E-Paper
Advertisement

Road Accident: ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసుల మృతి..

Road Accident: ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసుల మృతి..

Allagadda Road AccidentAllagadda Road Accident(Andhra pradesh today news): నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ నల్లగట్ల వద్ద హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

తిరుమల దైవ దర్శనం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో నవ దంపతులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ వెంకటాపురానికి చెందిన మంత్రి రవీందర్ కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో ఆళ్ళగడ్డ మండలం నల్లగట్ల వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని రవీందర్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మంత్రి రవీందర్, అతని భార్య లక్ష్మి, కుమారుడు కిరణ్, కోడలు కావ్య, ఇంకో కుమారుడు ఉదయ్ కిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

కాగా మంత్రి రవీందర్ కుమారుడు కిరణ్‌కు కావ్యతో ఫిబ్రవరి 29న తెనాలిలో పెళ్లి జరిపించారు. మార్చి 3న హైదరాబాద్‌లోని శామీర్‌పేట్‌లో రిసెప్షన్ చేశారు. నూతన దంపతులను తీసుకొని తిరుమలకు వెళ్లివస్తుండగా ఈ ఘోరం జరిగింది. దీంతో మంత్రి రవీందర్ ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×