E-Paper
Advertisement

Nellore News: పెన్నా నదిలో పేకాట.. చిక్కుల్లో 17 మంది యువకులు.. డామ్ గేట్లు ఓపెన్

Nellore News: పెన్నా నదిలో పేకాట.. చిక్కుల్లో 17 మంది యువకులు.. డామ్ గేట్లు ఓపెన్
Advertisement

Nellore News: పని పాటా లేని కొందరు యువకులు పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. వారికి దొరికితే తాము బుక్కైపోతామని భావిస్తారు. చివరకు గంగమ్మ ఒడికి చిక్కారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. అసలు మేటరేంటి?

సోమవారం రాత్రి పేకాట ఆడేందుకు 17 మంది యువకులు నెల్లూరు సిటీలోని పెన్నా నదిలోకి వెళ్లారు. ఒక్కసారిగా నీరు రావడంతో వారంతా షాకయ్యారు. సరదాగా ఆనందించడానికి వస్తే నీరు చుట్టుముట్టడంతో హడలిపోయారు. తమను కాపాలంటే కేకలు పెట్టారు.  వెంటనే గుర్తించిన స్థానికులు, అధికారులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

ఈ తతంగం నాలుగైదు గంటలపాటు సాగింది. చివరకు నదిలో ఆటలు ఆడేందుకు వెళ్లిన యువకులు క్షేమంగా బయటపడడంతో వారి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.  నగరంలో ఎక్కడ పేకాట ఆడుతున్నా పోలీసులు దృష్టి పెట్టడంతో నెల్లూరు పట్టణంలో 17 మంది యువకులు టీమ్‌గా ఏర్పడ్డారు.

పోలీసుల టార్చర్ నుంచి తప్పించుకోవాలంటే నదిలోకి వెళ్లి పేకాట ఆడుకోవాలని నిర్ణయించారు. అనుకున్నట్లుగా అందులో నదిలోకి వెళ్లి పేకాట ఆడుతున్న సమయంలో ఒక్కసారి డామ్ గేట్లు ఓపెన్ చేశారు. వెంటనే నీరు వారిని చుట్టిముట్టింది. ఒక్కసారిగా వారంతా షాకయ్యారు. ఏం చెయ్యాలో కాసేపు తర్జనభర్జన పడ్డారు. నదిలో ఉండే చనిపోవడం భావించి కేకలు వేయడం మొదలుపెట్టారు.

Advertisement

ALSO READ: ఏపీలో ఐదు డిఫెన్స్ క్లస్టర్లు, ఉత్తరాంధ్ర-సీమకు మహార్ధశ

వంతెన మీదుగా వెళ్తున్న స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక శాఖ-పోలీసులు-రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. బ్రిడ్జిపై నుంచి నిచ్చెనతో కిందకు దిగి కొంత మందిని రక్షించారు. రాత్రివేళ కావడంతో అంతా చీకటిగా ఉంది. ఆక్సా లైట్‌ ఏర్పాటు చేైసిన నవాబుపేట పోలీసులు కిందకు దిగి గాలింపు చర్యలు చేపట్టారు.

తొలుత 9 మందిని రక్షించారు.  మిగతావారు ప్రాంతం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు పట్టుకుంటే అరెస్టు చేస్తారని భయపడ్డారు. చివరకు వారి నుంచి క్లారిటీ రావడంతో సురక్షితంగా  ఒడ్డుకు చేర్చారు పోలీసులు. దీంతో  యువకుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×