Intinti Ramayanam Today Episode November 13th : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి తనకు అనుమానం జరిగిందన్న విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్తుంది. ఆవిడ ఎవరు నా కూతురు కొట్టడానికి ఈ విషయం గురించి మనం అక్కడికి వెళ్లి మాట్లాడాలి లేదా ఆవిడని ఇక్కడికి తీసుకురావాలి అని రాజేశ్వరి మొండి పట్టుపడుతుంది. అయితే చక్రధర్ ఇంకేమీ మాట్లాడలేక అవని ఇంటికి వెళ్లడానికి ఫిక్స్ అవుతాడు. పల్లవి తన తల్లిదండ్రులను తీసుకొని తన ఇంటికి వెళ్తుంది.. పార్వతి మీనాక్షితో మీరేం తప్పు చేయలేదు వదిన గారు మీరేం బాధపడకండి అని అంటుంది.. పల్లవి చక్రధర్ రావడం చూసి మీనాక్షి షాక్ అవుతుంది.. మా కూతురుని అక్కడే కొడితే నీకు తెలిసేది కాదు అందుకే ఇక్కడికి వచ్చి పడుతున్నానని పల్లవి చంప పగలగొడుతుంది రాజేశ్వరి. పల్లవి మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాక షాక్ లో ఉంటుంది. చక్రధర్ మీనాక్షి గురించి మాట్లాడటం రాజేశ్వరి వింటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి భానుమతి దగ్గరకొచ్చి కమల్ చేస్తున్న పని నాకు నచ్చట్లేదు అమ్మమ్మ నువ్వైనా ఆ పని మానేయమని చెప్పొచ్చు కదా అని అంటుంది. ఇంట్లో ఖాళీగా ఉండకుండా వాడు పనిచేస్తున్నాడు అంటే సంతోషంగా ఫీల్ అవ్వాల్సింది పోయి ఇలా వద్దు అంటావేంటి అని భానుమతి రివర్స్లో పల్లవికి గడ్డి పెడుతుంది. కానీ పల్లవి మాత్రం ఇలా చేస్తే ఈ ముసలిది వినదు సెంటిమెంట్తోనే కొట్టాలి అని ఒక పెద్ద స్టోరీ చెప్పేస్తుంది. మా ఆయనకు మీ ఆయన పోలికలు ఉన్నాయని నువ్వు ముద్దుగా మా ఆయనకి కమల్ అని పేరు పెట్టుకున్నావు. ఇలా నాలుగిండ్లకు వెళ్లి కరెంటు పనులు చేసుకుంటూ ఫ్యాన్లు బిగించుకుంటూ ఉంటే తాతయ్య పరువు పోదా అని పల్లవి రెచ్చగొడుతుంది.
నువ్వు మీ ఆయన పరువుని కాపాడాలంటే బావని ఇలాంటి జాబులు చెయ్యొద్దు అని వార్నింగ్ ఇవ్వు అని పల్లవి రెచ్చగొడుతుంది. నువ్వు ఆగు నేను వెళ్లి చెప్పేసొస్తాను అని భానుమతి కమల్ దగ్గరికి వెళ్తుంది. నువ్వు ఇలా కరెంటు పని చేయడం నాకు నచ్చలేదు రా నువ్వు వెంటనే ఈ జాబ్ మానేయని భానుమతి అంటుంది. ఇంటింటికి వెళ్లి కరెంటు పని చేస్తూ ఉంటే మన పరువు ఏం పోతుంది. తాతయ్య పరువు తీసేస్తున్నావు అని భానుమతి అంటుంది. నువ్విలా చెప్తే వినవు… నీకు కచ్చితంగా అదిరిపోయే ప్లాన్ వేసి ఒప్పించేస్తాను చూడు అని కమల్ అనుకుంటాడు.. మాట్లాడే బలుపుని నేను కనిపెట్టాను తాతయ్య పరువుని నిలబెడతాను అని అనగానే భానుమతి సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
పల్లవి దగ్గరికి వెళ్లిన భానుమతి కమల్ నా మొగుడు పరువు తీసేస్తున్నాడని అన్నావు కదా నా మొగుడు గౌరవాన్ని పెంచుతున్నాడు అని చెంప పగలగొడుతుంది. వెనకాలే వచ్చినా కమల్ నువ్వే బామ్మ ని రెచ్చగొట్టి పంపించాను నాకు అర్థమైంది. అందుకే రివర్స్లో నిన్నే కొట్టేలా చేశాను ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని వార్నింగ్ ఇస్తాడు. అటు శ్రీకర్ శ్రీయ ఇద్దరు కూడా కొత్త కారు కొనడానికి షో రూమ్ కి వెళ్తారు. కార్ గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకొని ఇంటికి వస్తారు..
మీనాక్షి అవని ఇద్దరూ కూడా గుడికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తారు. గుడిలో నుంచి బయటికి రాగానే ఈరోజు గుడిలో కూడా ఎక్కువ మంది లేకపోవడంతో పూజారి గారు అభిషేకాలన్నీ బాగా చేశారు అని అవని అంటుంది. అవునమ్మా గుడికి వెళ్లి వచ్చిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది అని మీనాక్షి అంటుంది. మీనాక్షి భరత్ కోడల్ని చూడాలనిపిస్తుంది. ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నాడు కనుక్కో అమ్మా అని అంటుంది.. ఫోన్ లోపల ఉండిపోయింది అమ్మ మర్చిపోయాను తీసుకొని వస్తాను లోపలికి వెళ్తుంది.
Also Read : పార్వతిని అవమానించిన ప్రభావతి.. సత్యం, సుశీల క్లాస్.. శోభకు మైండ్ బ్లాక్..
మీనాక్షిని చూస్తున్న చక్రధర్ ఆమెకి డబ్బులు ఆఫర్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోవాలని అంటాడు.. నువ్వు నా మీద పగతోనే వచ్చావు నువ్వు ఈ డబ్బులు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపో నీకు ఇంకా 5 లక్షలు కాదు ఐదు కోట్లు ఇస్తానని అంటాడు. చక్రధర్ ని చూసిన అవని ఇంకొక వంద రూపాయలు ఎక్కువ వేసి ఇస్తాను అని అంటుంది.. నువ్వు నియంతట నువ్వు మా అమ్మని నా భార్య అని ఒప్పుకోవాలి అప్పుడే నీకు విముక్తి కలుగుతుంది అని అవని వార్నింగ్ ఇస్తుంది. వీళ్లందరిని చూసిన పల్లవి డబ్బులు ఎందుకు ఆ మీనాక్షికిస్తున్నాడు మా నాన్నకి అ మీనాక్షి కొన్ని సంబంధం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..