E-Paper
Advertisement

Tollywood: టాలీవుడ్ ఫీమేల్ యాంకర్స్.. ఎవరు ఎక్కువ చదువుకున్నారంటే?

Tollywood: టాలీవుడ్ ఫీమేల్ యాంకర్స్..  ఎవరు ఎక్కువ చదువుకున్నారంటే?
Advertisement

Tollywood:సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులు ఎలా అయితే తెలుసుకోవాలని చూస్తారో.. యాంకర్స్ కి సంబంధించిన విషయాలను కూడా అలాగే తెలుసుకోవాలని పరితపిస్తూ ఉంటారు. ముఖ్యంగా బుల్లితెరపై పలు టీవీ చానల్స్ లో ప్రసారమయ్యే షోలకు మంచి రేటింగ్ రావడానికి ప్రథమ పాత్ర పోషించే ఈ యాంకర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అటు సినిమా ప్రమోషన్స్ లో ఇటు షోలకు మంచి టిఆర్పి రేటింగ్ తీసుకురావడంలో యాంకర్స్ పడే తపన, కష్టం వర్ణనాతీతం. అందుకే యాంకర్స్ ఇటువంటి వాటికి మూల స్తంభంగా నిలుస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ యాంకర్స్ కి అభిమానులు కూడా ఎక్కువే . అందుకే వీరికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు టీవీ ఫీమేల్ యాంకర్స్ విద్యార్హతలు ఏంటి? ఎవరు ఎంత ఎక్కువ చదువుకున్నారు? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

సుమ కనకాల..

యాంకర్ అనగానే ముఖ్యంగా వినిపించే పేరు సుమ కనకాల. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరిని మెస్మరైజ్ చేస్తూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న సుమా కనకాల.. టీవీ క్వీన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. తన యాంకరింగ్ తో దశాబ్దాల కాలంగా ఆడియన్స్ హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ఈమె విద్యార్హత విషయానికి వస్తే.. సికింద్రాబాద్ లోని రైల్వే కాలేజ్ లోఎం కామ్ (M.Com )పూర్తి చేసింది.

ఉదయభాను:

Advertisement

తెలుగులో సుమా కంటే ముందే అడుగు పెట్టి అందంతో, అభినయంతో, చక్కని వాక్చాతుర్యంతో అటు పిల్లలను ఇటు పెద్దలను మెప్పించిన ఏకైక లేడీ యాంకర్ ఉదయభాను. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసింది.

అనసూయ:

ప్రముఖ ఛానల్లో న్యూస్ ప్రజెంటర్ గా తన కెరీర్ని ప్రారంభించి ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా మారి అటు సినిమాలు, షోలతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది అనసూయ.హైదరాబాదులోని భద్రూఖా కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసింది.

రష్మీ గౌతమ్:

Advertisement

జబర్దస్త్ లో మరో యాంకర్ గా తన ఉనికిని చాటుకున్న రష్మీ గౌతమ్ ఇప్పుడు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో యాంకర్ గా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. వైజాగ్ లోని ఆంధ్ర యూనివర్సిటీలో బీకాం (B.Com) పూర్తి చేసింది.

శ్రీముఖి:

ఈ జనరేషన్లో భారీ పాపులారిటీ సంపాదించుకున్న లేడీ యాంకర్ శ్రీముఖి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. రియాలిటీ షో లైనా.. సినిమా ఈవెంట్లైన ఇప్పుడు సినిమాలలో కూడా నటిస్తూ మరింత క్రేజ్ దక్కించుకున్న ఈ అమ్మడు బీడీఎస్ (డెంటల్) చదువుతున్న సమయంలోనే అదుర్స్ షోలో అవకాశం రావడంతో చదువుకి మధ్యలోనే బ్రేక్ చెప్పేసింది.

లాస్య:

బుల్లితెరపై సంథింగ్ స్పెషల్ షో తో యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన లాస్య.. హైదరాబాదులోని సిబిఐటి కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది.

శ్యామల:

మొదట బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ.. ఆ తర్వాత తెలుగులో స్టార్ యాంకర్ గా దూసుకుపోయిన శ్యామల.. కాకినాడలో బీకాం పూర్తి చేసింది.

also read:సారా అర్జున్ తండ్రి తెలుగు స్టార్ నటుడని మీకు తెలుసా?

మంజూష:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన రాఖీ సినిమా ద్వారా నటిగా తన కెరీర్ను ప్రారంభించిన మంజుష ఆ తర్వాత యాంకర్ గా పేరు దక్కించుకుంది. హైదరాబాదులో బీటెక్ చేసింది.

వర్షిణి :

ప్రముఖ యాంకర్ వర్షిణి హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేయగా..

Related News

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు..

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Big Stories

Advertisement
×