CM Vijay Meets PM Modi: ఢిల్లీ పర్యటనలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రధాని అధికారిక నివాసమైన సేవాతీర్థలో జరిగిన ఈ భేటీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, అది కూడా తమిళనాడు సీఎం హోదాలో విజయ్ ప్రధాని మోదీని కలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఈ మర్యాదపూర్వక భేటీలో తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండాగా నిలిచాయి. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, కేంద్ర నిధుల విడుదల, పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాలపై వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలని సీఎం విజయ్ ఈ సందర్భంగా ప్రధానిని కోరారు. తమిళనాడులో నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక దేశ రాజధానిలో జరిగిన ఈ అగ్రనేతల సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read: చంద్రబాబును మించిపోయిన లోకేష్.. కూటమి సర్కార్పై రోజా విమర్శల వర్షం!