BigTV English

Road Accident: ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసుల మృతి..

Road Accident: ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసుల మృతి..

Allagadda Road AccidentAllagadda Road Accident(Andhra pradesh today news): నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ నల్లగట్ల వద్ద హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.


తిరుమల దైవ దర్శనం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో నవ దంపతులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ వెంకటాపురానికి చెందిన మంత్రి రవీందర్ కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో ఆళ్ళగడ్డ మండలం నల్లగట్ల వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని రవీందర్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మంత్రి రవీందర్, అతని భార్య లక్ష్మి, కుమారుడు కిరణ్, కోడలు కావ్య, ఇంకో కుమారుడు ఉదయ్ కిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.


కాగా మంత్రి రవీందర్ కుమారుడు కిరణ్‌కు కావ్యతో ఫిబ్రవరి 29న తెనాలిలో పెళ్లి జరిపించారు. మార్చి 3న హైదరాబాద్‌లోని శామీర్‌పేట్‌లో రిసెప్షన్ చేశారు. నూతన దంపతులను తీసుకొని తిరుమలకు వెళ్లివస్తుండగా ఈ ఘోరం జరిగింది. దీంతో మంత్రి రవీందర్ ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.

Related News

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Big Stories

×