Karthika Deepam 2: స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాప్ సీరియల్స్లలో కార్తీకదీపం సీరియల్ ముందు వరుసలో ఉంది. డిఫరెంట్ స్టోరీ తో చిన్న ఈ సీరియల్ ప్రస్తుతం మొదటి సీజన్ ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని, రెండో సీజన్లోకి అడుగు పెట్టింది.. ఈ సీజన్ కూడా ప్రేక్షకుల ఆదరణతో మంచి టిఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం సీరియల్ స్టోరీ కాస్త డల్ అయినట్లు కనిపిస్తుంది. అంతే కాదు ఈ సీరియల్ నుంచి డాక్టర్ బాబు బయటకు వెళ్ళిపోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ సీరియల్ హీరో డాక్టర్ బాబు ఎందుకు బయటకు వెళ్లాలని అనుకుంటున్నాడు ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…
డాక్టర్ బాబు వంటలక్క ఈ పేర్లు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయాయి. ఈ సీరియల్ ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు. మొదటి సీజన్లో వంటలక్క డాక్టర్ బాబు ఎప్పుడు కలుస్తారు అన్న సస్పెన్స్ తో ఈ సీరియల్ మొత్తం ప్రేక్షకులను ఎంత ఆకర్షించిందో.. చివరికి ఆ సీజన్లో ఆ ఇద్దరు కలుసుకుంటారు ఆ ఇద్దరికీ ఇద్దరు పిల్లలు పుడతారు. అలా సీజన్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు రెండో సీజన్ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సీరియల్లో డాక్టర్ బాబు పాత్ర కీలకంగా మారింది. అయితే ఈ సీరియల్ నుంచి డాక్టర్ బాబు తప్పుకుంటున్నాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సూపర్ హిట్ సీరియల్ నుంచి ఆయన ఎందుకు తప్పుకుంటున్నాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి ఈ సీరియల్ హీరో డాక్టర్ బాబు ఒకవైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు సీరియల్స్ నిర్మాతగా వ్యవహరిస్తూ సక్సెస్ అవుతున్నాడు. నిర్మాణ పనుల్లో బిజీగా ఉండడంతో ఆయన సీరియల్ చేయడానికి కుదరదు లేదని సీరియల్ నుంచి బయటకు వెళ్లడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే డాక్టర్ బాబు రియాక్ట్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే..
Also Read : ‘పొదరిల్లు’ చక్రీ భార్య బ్యాగ్రూండ్ ఇదే.. వామ్మో మామూలు రికార్డు కాదు..
ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ స్టోరీ విషయానికొస్తే.. ఈ సీరియల్ లో వంటలక్క డాక్టర్ బాబు ఇద్దరూ కలిసే ఉంటారు.. అయితే వీళ్ళిద్దరిని విడగొట్టాలని ఈ సీరియల్ లో విలన్ పాత్రలో నటించిన జోష్నా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆఖరికి అసలు వారసురాలు వంటలకి అని తెలిసినా కూడా ఆమె తన ప్రయత్నాలు మానుకోకుండా ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మరి ఈ సీరియల్ ముగింపుకి చేరుకోవడానికి కొన్ని ఎపిసోడ్లే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సీజన్ 2 పూర్తయిన వెంటనే సీజన్ 3 కూడా ప్రారంభం కాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే దాని గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది..