Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ అసలు కథ ఢిల్లీలో మొదలుకానుంది. కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణా కమిటీ నివేదిక ఇప్పటికే అధిష్ఠానం దగ్గరకు చేరింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు కీలక నేతలు ఢిల్లీకి వెళ్లడంతో అందరి చూపూ అటువైపే ఉంది. అటు ఖర్గే, కేసీ వేణుగోపాల్తో సురేఖ భేటీలో ఏం తేలుతుందన్నది కూడా ఉత్కంఠగా మారింది. సురేఖపై వేట తప్పదన్న ప్రచారం గట్టిగానే ఉంది. అదే జరిగితే .. ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలి అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయ్.