Babar Azam-Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2026 లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా ప్రతి మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటి వరకు 27 మ్యాచ్ లు పూర్తయ్యాయి. అంటే దాదాపు 40 శాతం టోర్నమెంట్ ఫినిష్ అయిపోయింది. ఇక నిన్న రాయల్ చాలెంజెస్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Royal Challengers Bengaluru vs Delhi Capitals) మధ్య చిన్న స్వామి స్టేడియం ( M.Chinnaswamy Stadium, Bengaluru) వేదికగా బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో పోరాడి ఓడిపోయింది బెంగళూరు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ వివాదాస్పద పోస్టర్ వైరల్ గా మారింది. విరాట్ కోహ్లీ (Virat Kohli) అలాగే పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజం ( Babar Azam) ఇద్దరు కలిసి ఉన్న పోస్టర్ ను ప్రదర్శించింది బెంగుళూరు అభిమాని. మ్యాచ్ జరుగుతుండగానే ఈ పోస్టర్ ప్రదర్శించి రచ్చ చేసింది. దీంతో విరాట్ కోహ్లీ పైన నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. పాకిస్తాన్ తో విరాట్ కోహ్లీకి సంబంధాలు ఉన్నాయని.. అందుకే బాబర్ తో దిగిన ఫోటోలను వైరల్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.
Also Read: Tanveer Ahemed: గిల్ బ్యాట్లలో రబ్బర్లు…అందుకే అవలీలగా సిక్సులు, బౌండరీలు కొడుతున్నాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 26వ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ తో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం కలిసి ఉన్న ఫోటోలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన లేడీ అభిమాని ప్రదర్శించింది. దీంతో ఈ అంశం వివాదంగా మారింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో పాకిస్తాన్ అభిమానులు కూడా ఉన్నారని.. ముఖ్యంగా బాబర్ ఆజం లాంటి వెధవలను మోసే దుర్మార్గులు ఉన్నారని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇండియాను దొంగ దెబ్బ కొట్టే పాకిస్తాన్, అక్కడి ప్లేయర్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు సపోర్ట్ చేస్తున్నారని మరికొంతమంది చురకలు అంటిస్తున్నారు. ఈ తరుణంలోనే ఆర్సీబీ జట్టుపై బ్యాన్ విధించాలని కోరుతున్నారు.
ది 100 లీగ్ టోర్నమెంట్ సందర్భంగా పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసిన సందర్భంగా కావ్య పాపను దారుణంగా ట్రోలింగ్ చేసిన సంగతి తెలిసిందే. కావ్య పాపను దేశద్రోహి అంటూ ట్రోల్స్ కూడా చేశారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంతో కోహ్లీ ఉన్న ప్లకార్డులు వైరల్ అయిన నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కూడా బ్యాన్ చేయాలని హైదరాబాద్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దెబ్బకు దెబ్బ కొడుతున్నారు.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==