Road Accident: నెల్లూరులో లారీ బీభత్సానికి ముగ్గురి ప్రాణాలు పోయాయి. మరో ముగ్గురు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. NTR నగర్ దగ్గర జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ… అతి వేగంతో అదుపుతప్పి ఓ ఆటోను, కొన్ని బైక్లను ఢీ కొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటున్న వ్యక్తి పైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్నారు. మరికొందరు ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారంలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.