Shreyas Iyer shot hits a seagull : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య నిన్న రెండవ వన్డే జరిగిన సంగతి తెలిసిందే. కార్డీప్ లోని సోఫియా గార్డెన్స్ (Sophia Gardens, Cardiff) వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండు నాలుగు వికెట్ల తేడాతో.. మళ్లీ గెలుపు బాట పట్టింది. అయితే ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer shot hits a seagull), చేసిన పనికి ఓ పక్షి బలైంది. టీమిండియా బ్యాటింగ్ సమయంలో… శ్రేయస్ అయ్యర్ భారీ షాట్ ఆడాడు. అయితే ఆ బంతి నేరుగా వెళ్లి మైదానంలో వాలిన ఓ పక్షికి తగిలింది. దీంతో పక్షి తీవ్రంగా గాయపడింది. ఈ క్రమంలో వెంటనే అలర్ట్ అయిన జాకబ్ బెతెల్ ( Jacob Bethell), ఆ పక్షిని తీసుకువెళ్లి ఫిజియోథెరపిస్ట్ కు అప్పగించి ప్రాణాలు కాపాడాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో గిల్ సేన మొదటి బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే టాప్ బార్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ విఫలమైన నేపథ్యంలో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకున్నారు. అయితే శ్రేయస్ అయ్యర్ 43 పరుగుల వద్ద ఉండగా.. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ మహమూద్ బరిలోకి దిగాడు. అయితే మహమూద్ వేసిన ఓ బంతిని ఆఫ్ సైడ్ వైపు బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు శ్రేయస్ అయ్యర్. అయితే అదే సమయంలో మైదానంలో వాలిన ఓ పక్షికి శ్రేయస్ అయ్యర్ కొట్టిన బంతి బలంగా తాకింది. దీంతో ఆ పక్షి అక్కడే విలవిలలాడిపోయింది. అయితే పక్షి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే.. ఇంగ్లాండ్ డేంజర్ ఆటగాడు జాకబ్ బెతెల్ వెంటనే తన చేతులతో పక్షిని పట్టుకొని.. ఫిజియోథెరపిస్టుకు అప్పగించాడు. ఈ నేపథ్యంలోనే లేడీ ఫిజియోథెరపిస్టు.. ఆ పక్షికి ప్రాణాలు పోసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు జాకబ్ బెతెల్ ను మెచ్చుకుంటున్నారు.
రెండవ వన్డేలో టీమిండియాను చిత్తుగా ఓడించింది ఇంగ్లాండు. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 233 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. ఈ లక్ష్యాన్ని కేవలం 44.1 ఓవర్లలో బ్రూక్ సేన అవలీలగా ఛేదించింది. దీంతో సిరీస్ సమం అయింది. మూడో వన్డేలో గెలిచినవాళ్లకే సిరీస్ దక్కుతుంది.
?igsh=MWlzeG8xZGZieWc1OQ==