Illu Illaalu Pillalu Vedavathi : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న టాప్ సీరియల్స్ లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి.. కుటుంబంలో పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే తండ్రి పడే ఆవేదన ఎలా ఉంటుంది? ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళతో సంతోషంగా ఉండే కుటుంబంలోకి అనుకొని సంఘటనలు విషాదాన్ని మిగిల్స్తే ఎలా ఉంటుంది అన్నది ఈ సీరియల్ స్టోరీ. తన మీద పగతో తన కూతురిని ఇబ్బంది పెట్టాలని చూసిన తన భార్య కుటుంబాన్ని ఏమీ అనలేక ఆ పెద్దమనిషి పడే నరకయాతన ఈ సీరియల్లో కళ్ళకు కట్టినట్లుగా స్పష్టంగా చూపించారు. అలాంటి వ్యక్తి భార్య పాత్రలో నటించింది వేదవతి.. తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ పిల్లల్ని పద్ధతిగా పెంచాలి అని తల్లి పాత్రలో నటించిన ఆమని గురించి అందరికీ తెలుసు. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన ఈమె మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది.. అయితే ఇప్పుడు ఈమె గురించి సోషల్ మీడియాలో వార్త ప్రచారంలో ఉంది. ఈ సీరియల్ నుంచి బయటకు వెళ్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు వేదవతి ఎందుకు సీరియల్ కి గుడ్ బై చెప్పబోతోంది అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం.
స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. డిఫరెంట్ కుటుంబ స్టోరీ తో జనాలను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. ఈ సీరియల్ లోని మెయిన్ లీడ్ పాత్రలో వేదవతి అలియా స్ సినీనటి ఆమని నటిస్తుంది.. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిన్ గా ఇండస్ట్రీలోని ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఒకవైపు సినిమాలు.. మరోవైపు షార్ట్ ఫిలిమ్స్.. అలాగే బుల్లితెరపై కూడా పలు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈమె ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నుంచి తప్పుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. కారణం కూడా లేకపోలేదు. ఆమెకు ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉండడంతో ఈ సీరియల్ కి గుడ్ బై చెప్తుందని సమాచారం.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ. ప్రస్తుతం వేదవతి లేకున్నా ఉంటే ఈ సీరియల్ చూడడం కష్టమే అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. మరి దీనిపై ఆమని ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..
Also Read :స్టార్ హీరోయిన్ భర్తతో రొమాన్స్ చెయ్యబోతున్న బుట్టబొమ్మ.. ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కే..!
ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ విషయానికి వస్తే.. వల్లి తనని మోసం చేసిందని చందు బాధపడిపోతూ ఉంటాడు. తనని తన జీవితంలోకి రానివ్వకూడదు అని ఫిక్స్ అవుతాడు. అయితే ల్లి చేసిన మోసాన్ని ఎలాగైనా సరే బయట పెట్టాలి అని అనుకుంటాడు. అయితే ఇవాళ ఎపిసోడ్లో చందు తాగేసి వచ్చి ఆ నిజాన్ని బయట పెట్టాలని అనుకుంటాడు.. నర్మదా ప్రేమలు ఇద్దరు అడ్డుపడి ఆ విషయాన్ని రామరాజుకు తెలియకుండా జాగ్రత్త తీసుకుంటారు. అటు శ్రీ వల్లి మాత్రం తన భర్తకి ఎలాగైనా దగ్గర అవ్వాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అమూల్య విషయంలో ప్రేమ చేసింది తప్పే అని నమ్ముతున్న ధీరజ్ తన ప్రేమను రిజెక్ట్ చేస్తాడు.. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగ్యం వల్లీల బాగోతం రామరాజుకు తెలిసిపోతుందా లేదా అన్నది చూడాలి..