Intinti Ramayanam Today Episode March 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. పువ్వులు కట్టడం అయిన తర్వాత పూజకి అన్ని సిద్ధం చేసి దేవుడికి పువ్వులు వేస్తారు. ఆ తర్వాత పూజ చేసిన తర్వాత హారతిస్తుంటే పల్లవి ఇచ్చిన హారతి ఆరిపోతుంది. పల్లవి ఎన్నిసార్లు హారతి వెలిగించిన సరే ఆరిపోతుంది. అందరికీ పల్లవి పై అనుమానం మొదలవుతుంది. గాలికి ఆరిపోయి ఉంటుంది అని రెండోసారి వెలిగించిన కూడా మళ్లీ ఆరిపోతుంది.. అసలు నీ దరిద్రం ఏంటో తెలియలేదు కానీ నాన్నకి ఇలా జరగడానికి కారణం ఎవరో తెలుసుకోవడానికి పూజ చేస్తే నీకు దెయ్యం పట్టింది. ఇప్పుడు మళ్లీ పూజ చేస్తుంటే ఇలా హారతి ఆరిపోయింది అని కమల్ అంటాడు.. ఏదో గాలికి ఆరిపోయింది లేరా ఇప్పుడేంది అని పార్వతి మళ్ళీ వెలిగించి హారతి ఇస్తుంది. ఆ తర్వాత అక్షయ్ వాళ్ళందరూ కూర్చుని బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మన బిజినెస్ డీల్ పూర్తి కాబోతుంది నాన్న అనేసి అనగానే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు.. ఇకపోతే బిజినెస్ గురించి మాట్లాడుతున్న వాళ్ళ దగ్గరికి శ్రేయ వస్తుంది.. చేయి అనుకున్నట్లుగా మొత్తానికి అగ్రిమెంట్ అయితే రాయించుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..అవనిని ఫోన్ చేసి అభి రమ్మని చెప్తాడు. అవని అభి దగ్గరికి వెళ్లి పల్లవి గురించి నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అని అంటాడు. పల్లవి ఎవరికో ఈమధ్య 47 సార్లు కాల్ చేసింది అని చెప్పగానే అవని షాక్ అవుతుంది. ఇక ఆ వ్యక్తి గురించి నేను తెలుసుకుంటాను అని అభి అంటాడు.. చక్రధర్ మాత్రం అవనికి న్యాయం చేయాలి అని అనుకుంటాడు. పల్లవి పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తూ ఉండగా అవని వచ్చి పల్లవి పై రెచ్చిపోతుంది.. అసలు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావ్ మీ అమ్మ గనుక లేకపోతే నువ్వు వెళ్లి వెతుక్కో అని పల్లవి అంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసు అని అవని అంటుంది. మొన్న నువ్వు 47 సార్లు ఈ నెంబర్ కి కాల్ చేసావు అని అడగగానే పల్లవి దిమ్మతిరిగేలా షాక్ అవుతుంది..
ఆ నెంబర్ ఎవరితో నన్ను అడిగితే నేను ఎలా చెప్పను. అసలు నాకెందుకు ఆ నెంబర్ తో పని ఏంటి అని ఎంతగా పల్లవి బుకాయించాలని చూసినా.. అవని మాత్రం నువ్వు ఏంటో నిజాలని బయట పెడతాను అని అంటుంది.. అవనికి ఏవైనా పిచ్చి కింద ఏంటి పల్లవితో ఏం మాట్లాడుతుంది అర్థం కావడం లేదు అని పార్వతి అంటుంది. అయితే అవని ఏం మాట్లాడుతున్నావ్ అర్థం కావట్లేదు అని పల్లవి కూడా అంటుంది. కానీ నేను నిజం చెప్పేస్తాను ఆగండి అని అవని అంటుంది. అయితే పల్లవి మాత్రం ఏం నిజం చెప్పాలి అని అడుగుతుంది. మా అమ్మని కిడ్నాప్ చేయించింది చక్రధరి అది పల్లవికి తెలుసు నువ్వు ఇలా చెప్పవని పల్లవి చంప పగలగొడుతుంది ఆవని..
అవని చెంప పగలగొట్టగానే కమల్ కూడా రెచ్చిపోతాడు. నువ్వు మా వదిన అడుగుతున్న కూడా సమాధానం చెప్పడం లేదు అంటే నువ్వు టెన్షన్ పడుతున్నావు అని అర్థమవుతుంది. మీనాక్షి అత్తయ్య ని ఎక్కడ దాచిపెట్టవో చెప్పు అని కమల్ పల్లవికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తాడు. కమలి ఎంత చెప్తున్నా సరే పల్లవి మాత్రం వినకపోవడంతో అతను గట్టిగా గొంతు పట్టేసుకుంటాడు. ఇక పల్లవి ఆ మీనాక్షిని మా నాన్న కిడ్నాప్ చేయించాడు అని అబద్ధం చెప్తుంది. ఇక తర్వాత ఎక్కడ దాచాడో చెప్పు అని అంటే నాకు తెలియదు అని అంటుంది.. వెళ్లి ఆ ఆ చక్రధారిని నిలదీస్తే వాడే చెప్తాడు అని అందరూ కలిసి అక్కడికి వెళ్లడానికి రెడీ అవుతారు..
Also Read :‘ నిండు నూరేళ్ల సావాసం ‘ పల్లవి ఆస్తులు.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..
అవని అక్షయ్ అలాగే కమల్ ముగ్గురు కూడా చక్రధర్ ఎక్కడున్నాడో తెలుసుకొని మీనాక్షి అత్తయ్యని కాపాడాలి అని అనుకుంటారు.. చక్రధర్ మాత్రం మీనాక్షిని ఎలాగైనా కాపాడి అవని వాళ్లకి నిజం చెప్పాలని. కానీ చక్రధర్ మీనాక్షి కాపాడడానికి వెళ్తాడు. మీనాక్షి నన్నేం చేయొద్దు నేను నీ గురించి ఎక్కడ నిజం చెప్పను నా పిల్లల కోసమే నేను బతుకుతున్నాను అని ప్రాధేయపడుతుంది. నేనేం చేయను నిన్ను కాపాడడానికే వచ్చాను ఇకనుంచి తీసుకొని వెళ్ళిపోయి నిజం చెప్తాను అని అంటున్న సరే మీనాక్షి మాత్రం అస్సలు నమ్మదు. మీనాక్షి కట్లు విప్పుతున్న టైం లో కమల్ అక్షయ్ వాళ్లు చూసి అతన్ని కొట్టేస్తారు. ఇక అవని తన తల్లి కట్లు విప్పేసి హక్కును చేర్చుకుంటుంది.. ఇక చక్రధర్ ని కొట్టి మీనాక్షిని తీసుకుని వెళ్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..