Podarillu Today Episode May 14th : గాయత్రి మాధవ్ఇంటికి వెళ్లి వచ్చింది అని తాయారు కంగారు పడిపోతూ ఉంటుంది.. నేను మీ అల్లుడుగారు బయటకు వెళ్లాలనుకుంటున్నాము అని చెప్పగానే ఎక్కడికి వెళ్తున్నారని ఆతృతగా అడుగుతుంది తాయారు.. మాధవ్ బావ ఇంటికి భోజనానికి వెళ్తున్నాము అని చెప్పగానే ముందు ఒప్పుకొని తాయారు నిజాన్ని బయటపెడతాను అని చెప్పడంతో ఒప్పుకుంటుంది. అయితే వినోద్ ని తీసుకొని గాయత్రి పెరటి గుమ్మం నుంచి ఇంట్లోకి రావడంతో అందరూ నీకు ఇప్పుడు పెళ్లి అయింది కదే మెయిన్ డోర్ నుంచి రా అని చెప్తారు. ఇక వాళ్ళు రాగానే వినోద్ కి మర్యాదలు చేస్తారు.. వినోద్ మాధవ్ గురించి చాలా గొప్పగా చెప్తాడు.. అందరూ గాయత్రి వినోద్ కి మర్యాద ఇస్తారు..
వినోద్ మాధవ్ ని పొగడ్తలతో ముంచెత్తుతాడు. మీరు చాలా మంచి వాళ్ళని మా నాన్న కూడా పొగుడుతూ ఉంటారు.. మా నాన్నగారు మీ గురించి ధర్మాత్ముడు అంటారు నాకు కూడా మిమ్మల్ని చూస్తే సొంత అన్నని చూసినట్లయితే ఫీలింగే వస్తుంది అని మాధవ్తో అంటాడు. అయినా నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అడగొచ్చా అని మాధవ్ ను వినోద్ అడుగుతాడు.. ఏంటో అడగండి పర్వాలేదు అని మాధవ్ అనగానే మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడుగుతాడు.. అంటే మీ తమ్ముడు పెళ్లి చేసుకున్నారు కదా మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని వినోద్ అడగగానే చక్రి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తొందరగా పెళ్లి చేయాలనుకున్నారు అందుకే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము అని చక్రి చెప్తాడు. మ్యాట్రిమోనీ లో కూడా చూస్తున్నాము సెట్ అయితే కచ్చితంగా పెళ్లి చేస్తామని మహాలక్ష్మి కూడా అంటుంది..
మీరు కూడా మాకు సొంత అన్నలాగే కనిపిస్తున్నారు మీ సైడ్ ఎవరైనా అమ్మాయి ఉంటే మా అన్నయ్యకి చూడండి అని వినోద్ని చక్రి అడుగుతాడు.. నాకు పెద్దగా తెలియదు కానీ మా నాన్నకు బాగా తెలుసు.. ఆయనే దగ్గరుండి మీ పెళ్లి జరిగేలా చేస్తాడు అని వినోద్ అంటాడు. గాయత్రి కూడా పెళ్లి చేసుకో బావ అని అంటుంది.. ఇక చక్రిని మహాలక్ష్మి పక్కకు తీసుకొని వెళుతుంది.. ఏం మాట్లాడుతున్నారో మీకు కొంచమైన బుద్ధుందా అని అడుగుతుంది.. నేనేం చేశాను అండి అని చక్రి అంటే ఇంటికి కొత్తగా పెళ్లయిన ఒక జంట వస్తే వాళ్లకు బట్టలు పెట్టాలని మీకు తెలియదా అని మహాలక్ష్మి అడుగుతుంది. నాకైతే తెలియదు కానీ మీకు తెలుసు కదా మీరు ఎందుకు చెప్పలేదు చెప్తే నేను తీసుకునే వాడిని కదా అనేసి చక్రి అంటాడు. నా దగ్గర ఒక డ్రెస్ ఉంది. అబ్బాయికి మీరు ఏదైనా ఇవ్వండి అని మహాలక్ష్మి అంటుంది..
గాయత్రి మాధవ్ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోతూ అందరిని తలుచుకొని బాధపడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా గదిలో కూర్చుని బాధపడుతుంది.. నీ చేత తాళి కట్టించుకోవాలి అని అనుకున్నాను 20 ఏళ్ల తర్వాత నీ చేత పప్పన్నం తిన్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. మాధవ జ్ఞాపకాలని తీసివేయాలి అని తన ఫోటోలను డిలీట్ చేస్తుంది.. ఇక వినోద్ వచ్చి అందరు వెయిట్ చేస్తున్నారు పద వెళ్లిపోదామని అంటాడు. బయటికి వెళ్లిన తర్వాత తాగారు ఏంటే నీ బావ కోసం ఏడ్చావు కనీసం కన్నతల్లి కోసం రెండు చుక్కలు కూడా నీళ్లు కార్చలేవా అని అడుగుతుంది. నాకు బాధని మిగిల్చావు నాకు ఇంకా కన్నీళ్లు రావమ్మా నువ్వు చెప్పినట్లే చేసుకున్నాను కదా అలానే వెళ్తాను అని గాయత్రి అత్తవారింటికి వెళ్ళిపోతుంది..
రాత్రి అవగానే మహా అందరికీ లస్సీ తెచ్చి ఇస్తుంది. అయితే ఒక మెసేజ్ రావడంతో తనకి ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు పెద్ది అని గట్టిగా అరుస్తుంది మహాలక్ష్మి.. చక్రి మాత్రం మహాలక్ష్మి ఇక వెళ్ళిపోతుంది అని బాధపడిపోతాడు. ఉదయం లేచిన తర్వాత చెక్రిని దగ్గరుంటే అసలు చదవలేరు నువ్వు వెళ్ళగానే మాధవ్ అంటాడు. చక్రి ఒక శుద్ధపుసాని తన బాగోతం మొత్తం మాధవ చెప్పడంతో చక్రి ఫీల్ అయిపోతాడు. మహాలక్ష్మి నేను ఇంటర్వ్యూ ఉంది చదువుకోవాలని లోపలికి వెళ్తుంది.. అప్పుడే హారిక ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పగానే అందరూ ఈ ఇంటికి వస్తే తను ఏమనుకుంటుందో అని కంగారు పడిపోతూ ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…