Podarillu TRP Rating : సీరియల్స్ ప్రసారం చేస్తున్న టీవీ చానల్స్ కి డిమాండ్ ఎక్కువే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చానల్స్ లలో ప్రసారమవుతున్న సీరియల్స్ ఆడియోస్ కి ఎంత బాగా కనెక్ట్ అవుతున్నాయో ఆ సీరియల్స్ యొక్క టీఆర్పి రేటింగ్ అని చూస్తేనే అర్థమవుతుంది.. డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకుల మనసుని ఆకట్టుకునే సన్నివేశాలతో వచ్చే సీరియల్ సన్నీ కూడా మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంటున్నాయి. టీవీలలో ప్రతిరోజు ప్రసారమయ్యే సీరియల్స్లలో కొన్ని సీరియల్స్ గా లేటుగా వచ్చినా కూడా రేటింగ్ లో దూసుకుపోతున్నాయి.. అలాంటి సీరియస్లలో పొదరిల్లు సీరియల్ ఒకటి. ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రస్తుతం డిఫరెంట్ ట్విస్ట్ లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. చక్రి పెళ్లి విషయం ఇంట్లో తెలిసిపోయిన తర్వాత రియల్ స్టోరీ రోజుకో మలుపు తిరుగుతూ ఇంట్రెస్ట్ గా మారింది.. మరి మార్చి నెలలో హైలెట్ ఎపిసోడ్స్ ఏవో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
ప్రస్తుతం స్టార్ మా లో సక్సెస్ఫుల్ టాక్ తో ప్రసారమవుతున్న సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ ఒకటి.. గత ఏడాది డిసెంబర్ 22న ఈ సీరియల్ ప్రారంభమైంది. జనవరి నెలలకు రాగానే టీఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. గతంలో వచ్చిన స్టార్ సీరియల్స్ కి గట్టి పోటీ ఇస్తుంది. ఇక ఈ సీరియల్ మార్చి నెలలో హైలెట్ ఎపిసోడ్స్ ని ఒకసారి చూస్తే.. మహాలక్ష్మి భూషణ్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక బలవంతంగా పోలీసులు వల్ల చక్రితో తాళి కట్టించుకుంటుంది. చక్రీ వాళ్ళ కుటుంబం మాత్రం చక్రి పెళ్లి చేసుకొని వచ్చారు అని చాలా సంతోషంగా ఉంటారు.. అయితే మహాలక్ష్మి ఇది కేవలం అబద్దపు పెళ్లి మాత్రమే అని మాధవ్తో చెబుతుంది.. కానీ వారిద్దరి కోసం ఏర్పాటు చేసిన రిసిప్షన్ ని పాడవకుండా ఒక బొమ్మలాగా వచ్చి అక్కడ నిలబడుతుంది.. మొత్తానికి ఆ రిసెప్షన్ గ్రాండ్ గా పూర్తవుతుంది.. ఆ నిజాన్ని మాధవ్ తన గుండెల్లోనే దాచుకొని ఇంట్లో వాళ్లకి చెప్పకుండా మహాలక్ష్మి సేఫ్టీ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. విడాకులు తీసుకోవడానికి లాయర్ ని కలిసిన విషయాన్ని చక్రీ కానిస్టేబుల్ తో చెప్పి మహాలక్ష్మికి మార్నింగ్ ఇప్పిస్తాడు.. కానీ ఆ విషయం ఇంట్లో తెలియడంతో కేశవ కన్నాకి ఆ పెళ్లి అబద్ధపు పెళ్లి అని తెలిసిపోతుంది. ఎమోషనల్ గా కట్టిపడేసే సీన్ ఇదే.. మార్చి నెలలో హైలెట్ ఎపిసోడ్ అంటే చక్రిమహాలక్ష్మి లా పెళ్లి గురించి ఇంట్లో తెలిసిపోవడమే..
Also Read :ఆరాధ్య మిస్సింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న అవని.. పల్లవికి వార్నింగ్.. నెక్స్ట్ ట్విస్ట్ ఇదే..
మాధవ్ చెప్పడంతో ఆ ఇంట్లో ఉండడానికి మహాలక్ష్మి ఒప్పుకుంటుంది.. ఇక మళ్లీ ఆ ఇంట్లో వాళ్ళందరినీ కూడా తన మాటలు వినేలా చేసుకోవాలని మహాలక్ష్మి అనుకుంటుంది.. మహాలక్ష్మి ఇంట్లో ఉన్న తర్వాత అందరూ కూడా తన మాట వినాలని అనుకుంటారు.. ఇక కేశవ శైలు ఫోన్ని ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతాడు.. ఆ ఫోను కు శైలు ఫోన్ చేసి కేశవ తన బాయ్ ఫ్రెండ్ అని అబద్ధం చెప్తుంది. మహా కన్నా ఇద్దరు కూడా కేశవ అని ఒక ఆట ఆడుకుంటారు.. అయితే కేశవ ఆ అమ్మాయి గురించి అసలు నిజాన్ని బయటపెట్టేస్తాడు.. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి కేశవ అని ఆటపట్టిస్తాడు. మరి నిజంగానే కేశవ శైలు ఇద్దరు కూడా ప్రేమలో పడతారా లేదా అన్నది ఇక ముందు జరగబోయే ఎపిసోడ్లలో చూడాలి…