BigTV English

Bear caught in Srisailam: బోనులో చిక్కిన ఎలుగుబంటి.. శ్రీశైలం నుంచి వెలుగోడు తరలింపు..

Bear caught in Srisailam: బోనులో చిక్కిన ఎలుగుబంటి.. శ్రీశైలం నుంచి వెలుగోడు తరలింపు..
Srisailam latest news

Srisailam latest news(Andhra news today):

శ్రీశైలంలో చేపట్టిన ఆపరేషన్ ఎలుగుబంటి సక్సెస్ అయ్యింది. భల్లూకాన్ని శుక్రవారం వేకువజూమున అటవీశాఖ అధికారులు బంధించారు. శిఖరేశ్వరం సమీపంలో రెండురోజులుగా ఎలుగుబంటి సంచరిస్తోంది. దీంతో భక్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఎలుగుబంటి దాడి చేస్తుందోమోనని బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు.


ఎలుగుబంటి బంధించేందుకు అటవీశాఖ అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో శిఖరేశ్వరం పరిధిలో 3 బోన్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎలుగుబంటి బోనులో చిక్కింది. దానిని వెలుగోడుకు ఫారెస్ట్ అధికారులు తరలించారు.

శ్రీశైలం పరిధిలో చిరుత కూడా సంచరిస్తోంది. దీంతో అధికారులను అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ అలాంగ్‌ చాంగ్‌ తెరాన్‌ అప్రమత్తం చేశారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.


ఇటీవల తిరుపతిలో చిరుత పులి దాడిలో ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. తిరుపతి ఘటన తర్వాత శ్రీశైలంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు బోన్లు అమర్చి ఎలుగుబంటిని పట్టుకున్నారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Related News

CM Chandrababu Meets Pawan: డిప్యూటీ సీఎం నివాసానికి సీఎం చంద్రబాబు.. ఉత్కంఠగా మారిన భేటీ?

Tirumala: గుడ్ న్యూస్.. తిరుమల శ్రీవారి భక్తులకు మరో కానుక

Drone At Srisailam: శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం.. అదుపులో ఇద్దరు యువకులు

AP Assembly: సొంత అజెండాతో బొత్స.. జగన్‌ను అవమానిస్తున్నాడా?

RTC BUS: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు రచ్చ రచ్చ.. ఎక్కడంటే..!

AP Govt: డ్వాక్రా మహిళలకు ఏపీ శుభవార్త.. ఆ శ్రమ తగ్గినట్టే, ఇంటి నుంచే ఇకపై

Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?

Big Stories

×