Madhu Babu – Priyanka Naidu: సినిమా ఇండస్ట్రీలో ఇటీవల విడాకుల పరంపర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో ఇలాంటి సంస్కృతి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండేది కానీ ఇప్పుడు మాత్రం తెలుగు ఇండస్ట్రీలో కూడా విడాకులు తీసుకొని విడిపోయే వారి సంఖ్య అధికమైంది. అదే విధంగా బుల్లితెరపై కూడా ఎంతోమంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకుని అనంతరం కొద్ది రోజులకే విడాకులు (Divorce) తీసుకొని విడిపోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక బుల్లితెరపై నటీనటులుగా కొనసాగుతున్న వారిలో మధుబాబు (Madhu Babu)ప్రియాంక నాయుడు(Priyanka Naidu) జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
వీరిద్దరూ బుల్లితెర నటీనటులుగా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించారు. ఇలా పాప పుట్టిన తర్వాత కూడా వీరిద్దరూ ఎంతో సంతోషంగా గడిపారు కానీ ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని అందుకే దూరంగా ఉంటున్నారంటూ వార్తలు వచ్చాయి. ఒకానొక సమయంలో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారని కూడా వార్తలు హల్చల్ చేశాయి. ఈ వార్తలకు అనుగుణంగానే ప్రియాంక, మధు ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవటం, వీరి పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారని అంతా భావించారు.
వీరి విడాకుల గురించి ఎక్కడ అధికారక ప్రకటన వెల్లడించకపోయినా ఇదే నిజమని అనుకున్నారు. తాజాగా మధు బాబు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేడు ప్రియాంక మధు బాబు వివాహ వార్షికోత్సవం కావడంతో వీరి పెళ్లికి సంబంధించిన ఒక ఫోటోని మధుబాబు షేర్ చేస్తూ.. “మనిద్దరం సోల్మెంట్స్, ఈ యూనివర్స్ మనిద్దరిని ఒకచోటకు తీసుకువచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం హ్యాపీ అనివర్సరీ మై డియర్ వైఫ్” అంటూ ఈయన ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విడాకుల రూమర్లు వస్తున్న నేపథ్యంలో మధుబాబు తన పెళ్లి ఫోటోని షేర్ చేస్తూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అంటూ చేసిన పోస్ట్ వైరల్ గా మారడంతో అభిమానులు ఈ పోస్ట్ చూసాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవ ఉండటం సహజం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండండి అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు ఈ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా వీరిద్దరూ అభిప్రాయ బేధాలతో విడిగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒకటి కావడంతో వీరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయాయని స్పష్టమవుతుంది.
Also Read: Prakash Raj: టికెట్ ధరలు భారం అంటే.. సినిమాలు చూడకండి.. ప్రకాష్ రాజ్ సంచనల కామెంట్