Principal Attack on Teacher to Coming Late: స్కూళుకు లేట్ గా వస్తే పిల్లలను దండించడం, వారి పేరెంట్స్ కు ఫిర్యాదులు చేయడం చూస్తుంటాం. అంతేకాదు లేట్ గా వస్తే మరోసారి అస్సలు లేట్ గా రాకుండా వారికి క్లాసులు కూడా పీకుతుంటారు. ఇంకా అయితే కొంతమంది టీచర్లు గట్టి పనీశ్మెంట్ కూడా ఇస్తారు. ఇలా చాలా మంది టీచర్లు పిల్లలను వేధిస్తూ, కఠిన శిక్షలు విధించిన ఘటనలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే పిల్లలు అన్న తర్వాత కామన్ అని అనుకున్నా.. ఈ కాలంలో పిల్లలే కాదు టీచర్లపై కూడా దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఓ టీచర్ పై ప్రిన్సిపల్ దాడికి పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో వెలుగుచూసింది.
ఆగ్రాలో విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఓ టీచర్ స్కూలుకు ఆలస్యంగా వచ్చిందని ప్రిన్సిపల్ టీచర్ పై దాడికి పాల్పడింది. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ఒకరిని ఒకరు దారుణంగా కొట్టుకోవడం ప్రస్తుతం వైరల్ అవుతోంది. గుంజా చౌదరి అనే మహిళా టీచర్ స్కూలుకు ఆసల్యంగా వచ్చింది. దీంతో ఒక్కసారిగా కోపోద్రోక్తురాలైన ప్రిన్సిపల్ ఆలస్యంగా ఎందుకు వచ్చావ్ అని నిలదీసింది. గత నాలుగు రోజులుగా స్కూలుకు ఆలస్యంగా వస్తున్నావంటూ కొప్పడింది. దీంతో సదరు టీచర్ వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది.
Also Read: Viral Video: వడాపావ్ గర్ల్ అరెస్ట్.. వీడియో వైరల్.. క్లారిటీ..
ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరిని ఆపేందుకు విద్యార్థులు, తోటి టీచర్లు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
A Principal in Agra beat up a teacher this bad just because she came late to the school. Just look at her facial expressions. She's a PRINCIPAL 😭 @agrapolice pic.twitter.com/db8sKvnNvs
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 3, 2024