Intinti Ramayanam Today Episode November 19th : నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీకర్ అమ్మానాన్న మీరిద్దరూ కార్లో కూర్చోండి ముందుగా మనం వెళ్లి పూజ చేయించుకుని వద్దామని శ్రీకర్ అంటారు. రాజేంద్రప్రసాద్ పార్వతి కార్లో కూర్చుంటున్నగా శ్రీయ ఆగండి ఈ కారు నేను ఇష్టంగా కొన్నాను ముందు నేనే కూర్చోవాలి అని అంటుంది. శ్రీకర్ ఒకపక్క అమ్మ నాన్న కూర్చొనివ్వు అని ఎంత అన్న కూడా శ్రీయ నేను కూర్చుంటాను లేదంటే ఎప్పటికీ ఈ కారులో కూర్చొని అంటుంది. ఇక ఆ తర్వాత అవని చెప్పిన సరే శ్రీయ మాట వినదు.. రాజేంద్రప్రసాద్ వాళ్ళనే వెళ్లి పూజ చేయించుకొని రానివ్వు అని అంటాడు. అతనికి శ్రీయ అనుకున్నది సాధిస్తుంది.
అక్షయ్ ఫీల్డ్ కు వెళ్తాను అని అక్షయ్ వెళ్తాడు. దారిలో అవనిని మోసం చేయించుకొని రాసినవాడు అని తెలుసుకున్న అక్షయ్ వాడితో నిజం చెప్పించాలని అనుకుంటాడు. అక్షయ్ అతన్ని కొట్టి నిజం చెప్పిస్తాడు. చక్రధర్ ను అడుగుతాడు అక్షయ్.. అంతేకాదు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. ఈ విషయం ఈ ఇంట్లో చెప్తాడు అక్షయ్.. ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు పల్లవికి మైండ్ బ్లాక్ అయినంత పని అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇల్లు పోవడానికి కారణం చక్రధర్ అని చెప్పగానే ఇంట్లోని వాళ్లంతా కోపంగా ఉంటారు. కమల్ వాడి అంతు చూడాలి అని అంటాడు. పల్లవి వాళ్ళ నాన్ననే అని అనగానే అందరూ పల్లవి వైపు సీరియస్గా చూస్తారు. పల్లవి మాత్రం అక్షయ్ మాట విని షాక్ అయిపోతుంది. మా నాన్న ఇదంతా చేశాడు అనడానికి మీ దగ్గర ఏంటి సాక్ష్యం ఉంది అని పల్లవి అడుగుతుంది. పలుకుబడి ఉన్నా వ్యక్తి మీద ఇలాంటి నిందలు వేస్తారని పల్లవి అనగానే అన్ని ఆధారాలు దొరికిన తర్వాత అప్పుడు మాట్లాడుతాను అని అక్షయ్ అంటాడు. తర్వాత అవని తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే దొరుకుతారు మనకు ఏదో ఒక దారి ఉంటుంది అని అంటుంది..
అక్షయ్ కు అవని ధైర్యం చెబుతూ ఉంటుంది.. మీరేం బాధపడకండి దొంగ అనేవాడు ఎవడైనా సరే ఖచ్చితంగా దొరుకుతాడు. దేవుడనే వాడు ఉన్నాడు కాబట్టి వాడిని పట్టుకోవడం ఈజీ అవుతుంది అని అవని అంటుంది.. నేను అందరికన్నా ఎక్కువ సేల్స్ చేశానని నాకు బోనస్గా మనీ ఇచ్చారు అని అక్షయ్ అంటాడు. అవునా మరి ఆ మనీ తో మీరు ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు తీసుకురావాల్సింది కదా అని అవని. అందరికీ కాదు నీకే తెచ్చాను ఒకసారి కళ్ళు మూసుకొని అవని అంటాడు. అవినీ చేతిలో మంగళసూత్రం పెడతాడు. ఇది వేసుకో అవని అని అంటాడు. అవని పూజ చేయించి మంచి రోజు చూసుకుని వేసుకుంటాను అని అంటుంది.
ఇక రాజేంద్రప్రసాద్ చాలా ఆవేశంగా ఉంటాడు. నాకు బిజినెస్లను ఎక్కడైనా శత్రువు ఉంటాడని అనుకున్నాను కానీ నా అనుకున్న వ్యక్తే నన్ను వెన్నుపోటు పొడవాలని చూస్తున్నాడా అని రాజేంద్రప్రసాద్ సీరియస్ అవుతాడు. వాడి అంతు తేలుస్తాను అని రాజేంద్రప్రసాద్ బయలుదేరుతుంటాడు. ఒకవైపు పార్వతి ఎంతగా ఆపుతున్న సరే రాజేంద్రప్రసాద్ మాత్రం మాట వినకుండా వాడి అంతు చూడాల్సిందే ఈరోజు అని అంటాడు. ఇంట్లోనే వాళ్ళందరూ ఏమైయింది అత్తయ్య అని అడుగుతారు.. చక్రధర్ ఇలాంటి పనిచేసాడు అని తట్టుకోలేకపోతున్నాడు వెళ్లి వాడి అంతు చూస్తానని అంటున్నాడు అని పార్వతి అంటుంది..
మీరేమీ ఆవేశ పడకండి మావయ్య గారు మీ కొడుకులు కోడలు ఉన్నారు వాళ్లే చూసుకుంటారు అని అవని అంటుంది. అయినా ఆ చక్రధర్ ఇవన్నీ చేశాడు అంటే ఆధారాలు కావాలి నాన్న వాటిని సంపాదించే పనిలోనే నేనున్నాను. త్వరలోనే వాటిని తీసుకొని ఆ చక్రధర్ పని ఏంటో చూద్దామని అంటాడు అక్షయ్. మీరు చిన్న విషయాలకి ఆవేశ పడకండి మావయ్య గారు అసలే మీ ఆరోగ్యం బాగోలేదు మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి అని అంటుంది..
Also Read :నగల గురించి బాంబ్ పేల్చిన బాలు..ప్రభావతికి షాక్..దిమ్మతిరిగేలా క్లాస్ పీకిన మీనా..
పల్లవి ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అది చూసిన కమల్ మీ నాన్ననే చేశాడు కచ్చితంగా మీ నాన్నని వదిలిపెట్టను అని వార్నింగ్ ఇస్తాడు. ఇంట్లో జరుగుతున్న విషయాన్ని పల్లవి వాళ్ళ నాన్నతో చెబుతుంది. భానుమతి రాజేశ్వర్ కి ఫోన్ చేసి ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది మీ ఆయన ఇలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. నీ పరిస్థితి ఏమవుతుందోనని భయపడుతున్నాను. అని భానుమతి అంటుంది.. తప్పు జరిగితే ఎవర్ని క్షమించకూడదమ్మా నువ్వు నా గురించి ఏం బాధపడకు అన్నయ్యని టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని చెప్పు అని రాజేశ్వరి అంటుంది. ఇక అక్షయ్ అవని ఇళ్లు తీసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్లాలని అనుకుంటారు.. అక్కడ ఇంటికి తాళం వేసి ఉండడం చూసి షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.