E-Paper
Advertisement

ఒకప్పుడు జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు కాఫీ పౌడర్ షాప్ ఓనర్!

ఒకప్పుడు జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు కాఫీ పౌడర్ షాప్ ఓనర్!
Advertisement

Jabardasth:సినిమాలలో నటిస్తున్నప్పుడే వచ్చిన డబ్బును వివిధ మార్గాలలో పెట్టబడులుగా పెట్టి.. ఆర్థికంగా స్థిరపడితేనే సినిమాలలో అవకాశాలు లేనప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండగలరు. కానీ అవకాశాలు చేతినిండా ఉన్నప్పుడు వచ్చిన రెమ్యూనరేషన్ ను దాచుకోకుండా జల్సాలు చేస్తే చివరికి ఇబ్బందుల పాలు అవ్వాల్సి ఉంటుంది. అందుకే కొంతమంది సినిమాల ద్వారా వచ్చిన డబ్బును దాచుకొని మళ్లీ సినిమాలలో అవకాశాలు రాకపోయేసరికి ఇతర రంగాలలో సెటిల్ అవుతున్నారు. అలాంటి వారిలో ఒకప్పుడు కమెడియన్ గా ప్రేక్షకులను అలరించి ..ఆ తర్వాత జబర్దస్త్ లో కూడా సందడి చేసి ఇప్పుడు ఏకంగా కాఫీ పౌడర్ షాప్ ఓనర్ గా మారి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం.

సినిమాలు లేక జబర్దస్త్ లో మూడేళ్లు..

ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో చిన్నచిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. జబర్దస్త్ లో స్కిట్స్ చేసి నవ్వులు పూయించిన తిరుపతి ప్రకాష్. ఈయన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన సినీ ప్రస్థానంలో ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈయన ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. గత కొంతకాలంగా సినిమాలకు, టీవీ షోలకు దూరంగా ఉన్న తిరుపతి ప్రకాష్ ..ఇప్పుడు ఏం చేస్తున్నాడు ? అనే విషయానికి వస్తే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

కాఫీ పొడి షాప్ కి ఓనర్ గా అవతారం..

Advertisement

తిరుపతి ప్రకాష్ మాట్లాడుతూ ..”సినిమాలలో అవకాశాలు తగ్గిపోవడంతో జబర్దస్త్ లో 2015 నుండి 2018 వరకు కొనసాగాను. సుమారుగా 180 ఎపిసోడ్ లు పూర్తయ్యాయి. అటు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక ఏం చేయాలి అనే ప్రశ్న ఎదురయ్యింది. దర్శకులు కలవరు..ఇంటర్వ్యూలు లేవు.. అలాంటి పరిస్థితుల్లో మా నాన్న చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి ..ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకొని నేను స్వయంగా ఒక కాఫీ పౌడర్ షాప్ ఓపెన్ చేశాను. అంతేకాదు ఆ దుకాణాన్ని నేనే స్వయంగా చూసుకునేవాడిని. ఒక పెద్ద స్టార్ హోటల్ ప్రారంభించేంత స్తోమత లేదు. నా సామర్థ్యానికి తగ్గ వ్యాపారం చేయాలనే ఆలోచనతో మొదట టిఫిన్ సెంటర్ లేదా కిరాణా షాప్ పెట్టాలనుకున్నాను. కానీ కాఫీ పొడి వ్యాపారం మొదలుపెట్టాను.

ALSO READ:నాలుగేళ్ల వివాదానికి తెరదించిన సాయి పల్లవి!

బంధువుల సహాయంతోనే సాధ్యం..

Advertisement

బంధువుల సహాయంతో ఏప్రిల్ 11 2019లో మణికొండలో కాఫీ పొడి షాప్ ను ప్రారంభించాను. మొదట నేను వ్యాపారం మొదలు పెట్టానని తెలిసి ఆశ్చర్యపోయారు. నిజానికి కోవిడ్ వరకు నా జేబులో నుండే పెట్టుబడి పెట్టి హద్దులు చెల్లించాను. ప్రస్తుతం 1300 మంది కస్టమర్లను నేను కలిగి ఉన్నాను. ఎవరు ఎన్ని మాటలు అన్నా నాకు అనవసరం. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నానో ఈరోజు అలాగే ఉన్నాను . ఎవరి ముందు నేను చెయ్యి చాచలేదు. అంటూ తెలిపారు. మొత్తానికైతే స్వయంకృషితో కష్టపడితే ఎంతటి వారైనా సరే ఆర్థికంగా ఎదుగుతారు అనే విషయానికి చక్కటి నిదర్శనంగా నిలిచారు తిరుపతి ప్రకాష్ . ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×