అసలు 22A జాబితాలోకి ఏ భూమి ఎప్పుడు వెళ్లింది? దాని వెనుక ఉన్న రికార్డు ఏంటి? 2014కు ముందు పరిస్థితి ఎలా ఉంది? ఆ తర్వాత ఏయే మార్పులు జరిగాయి? అన్న విషయంపై సమగ్ర ఫోరెన్సిక్ ఆడిట్ జరిగితేనే అసలు చిత్రం బయటపడుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే 22A జాబితాపై న్యాయ విచారణ, వైట్పేపర్ విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
2014 నుంచి సాగిన ఈ లీలల వెనుక పెద్ద ఎత్తున బినామీల ప్రయోజనాలు దాగున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయ్. కావాలనే సామాన్యుల భూముల్ని ఆ జాబితాలో పడేసి, తెరవెనుక చక్రం తిప్పి కొందరి భూములను మాత్రం మాయాజాలంతో నిషేధిత జాబితా నుంచి తొలగించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ నిషేధిత జాబితా డ్రామా వెనుక నిజంగానే భారీ కుట్ర జరిగిందా?
మరోవైపు.. గత ప్రభుత్వ హయాంలోనే ఉన్న జాబితాలను కొనసాగిస్తున్నామని కాంగ్రెస్ చెబుతోంది. మరి మాటల యుద్ధం కాకుండా 2014 నుంచి ఇప్పటి వరకు భూములపై పూర్తి డేటాను అసెంబ్లీలో ఉంచితే ఎవరి వాదన నిజమో తేలిపోదా? ఫోరెన్సిక్ ఆడిట్ తో ఎవరికి భయం? 22A రచ్చలో చివరికి గెలిచేదెవరు?