Podarillu Today Episode April 19th : చక్రి ఆధార్ కార్డు కోసం ఎంత ప్రయత్నాలు చేసినా సరే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చెప్పడంతో తాను కూడా చాలా ఫీల్ అవుతూ ఉన్నట్లు ఉంటాడు. చక్రి అనే బాధ పెట్టడం చూసిన మహాలక్ష్మి నాకోసం ఇతను ఎంత బాధ పడుతున్నాడు అని అంటుంది. ఆ తర్వాత చక్రి మహా ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. మహాలక్ష్మి సంతోషంగా ఉంచాలి అని ఎన్ని ప్లాన్లు వేసినా కూడా ఫెయిల్ అవుతూ వస్తాయి. చివరికి వాళ్ళిద్దరి ఇంటికి వెళ్ళగానే అందరితో సంతోషంగా మాట్లాడాలి అని అనుకుంటారు. ముఖ్యంగా మహాలక్ష్మి ఆ గాయత్రి కి పెళ్లి అవుతుంది కదా మనం కూడా పెద్దికి పెళ్లి చేద్దామని అంటుంది. ఆల్రెడీ మనం చూసిన సంబంధాలలో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వెళ్లి అడిగితే మంచిది కదా అని అనుకున్నది మహాలక్ష్మి. మొత్తానికి మాధవ్ కి మరోసారి పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది మహాలక్ష్మి..
గాయత్రి పెళ్లయిపోతుందని చాలా బాధపడిపోతూ ఉంటుంది.. బావతో ఎలాగైనా సరే మళ్లీ మాట్లాడాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. కానీ మాధవ్ మాత్రం గాయత్రీ ని చూడడానికి కూడా ఇష్టపడకుండా ఉంటాడు. గాయత్రి ఎంతగా తన బావతో మాట్లాడాలని అనుకున్న సరే తను మాత్రం నేను మాట్లాడలేను అని కఠినంగా ఉంటాడు.. అయితే మహాలక్ష్మి మాత్రం మాధవ్ని ఎలాగైనా సరే మళ్లీ మామూలు మనిషిని చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. తాయారు తన అల్లుడితో మాట్లాడాలి అని గాయత్రీ ని ఎంతగా చెబుతున్నా సరే నువ్వు చెప్పినట్లే ఎంగేజ్మెంట్ చేసుకున్నాను.. కానీ అతనితో మాట్లాడటం అతని పెళ్లి చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు అని అంటుంది.
తన ఆధార్ కార్డు ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని మహాలక్ష్మి అనుకుంటుంది.. అయితే తన దగ్గర ఆధార్ కార్డు ఉంది అని చెప్తే మహాలక్ష్మి తనని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అని చక్రీ తన దగ్గర లేదు అన్నట్లుగానే.. తనకోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తనని నమ్మిస్తాడు.. మహాలక్ష్మి ఆధార్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తుంది కానీ చివరికి తన ప్రయత్నాలు పాలించవని తెలుసుకొని బాధపడిపోతూ ఉంటుంది. నేను అనుకున్నా లక్ష్యాలను సాధించలేకపోవడానికి ఒక్క ఆధార్ కార్డు కారణమని చక్రీ దగ్గర బాధపడుతుంది. ఎంతగా బాధపడిన సరే.. చక్రి ఆధార్ కార్డు కోసం చేస్తున్న ప్రయత్నాలను చూసి మహాలక్ష్మి తన కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంచి వాళ్ళు అని అనుకుంటుంది..
ఎలాగైనా సరే మాధవ్ పెళ్లి చాలని మహాలక్ష్మి పెళ్లి సంబంధం మాట్లాడటానికి అని అనుకుంటుంది. మొదటగా చూసిన పెళ్లి సంబంధం దగ్గరికి మహాలక్ష్మి అలాగే చక్రి వెళ్లి మాట్లాడాలని అనుకుంటారు. అయితే ఆ పెళ్లి సంబంధం దగ్గరికి వెళ్లి మహాలక్ష్మి ఎలాగైనా మాట్లాడి పెద్దికి పెళ్లి చేయాలని అనుకుంటుంది. కానీ అక్కడ అమ్మాయి మీ మాధవ్ గారిని చేసుకోవడం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటుంది. నాకు ఇల్లు నచ్చలేదు అంతమంది మగాళ్ళ మధ్య నేను ఉండాలి అంటే నాకు కొంచెం భయంగా ఉంది అని అంటుంది. అయితే ఎంత చెప్తున్నా సరే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటాను కానీ వేరే కాపురం పెడతాను అప్పుడైతేనే ఆయన నేను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. ఆ మాట వినగానే మహాలక్ష్మి చక్రి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు.
మరి ఆ అమ్మాయి సంబంధానికి ఒప్పుకుందా లేదా అని కన్నా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అక్కడ పెళ్లి సంబంధం వాళ్ళు చెప్పిన మాట విని చక్రి మహాలక్ష్మి ఇద్దరు షాక్ అయ్యి నోట మాట రాకుండా ఇంటికి వస్తారు. కన్నా ఇంటికి రాగానే ఏం చెప్పారు వదిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వాళ్ళకు ఇష్టమేనా లేదా అని ఎంతగా అడిగిన సరే మహాలక్ష్మి మౌనంగా ఉంటుంది.. కానీ చక్రి మాత్రం అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు. అమ్మాయి ఇంట్లో ఉండదంట అన్నయ్యని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టమేనట.. కానీ ఆ అమ్మాయి ఇంట్లో ఉండదని చెప్పేసింది.. మరి అన్నయ్య ఒప్పుకుంటే అన్నయ్యని మనం అమ్మాయితో పాటే పంపించేద్దాం మా నాన్నకి పెళ్లికాడమీ మనకి ఇంపార్టెంట్ అని అందరూ అనుకుంటారు.
కేశవ శైలు ఇద్దరు కూడా గొడవ పడుతూనే ఉంటారు. నాకు ఒక మంచి కంపెనీలో యాడ్ చేయడానికి ఆఫర్ ఇచ్చారు. మీ 20,000 నీ మొహానికి కొట్టేస్తాను అని ధీమాగా చెప్పడంతో కేశవ ఏంటి పోయినసారి ఇలానే చేశావు కానీ.. అప్పుడు ఏం జరిగిందో చూశారు కదా అని అంటాడు. ఏది ఏమైనా సరే ఈసారి మాత్రం అలాంటివి జరగవు అని శైలు కేశవ తో గొడవ పడుతుంది. అయితే కేశవ మాత్రం తను ఏం చేస్తుందో చూడాలి అని అనుకుంటాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి సోమవారం ఎపిసోడ్లో ఎలాంటి ట్విస్టులు ఎదురవుతాయో చూడాలి..