Podarillu Today Episode April 16th : నారాయణ మాత్రం అక్కడున్న గాయత్రి మాత్రం మాధవిని చూసి బాధ పడిపోతూ ఉంటుంది. అయితే ఎంగేజ్మెంట్ కి రెడీ అయిందని దండలు మార్చుకోమని పంతులుగారు చెప్తారు. మాధవ్ ని చూస్తూ గాయత్రి కాస్త బాధ పడిపోతూనే ఉంటుంది. నారాయణ చక్రి మాత్రం పురుషోత్తంకి రమణయ్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారు. ఎంగేజ్మెంట్ ఎలాగైనా జరిగితే బాగుండు అని అనుకుంటారు. ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎంగేజ్మెంట్ జరగాలి అని ఉంగరాలు ఇచ్చి అందరూ గాయత్రిని బలవంతం చేస్తారు. కానీ గాయత్రి మాత్రం నాకు బావే కావాలి అని చెప్తుంది..
తాయారు పరధ్యానంలో ఉంటుంది అయితే గాయత్రి అలా అంటుందేమో అని కంగారు పడిపోతూ ఉంటుంది.. మాధవ్ ఎదురుగా ఉండగా అది ఉంగరాలు మార్చుకుంటుందో లేదో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. పురుషోత్తం ఏంటి ఎక్కడ ఆలోచిస్తున్నావ్ అటు చూడు అని అంటాడు. దాని చూపంత వాడి మీదే ఉంది. ఏం జరుగుతుందని కంగారుగా ఉంది నాకు అని తాయారు అంటుంది.. కానీ గాయత్రిని పెళ్ళికొడుకు ఇటు ఉంటే అటు చూస్తావెంటే అని అడుగుతుంది.. ఉంగరం పెట్టు అని గాయత్రీ ని అనగానే ఇక కళ్ళు మూసుకొని ఉంగరం పెట్టేస్తుంది..
నేను చచ్చిపోతాను అని గాయత్రిని తయారు బెదిరించడంతో ఇక చేసేదేమీ లేక పెళ్లి కొడుకుకి కూడా ఉంగరం తొడిగేస్తుంది. మాధవ్ వాళ్ళిద్దర్నీ అలా చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అసలు మనం ఇక్కడికి వచ్చి తప్పు చేసాము అని మహాలక్ష్మి. మాధవ్ ని చూసిన గాయత్రి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇకనుంచి వెళ్ళిపోదాం పదండి వాళ్ళని ఏడిపించాలని వచ్చి మనము పెద్దిని ఏడిపించాము అని మహాలక్ష్మి అనగానే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు..
వాళ్లు వెళ్ళిపోతుండగా పెళ్లి కొడుకు తండ్రి అక్కడికి వచ్చి మీరు మాకు వియ్యంకులు లాంటివారు. భోజనం చేయకుండా వెళ్తే మేము చాలా ఫీల్ అవుతాం మీరు చేయకుండా ఉంటే మేము కూడా చేయము అని వాళ్ళని బలవంతంగా భోజనాలు దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అతను దగ్గరుండి వడ్డించడంతో వాళ్ళు మర్యాదగా తింటూ ఉంటారు. అయితే పురుషోత్తం రమణయ్య ఇద్దరు దగ్గరుండి వడ్డించడంతో వాళ్లు తినడంతో పాటుగా ఆ భోజనాలకి నారాయణ వంకలు పెడుతూ ఉంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన తాయారు సిగ్గు లేకుండా భోజనానికి వచ్చి కూర్చోడానికి మీకు ఎంత ధైర్యం అనేసి అంటుంది.. తాయారుకు దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతాడు నారాయణ..
ఇక అందరూ అవమానం అని ఇంటికి వచ్చిన తర్వాత బాధపడిపోతూ ఉంటారు.. నీకు ఇప్పుడు కిరీటం పెట్టారు కదా ఎలా ఉంది అని నారాయణ అడుగుతారు.. ఇలాంటి వాళ్లు కాబట్టే వాళ్లకి సంబంధం చెడిపోయేలా చేసి ఉంటే బాగుండేది అని నారాయణ మాధవ్ అంటాడు.. అసలు ఏ సంబంధం రానివ్వకుండా చేసి ఉంటే బాగుండేది. అప్పుడు వాళ్ళు తిక్క కుదిరింది నీకు వచ్చి ఇచ్చేవాళ్ళు అని నారాయణ అంటాడు. అలా చేయడం వల్ల గాయత్రి చచ్చిపోయేది. ప్రేమించిన అమ్మాయి గురించి తప్పుగా ఎలా చెప్తాను నాన్న అని మాధవ్ ఎమోషనల్ అయిపోతాడు..
శైలు అలాగే కేశవ చేసిన వీడియో మాత్రం బాగా ట్రెండ్ అవ్వడంతో తన ఫ్రెండ్ కీర్తి మీరిద్దరూ ఒక్కసారిగా సెలబ్రిటీలు అయిపోయారు.మిలియన్లలో వ్యూస్ వెళ్తున్నాయి అని అంటుంది.. ఆ తర్వాత ఎన్ని వీడియోలు చేసినా కూడా మీరిద్దరూ కలిసి చేస్తే బాగుంటుందని నా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు వాడితో నేను ఎలా చేస్తాను అని శైలు అంటుంది.. ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే శైలుకి ఒక ఫోన్ వస్తుంది. మీరు ఒక యాడ్ చేస్తే 20000 ఇస్తామని అంటారు.. ఆ మాట వినగానే శైలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయితే తన రీల్స్ వల్ల తను ఇంత ఫేమస్ అయిపోతానని ఒక్కసారిగా అనుకోలేదు అని శైలు అనుకుంటుంది. ఏది ఏమైనా కూడా తనకు ఇంత క్రేజ్ వచ్చింది అంటే తన నటన వల్లే అని చాలా గొప్పగా అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…