Creative Business Idea: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా ‘డీలక్స్ భయ్యాజీ’ అనే ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ చేసిన ఒక వింత ప్రయోగం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. “మంచును అమ్మి డబ్బు సంపాదించవచ్చా?” అనే సందేహంతో అతను కాశ్మీర్ లోయలోని స్వచ్ఛమైన మంచును సేకరించి, దానిని ఏకంగా దేశ రాజధాని ఢిల్లీకి తరలించి విక్రయించాడు. ఈ క్రేజీ ఐడియాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం 16 మిలియన్లకు పైగా వ్యూస్తో దూసుకుపోతోంది. మంచు కరిగిపోకుండా కాపాడే ఇన్సులేటెడ్ ఐస్ బాక్స్లో కాశ్మీర్ మంచును నింపి, శ్రీనగర్ విమానాశ్రయం ద్వారా అతను ఢిల్లీకి ప్రయాణించాడు.
ఈ ప్రయాణంలో తోటి ప్రయాణికులు అది ఢిల్లీ చేరేలోపే కరిగిపోతుందని సందేహం వ్యక్తం చేసినప్పటికీ, అతను పట్టుదలతో తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. ఢిల్లీలోని రద్దీగా ఉండే కన్నాట్ ప్లేస్కు చేరుకున్న తర్వాత బాక్స్ తెరిచి చూడగా, మంచు ఇంకా గడ్డకట్టే ఉంది. అక్కడ అతను ఒక చిన్న స్టాల్ లాగా ఏర్పాటు చేసి, “నిజమైన కాశ్మీర్ మంచును” తాకి చూడటానికి ఒక్కొక్కరికి 20 రూపాయలు చొప్పున ఛార్జ్ చేశాడు. అలా ఆ మంచు పూర్తిగా కరిగిపోయేలోపు అతను 240 రూపాయలు సంపాదించాడు. “డబ్బు తక్కువ వచ్చినా, కాశ్మీర్ మంచును ఢిల్లీకి సక్సెస్ఫుల్గా చేర్చాను కదా” అంటూ అతను ఈ ప్రయోగాన్ని ముగించాడు.
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఇది కేవలం మంచు కాదు, ఒక స్టార్టప్ ఐడియా.” అని ఒకరు కామెంట్ చేయగా, “కష్టపడే తత్వం ఉంటే ఎక్కడైనా సంపాదించవచ్చు.” అని మరొకరు అభినందించారు. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో భారీ హిమపాతం కురుస్తుండటంతో శ్రీనగర్ విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే వైష్ణోదేవి ఆలయంతో పాటు పట్నీటాప్ వంటి పర్యాటక ప్రాంతాలు మంచు దుప్పటిని కప్పుకున్నాయి. ఇటువంటి వాతావరణ పరిస్థితుల మధ్య వచ్చిన ఈ ‘స్నో బిజినెస్’ వీడియో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.
జమ్మూకశ్మీర్ మంచును ఢిల్లీలో అమ్మవచ్చా? అనే వినూత్న ప్రయోగంతో డీలక్స్ భయాజీ అనే బాలుడు చేసిన వీడియో వైరల్గా మారింది. . శ్రీనగర్ నుండి ఇన్సులేటెడ్ బాక్స్లో మంచును విమానంలో ఢిల్లీకి తరలించిన అతను, కన్నాట్ ప్లేస్లో రూ. 20 చొప్పున విక్రయించాడు. మంచు కరిగిపోయేలోపు రూ. 240… pic.twitter.com/swpQUcB0xC
— ChotaNews App (@ChotaNewsApp) January 27, 2026