E-Paper
Advertisement

Creative Business Idea: కశ్మీర్‌‌లో మంచు ఎత్తుకెళ్లి.. ఢిల్లీలో రూ.20కి అమ్మేశాడు, ఇదిగో వీడియో

Creative Business Idea: కశ్మీర్‌‌లో మంచు ఎత్తుకెళ్లి.. ఢిల్లీలో రూ.20కి అమ్మేశాడు, ఇదిగో వీడియో
Advertisement

Creative Business Idea: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా ‘డీలక్స్ భయ్యాజీ’ అనే ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ చేసిన ఒక వింత ప్రయోగం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. “మంచును అమ్మి డబ్బు సంపాదించవచ్చా?” అనే సందేహంతో అతను కాశ్మీర్ లోయలోని స్వచ్ఛమైన మంచును సేకరించి, దానిని ఏకంగా దేశ రాజధాని ఢిల్లీకి తరలించి విక్రయించాడు. ఈ క్రేజీ ఐడియాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం 16 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. మంచు కరిగిపోకుండా కాపాడే ఇన్సులేటెడ్ ఐస్ బాక్స్‌లో కాశ్మీర్ మంచును నింపి, శ్రీనగర్ విమానాశ్రయం ద్వారా అతను ఢిల్లీకి ప్రయాణించాడు.

ఈ ప్రయాణంలో తోటి ప్రయాణికులు అది ఢిల్లీ చేరేలోపే కరిగిపోతుందని సందేహం వ్యక్తం చేసినప్పటికీ, అతను పట్టుదలతో తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. ఢిల్లీలోని రద్దీగా ఉండే కన్నాట్ ప్లేస్‌కు చేరుకున్న తర్వాత బాక్స్ తెరిచి చూడగా, మంచు ఇంకా గడ్డకట్టే ఉంది. అక్కడ అతను ఒక చిన్న స్టాల్ లాగా ఏర్పాటు చేసి, “నిజమైన కాశ్మీర్ మంచును” తాకి చూడటానికి ఒక్కొక్కరికి 20 రూపాయలు చొప్పున ఛార్జ్ చేశాడు. అలా ఆ మంచు పూర్తిగా కరిగిపోయేలోపు అతను 240 రూపాయలు సంపాదించాడు. “డబ్బు తక్కువ వచ్చినా, కాశ్మీర్ మంచును ఢిల్లీకి సక్సెస్‌ఫుల్‌గా చేర్చాను కదా” అంటూ అతను ఈ ప్రయోగాన్ని ముగించాడు.

Advertisement

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఇది కేవలం మంచు కాదు, ఒక స్టార్టప్ ఐడియా.” అని ఒకరు కామెంట్ చేయగా, “కష్టపడే తత్వం ఉంటే ఎక్కడైనా సంపాదించవచ్చు.” అని మరొకరు అభినందించారు. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో భారీ హిమపాతం కురుస్తుండటంతో శ్రీనగర్ విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే వైష్ణోదేవి ఆలయంతో పాటు పట్నీటాప్ వంటి పర్యాటక ప్రాంతాలు మంచు దుప్పటిని కప్పుకున్నాయి. ఇటువంటి వాతావరణ పరిస్థితుల మధ్య వచ్చిన ఈ ‘స్నో బిజినెస్’ వీడియో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×