Intinti Ramayanam Today Episode September1st: పార్వతికి ఏమైందో అని కంగారుపడుతున్న ఇంట్లో వాళ్ళందరూ అవని వాళ్ళని చూసి ఏమైంది అని ఒక్కసారిగా లేచి వచ్చే అడుగుతారు. అయితే ఆవిడకు బీపీ ఎక్కువ అవ్వడం వల్ల ఏ ప్రమాదం జరిగింది అని అని చెప్పడంతో భానుమతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా కొడుకు ఏమో కోమలో ఉన్నాడు నా కూతురు చచ్చిపోయింది. ఇప్పుడు నా కోడలు కూడా ఆసుపత్రిపాలైంది. ఇవన్నీ చూసే బదులు నేను చచ్చిపోయి ఉంటే బాగుండేది అని భానుమతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆవిడను చూసిన మిగిలిన వాళ్ళందరూ కూడా ఎమోషనల్ అయిపోతారు. అవనీన్ని అక్షయ్ మా అమ్మ అసలు టాబ్లెట్ వేసుకుంటుందా లేదా అని చెక్ చేసే పని లేదా నీకు ఇంత నెగ్లెసెన్స్ గా ఎందుకు మారావు అంటూ క్లాస్ పీకుతాడు అది విన్న అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది.
పల్లవి అత్తయ్య స్పృహలోకి వస్తే ఆవిడ గురించి తెలుసుకోవాలి అని అంటుంది. పల్లవి ఎలాగైనా సరే పార్వతిని చంపేయాలి అని అనుకున్న సరే ఆ తర్వాత తనకి నిజం చెప్పి తన దారిలోకి తెచ్చుకోవాలని పల్లవి అనుకుంటుంది. అప్పుడే పార్వతి స్పృహలోకి రావడం చూసి పల్లవి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.. ఏంటి అత్తయ్య నా గురించి నువ్వు నిజం చెప్పాలని అనుకున్నావ్ కదా అని అడుగుతుంది. పార్వతి పల్లవిని చూసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ఏంటి అత్తయ్య నా గురించి చెప్పాలని చాలా ప్రయత్నాలు చేసి చెప్పకుండానే కింద పడిపోయావు అంటూ పల్లవి అనగానే పార్వతి ఇంకాస్త భయపడిపోతుంది.. నేను అందరికీ మంచి దానిలాగా నటిస్తుంటే నా గురించి నిజం తెలుసుకొని చెప్పాలనుకుని కిందపడిపోయావు . ఇది నిజాన్ని కనుక నువ్వు చెప్పావనుకో ఇంట్లో ఉన్న చంటి పిల్లలు మళ్లీ ఇంట్లోనే ఉండరు అది గుర్తుపెట్టుకోండి. నా గురించి ఎవరికీ చెప్పాలని చూసినా కూడా ఎవరు ప్రాణాలతో మిగరు అంటూ పల్లవి అనగానే పార్వతి భయంతో స్పృహ కోల్పోతుంది.
పార్వతికి అలవడంతో అక్షయ్ చాలా కోపంతో ఉంటాడు. మా అమ్మకి అలా జరగడం వెనకాల కారణానికి ఏమై ఉంటుంది అని అక్షయ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే లోపలికి వచ్చిన అవన్నీ దగ్గరికి వచ్చిన అక్షయ్ అత్తయ్యకి ఏం కాదండి కాస్త టెన్షన్ పడ్డారు కదా అందుకే కింద పడిపోయి ఉంటారు. ఆవిడ బయటికి వెళ్ళిన విషయం కూడా నాకు చెప్పలేదు. అసలు ఎందుకెళ్లారు ఎక్కడికి వెళ్లారో కూడా నాకు తెలియలేదు అని అవని అక్షయతో చెప్తుంది ఆ మాటకి అక్షయ్ చాలా సీరియస్ అవుతాడు. మా అమ్మని పట్టించుకోలేదు అంత బిజీగా మారావా నువ్వు ఒకప్పుడు నువ్వు అందరి గురించి పట్టించుకునే దానివి కానీ ఇప్పుడు మా అమ్మ గురించి నువ్వు పట్టించుకోవడం లేదు కేవలం కొందరి మాత్రమే నువ్వు పట్టించుకుంటున్నావు అంటూ అక్షయ అనగానే అవని చాలా ఫీల్ అవుతుంది. నేను ఇకమీదట అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకుంటానండి అని అంటుంది.
ఆ తర్వాత ఉదయం అక్షయ నిద్రపోతూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు.. అమ్మకి ఏదో జరగరాందే జరిగింది.. కలలోకి అమ్మ వచ్చింది. మీరు పుట్టినరోజు అయితే చాలా సంతోషంగా ఉండాలి మీ నాన్నకు బట్టలు పెట్టండి ఆశీర్వాదం తీసుకోండి అని చెప్తుంది మా అమ్మకి ఏదో జరగరందే జరిగింది అని అక్షయ టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. మీరు అనుకున్నట్లు అత్తయ్యకి ఏమీ జరగదు మీరు ఏమీ బాధపడకండి. మీరు అనుకున్న విధంగా ఆవిడకి ఏమి జరగలేదు కాబట్టి మీరు ఫీల్ అవ్వకండి అని అవని ఎంతగా ధైర్యం చెప్పాలని చూసిన సరే.. అక్షయ్ మాత్రం తన తల్లికి ఏదో అయింది అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. రెడీ అయ్యి వస్తే మనం హాస్పిటల్ కి వెళ్దామని అవని అంటుంది.
శ్రేయ ఉదయం లేవగానే బాబు కనిపించలేదు మీరు ఏమైనా చూశారా బామ్మగారు అని భానుమతి దగ్గరికి వచ్చి అడుగుతుంది.. ఆరాధ్య పూజ గదిలో కూర్చుని బాబుతో దండం పెట్టి నానమ్మకి ఏం కాకూడదు అని కోరుకుంటుంది.. అది చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు.. చిన్నపిల్లలయినా కూడా ఇంత మంచి మనసుతో దేవుని ప్రార్థిస్తున్నారు అని అనుకుంటారు.. ఇక అందరూ కలిసి హాస్పిటల్ కి వెళ్లాలని అనుకుంటారు. ముందుగా వెళ్లిన కమల్ పల్లవిని నిద్ర లేపగానే పల్లవి స్పృహలోకి వచ్చింది మళ్ళీ మత్తులోకి వెళ్లిపోయింది అని అంటుంది. ఇక అప్పుడే అక్షయ శ్రీకర్ అవని ముగ్గురు కలిసి హాస్పిటల్ కి వెళ్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మస్ట్ వాచ్..