Chinta Chiguru Pachi Royyalu: పచ్చి రొయ్యల కూర అంటేనే నాన్ వెజ్ ప్రియులకు అదో రకమైన ఇష్టం. అయితే, అదే రొయ్యలకు కొంచెం పుల్లపుల్లని చింతచిగురు తోడైతే.. ఆ రుచే వేరు కదా! ముఖ్యంగా గోదావరి సైడ్ పల్లెటూళ్లలో చింతచిగురు ఘుమఘుమలు మామూలుగా ఉండవు. రొయ్యల తీపి, చింతచిగురు పులుపు కలిసి అన్నంలో కలుపుకుని తింటుంటే అసలు ప్లేటు ఖాళీ అయ్యే వరకు వదిలిపెట్టరు. మసాలాలు ఎక్కువగా లేకుండా, ఇంట్లో ఉండే తక్కువ వస్తువులతో ఎంతో టేస్టీగా, నోరూరించేలా ఈ కూరను ఎలా వండుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
Also Read: పిల్లలు కూడా లొట్టలేసుకుని తినేలా.. స్పెషల్ వెజిటేబుల్ కిచిడీ రెడీ!
పచ్చి రొయ్యలు – అరకిలో
చింతచిగురు – ఒక కప్పు
ఉల్లిపాయలు – రెండు (పెద్దవి)
పచ్చిమిర్చి – ఐదు
పసుపు – అర టీస్పూన్
కారం – ఒక టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత
ముందుగా పచ్చిరొయ్యలను శుభ్రం చేసి అందులో కాస్త ఉప్పు, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. చింతచిగురును శుభ్రంగా కడిగి గిన్నెలో వేయాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి రంగు మారేవరకు వేయించాలి. ఆ తర్వాత పచ్చిరొయ్యలను వేసి కలపాలి.
రొయ్యలు కాస్త మగ్గిన తర్వాత చింతచిగురుని కూడా వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత కారం, ఉప్పు, కొద్దిగా నీటిని యాడ్ చేసుకోవాలి. అలా మూత పెట్టి పావుగంట సేపు చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ఇగురులాగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే టేస్టీ చింతచిగురు, పచ్చిరొయ్యలు రెసీపీ రెడీ అయిపోయింది.
Also Read: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ మంచూరియా.. ఇలా చేస్తే ముక్క జ్యూసీగా, టేస్టీగా రావడం ఖాయం!