Intinti Ramayanam Avani : బుల్లితెరపై ఎన్నో రకాల సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. తెలుగులో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న ఏ సీరియల్ అయినా సరే తెలుగు ఆడియోస్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇంటింటి రామాయణం కూడా ఒకటి.. ఈ డైలీ సీరియల్ లో మెయిన్ లీడ్ లో నటించిన అవని గురించి తెలుసుకునేందుకు నేటిజెన్లు ఆత్రుత కనబరుస్తున్నారు.. గతంలో ఎన్నో సీరియల్స్ లో నటించిన అవని అలియాస్ పల్లవి రామిశెట్టి ఆస్తులు గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. ఆమె ఎప్పటి నుంచి సీరియల్స్లలో ఉండడంతో పాటు ఫ్యామిలీ ఆస్తులు కూడా బాగానే ఉండడంతో కోట్లకు వారసురాలు అని ఓ వార్త నెట్ ప్రచారంలో ఉంది.. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది.. అసలు పల్లవి రామిశెట్టి ఆస్తులు ఎన్ని కోట్లు ఉంటుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం…
పల్లవి రామి శెట్టి గురించి పరిచయాలు అక్కర్లేదు.. తెలుగు అమ్మాయి కాబట్టి తెలుగులోనే ఎక్కువగా సీరియస్ చేస్తూ బిజీగా ఉంది.. ఈమె ఇప్పుడు వరకు నటించడం ప్రతి సీరియల్ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ మధ్య స్టార్ వల్ల ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ లో మెయిన్ లీడ్ లో నటిస్తుంది.. ఈ పాత్ర జనాలకి బాగా కనెక్ట్ అవ్వడంతో ఆమె పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు జనాలు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఆమె ఆస్తులు విషయానికొస్తే.. ఆమె పుట్టి పెరిగింది విజయవాడలోని తెలుస్తుంది.. చదువు తర్వాత నటనపై ఆసక్తి ఉండడంతో సీరియస్లలోకి అడుగు పెట్టింది. ఒక్కో సీరియల్ తో తన నటనకు మెరుగులు దిద్దుకుంటూ వరుసగా సీరియల్ చేస్తూ బిజీగా మారింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈమె స్టార్ హీరోయిన్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. దాంతో ఆమెకు రెమ్యూనరేషన్ కూడా భారీగానే వచ్చేది. ఫ్యామిలీలో కూడా బాగానే సంపాదించి ఉండడంతో ఆమెకు ఇప్పుడు కోట్ల ఆస్తి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాదులో రెండు ఫ్లాట్లు, ఖరీదైన కార్లు, గోల్డ్ జ్యువెలరీ, అలాగే కోట్లు విలువ చేస్తే స్థలాలు, వీటితో పాటుగా తన భర్తకి ఆమెకి వస్తున్న సంపాదన బాగానే ఉంది. మరి ఈ ఆస్తులు నిజమో కాదో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఇది ట్రెండ్ అవుతుంది.
Also Read :గురువారం టీవీ సినిమాలు.. ఆ 3 డోంట్ మిస్..
ఆడదే ఆధారం, భార్యామణి, ఇంటింటి రామాయణం, జానకి పరిణయం వంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో జరగని ముద్ర వేసుకుంది పల్లవి రామిశెట్టి.. ఈమె సీరియల్స్ తో మాత్రమే కాదు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది. అందులో తనకి సంబంధించిన విషయాలతో పాటుగా తన ఫ్యామిలీ కూడా అప్పుడప్పుడు కనిపించడంతో అభిమానులు ఆ వీడియోలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. పల్లవి రామిశెట్టి పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులు సీరియల్స్ కి దూరమైంది. ఆ తర్వాత మళ్లీ ఆమె వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది. ఈమెకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఒక్కో సీరియల్ కి 45 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం.. ఈ లెక్కని చూస్తే నెలకి 25 రోజుల వరకు షూటింగ్ ఉండడంతో ఈమె లక్షలు సంపాదిస్తుంది అని జనాలు ఒక అభిప్రాయానికి వచ్చారు..