Illu illaalu Pillalu Srivalli : స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఉమ్మడి కుటుంబంలో తన ఆధిపత్యం చెలాయించాలని అనుకునే వాళ్ళకి ఈ సీరియల్ కళ్లకు కట్టినట్లు స్టోరీని చూపిస్తుంది. ఈ సీరియల్లో ఆ ఇంటికి పెద్ద కోడలుగా ఉన్న శ్రీవల్లి పెత్తనం కోసం మిగిలిన కోడల్ని తప్పుగా చూపిస్తూ ఉండేది. మావయ్య గారి దగ్గర అత్తయ్య గారి దగ్గర మంచి కోడలు అనిపించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ వచ్చేది. అలాంటి శ్రీవల్లి క్యారెక్టర్ జనాలకి బాగా కనెక్ట్ అయిపోయింది. అయితే శ్రీవల్లి ఎప్పుడు ఏదో ఒక తింగరి పని చేసి అడ్డంగా దొరికిపోతూ ఉంటుంది.
రీసెంట్ గా తన కడుపు అబద్ధం అన్న సంగతి ఇంట్లో తెలిసిపోయి అందరితో చివాట్లు తింటుంది. అలాంటి కామెడీ క్యారెక్టర్ అయిన శ్రీవల్లి ఇప్పుడు ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది గతంలో కూడా ఇలానే వార్తలు వినిపించాయి. ఇప్పుడు కూడా మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి అంటే ఇవి కేవలం రూమర్స్ మాత్రమే అని ఈ సీరియల్ అభిమానులు అనుకుంటున్నారు. కానీ రీసెంట్గా శ్రీవల్లి తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన వీడియో వల్లే ఆ వార్తలు వినిపిస్తున్నాయని తెలుస్తుంది. మరి నిజంగానే ఈమె సీరియల్ ఇది తప్పుకుంటుందా లేదా అన్నది ఒకసారి చూసేద్దాం…
స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు. రామరాజు తన ముగ్గురు కొడుకులకి పెళ్లిళ్లు చేసి చాలా సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు. ఇద్దరు పిల్లలు మాత్రం తనకి చెప్పకుండానే పెళ్లి చేసుకోవడంతో చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. తండ్రి మాట ఎప్పుడూ జవదాటని పెద్ద కొడుకుకి తాను ఏరి కోరి చేసిన సంబంధం చాలా గొప్పది అని సంతోషంగా ఉంటాడు. అయితే వాళ్లు చేసిన మోసం గురించి రామరాజుకు తెలిస్తే ఏమైపోతాడో అని ఆ ఇంట్లోని వాళ్ళందరూ అతనికి ఏ విషయాన్ని చెప్పకుండా దాచిపెడతారు. పెద్ద కోడలుగా అడుగుపెట్టిన శ్రీవల్లి మావయ్యకి తెలియకుండా ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఈ సీరియల్ కి నర్మద క్యారెక్టర్ ఎంత హైలైట్ అయిందో అంతకుమించి శ్రీవల్లి క్యారెక్టర్ కూడా హైలెట్ గా నిలిచింది. శ్రీవల్లి పాత్రలో సీరియల్ నటి త్రివేణి యాదవ్ నటించారు. ఈమె నటనకు జనాలు ఫిదా అవుతుంటారు. అలాంటి శ్రీవల్లి ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తుంది. నిజానికి త్రివేణి యాదవ్ ఓ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. ఆ వీడియోలో ఆమె తనకు గౌరవం లేని దగ్గర నేను పని చేయను అని చెప్పినట్లు తెలుస్తుంది.. అయితే ఈ సీరియల్ గురించే అని అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈమె ఈ సీరియల్ లో మాత్రమే నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వీడియో నిజంగానే ఆమె షేర్ చేసిందా లేదా ఏఐ ఈ వీడియోనా అన్నది క్లారిటీ రాలేదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై త్రివేణి యాదవ్ క్లారిటీ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే..
త్రివేణి యాదవ్ నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సుందరి అనే సీరియల్ తో తన కెరీర్ని మొదలుపెట్టిన త్రివేణి యాదవ్ ఆ తర్వాత ఒక్కో సీరియల్ తో తన టాలెంట్ నిరూపించుకుంటూ వస్తుంది. ప్రస్తుతం ఈమె తెలుగు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియలు ఆమె కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. అలాంటి త్రివేణి ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అని గతంలో కూడా చాలాసార్లు వార్తలు వినిపించాయి.. మరి ఇప్పుడు కూడా అదే రూమర్స్ అయి ఉంటాయని ఆమె అభిమానులు కొట్టి పడేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇకపోతే త్రివేణి యాదవ్ రోజుకి 25 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఈ లెక్కన ఈమె సీరియల్ కి దాదాపు నెలకి లక్షల్లోనే తీసుకుంటుంది..