Intinti Ramayanam Today Episode june 4th : అవని వెళ్ళింది కదా పల్లవిని ఇంకా తీసుకురాలేదేంటి అని అందరూ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంట్లోకి సడన్గా పోలీసుల రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. పోలీసులు వచ్చారేంటి అని అందరూ లేచి చూస్తే వాళ్ళు అవని కోసం వచ్చామని అనగానే మా ఆవిడ ఏం చేసింది అని అక్షయ్ అడుగుతాడు. పల్లవి వాళ్ళ అమ్మని చంపేసింది అని తను అవనిపై పోలీస్ కేసు పెట్టింది. అందుకే మేము ఇక్కడికి వచ్చాము. ముందు అవని ఎక్కడుందో చెప్పండి అని అనగానే అవని పల్లవి ఇంటికి వెళ్లిందండి వస్తూ ఉంటుంది అని పోలీసులకు చెప్తారు. చక్రధర్ కి అవినీకి అక్షయ్ ఫోన్ చేసి ఈ విషయం చెప్పగానే వాళ్ళు షాక్ అవుతారు. ఇక అవని చక్రవర్ ఇంటికి రాగానే పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు.
అవనిని పోలీసులు తీసుకుని వెళుతూ ఉంటారు.. అందరూ అవని ఏ తప్పు చేయలేదని ఎంతగా చెబుతున్నా సరే.. వినకుండా పోలీసులు తీసుకుని వెళ్లడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు. అవని ఏ తప్పు చేయలేదు ఎవరిని చంపలేదు అని పోలీసులకు అందరూ చెప్తారు కానీ పోలీసులు మాత్రం టైం వేస్ట్ చేయకండి అమ్మ ఎక్కండి అని అంటారు.. అయితే ఆరాధ్య నువ్వు ఎక్కడికి వెళ్ళద్దమ్మా నువ్వు లేకపోతే నేను ఉండలేను అమ్మ అని బాధ పడిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం మీనాక్షి అవని అని అంటుంది. నిన్ను పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటమ్మా అని అడగ్గానే రాజేశ్వరి పిన్నిని నేను చంపాలి అనుకున్నాను అని పల్లవి నామీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అందుకే పోలీసులను అరెస్ట్ వచ్చారు అని అవని నిజం చెప్తుంది. కానీ మీనాక్షి రాజేశ్వరి మీద కోపం ఉండడంతో నేనే బలంగా తోసాను ఆమె కింద పడిపోయింది అని అబద్ధం చెప్తుంది.
మీనాక్షిని నేనే బలవంతంగా తోయడంతో ఆమె కింద పడిపోయి తలకు గాయం తగిలింది. ఆ దెబ్బతో చనిపోయింది దానికి కారణం నేనే నేను చెప్పింది నిజమే అని మీనాక్షి అంటుంది. అటు అవనీ, చక్రధర్ఎంతగా చెప్తున్నా సరే మీనాక్షి మాత్రం వినకుండా నేనే చంపాలి అనుకున్నాను అని నిజం చెప్తుంది. మీనాక్షి ని పోలీసులు అరెస్ట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. తన తల్లిని అరెస్ట్ చేశారని అవని బాధ పడిపోతూ ఉంటుంది. వెంటనే శ్రీకర్ కి ఫోన్ చేసిన కమల్ నేను అరెస్ట్ అయిన అతని వేలు పై బయటకు తీసుకొని వస్తాను అని అంటాడు.
పల్లవి నేను నిన్ను చంపిన ఆ అవనిని ఎలాగైనా సరే పోలీస్ స్టేషన్లో మగ్గేలా చేద్దామని అనుకున్నాను. కానీ అవని మాత్రం తెలివిగా తప్పించుకుంది. అయితే తన తల్లి మీనాక్షి పోలీసులు తీసుకుని వెళ్లారు. నువ్వు నాకు ఎలాగైతే దూరమయ్యావో అవన్నీ కూడా వాళ్ళమ్మ దూరమైంది నీ ఆత్మ కొంతవరకైనా శాంతించింది కదా అని పల్లవి తన తల్లి సమాధి దగ్గర ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక భానుమతి నీ తల్లి చనిపోవడానికి కారణమైన అవనిపై రివెంజ్ తీర్చుకోడానికి నువ్వేం చేసినా నేను నీకు సపోర్ట్ చేస్తాను. కానీ నీ భర్త కమల్ దృష్టిలో నువ్వు చెడ్డ దాని లాగా మిగిలిపోకుండా మంచి దానిలాగా మెలగాలి అని భానుమతి సలహా ఇస్తుంది.
భానుమతి కమల్ దగ్గర జాగ్రత్త అని చెప్తూ ఉండగా కమల్ చాలా ఆవేశంగా పల్లవి దగ్గరికి వస్తాడు. పల్లవి మా వదిన మీ అమ్మని చంపాలనుకున్న ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని పల్లవి పై సీరియస్ అవుతాడు. అసలు మా వదిన మీద పోలీస్ కేసు ఎందుకు పెట్టావు నువ్వు అని కమల్ పల్లవిని అడగగానే పల్లవి మరో కొత్త డ్రామాలు క్రియేట్ చేస్తుంది. నేనేమి కేసి పెట్టలేదు హాస్పిటల్ లో రికార్డులను చూసి పోలీసులు ఇక్కడికి వచ్చారు నేను చూసింది చూసినట్లు చెప్పాను అంతే అని పల్లవి అనగానే కమల్ మా వదిన గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అని ఇంకొకసారి మా వదిన జోలికొస్తే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.
కమల్ ఆవేశంగా ఇంట్లోంచి బయటికి వెళుతున్నప్పుడు భరత్ అక్కడికి వస్తాడు. భరత్ ని చూసిన పల్లవి తన గురించి తప్పుగా అనుకోకూడదు అని మరో కొత్త డ్రామాలు మొదలు పెడుతుంది. అవని అక్క వల్లే వాళ్ళ అమ్మని అరెస్ట్ చేశారు అని భరత్ కి లేనిపోనివి చెప్పి ఇంకాస్త రెచ్చగొడుతుంది. నాకు మా అమ్మని దూరం చేసినట్లే నీకు కూడా మీ అమ్మని దూరం చేయాలని అనుకుంటుందేమో అని పల్లవి కావాలని రెచ్చగొట్టడంతో భరత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భరత్ ని ఎప్పటికైనా నా గుప్పెట్లో పెట్టుకోవాలి అని పల్లవి అనుకుంటుంది. మీనాక్షి నీ కలవడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన అవని చక్ర అక్షయలు తన తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది అవని.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read : ‘కార్తీక దీపం 2 ‘ సూరజ్ రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?