్షి తొందరపడి నేను ఆ దొంగతనం అని అనబోతుంది. విషయం అర్థం చేసుకున్న అవని అమ్మ ఆగు అని గట్టిగా అరుస్తుంది.. ఆ నగలను తీసింది నేనే మర్చిపోయాను అని అవని అనగానే పల్లవి ఫీజులు ఎగిరిపోతాయి..
నగలు నేనే తీశాను. బాబుని తీసుకుని వెళ్ళినప్పుడు ఆ కడియాలు చేయను వేసి చూస్తే అవి గుచ్చుకుంటున్నాయి. సరిగ్గా లేవు కాబట్టే వాటిని సైజు చేయించాలి అని మళ్లీ ఆ నగల షాపుకి తీసుకొని వెళ్ళాను. అక్కడ అతనికి చెప్పాను అయితే ఇంకొక నాలుగు ఐదు రోజులు పడుతుంది అని ఆ షాప్ అతను చెప్పాడు. ఆ సంగతి నేను మర్చిపోయాను అని ఏదో ఒకటి చెప్పి అవని అందరిని నమ్మిస్తుంది. ఇదంతా మీనాక్షిని కాపాడడానికి చేసిన ప్రయత్నం అని పల్లవి అనుకుంటుంది. మీనాక్షి అవని చెప్పిన మాట విని షాక్ అవుతుంది. మీరేం కంగారు పడకండి నేను బాబు కోసం వేరే చేను చేయించాను అని చెప్పగానే అందరూ హ్యాపీగా ఉంటారు.. నేను వెళ్లి ఆ చైన్ తీసుకొని వస్తాను అని అవని అనగానే అందరూ అవని నిజంగానే గ్రేట్ అంటూ పొగిడేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో పల్లవి దొంగతనం చేసిన విషయాన్ని అవని బయటపెడుతుంది.. అవనీని బ్రతిమలాడుకుంటుంది పల్లవి. మరి పల్లవి దొంగతనం చేసిన విషయం కమల్ కి తెలిసిపోతుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :శుక్రవారం ఓటీటీ చిత్రాలు .. ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్..!