E-Paper
Advertisement

Kurnool : పిల్లాడి ప్రాణాల మీదికి తెచ్చిన సంప్రదాయం.. నోట్లో చేప ఇరుక్కుని..

Kurnool : పిల్లాడి ప్రాణాల మీదికి తెచ్చిన సంప్రదాయం.. నోట్లో చేప ఇరుక్కుని..
Advertisement

Kurnool : ఓ సంప్రదాయం నాలుగు నెలల బాలుడి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఈ ఘటన కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలోని కౌడల్‌పేట కాలనీలో శనివారం చోటు చెసుకుంది. కౌడల్‌పేట కాలనీకి చెందిన బందే నవాజ్‌, మోహమ్మది అనే దంపతులకు నాలుగు నెలల బాలుడు ఉన్నాడు. సంప్రదాయం ప్రకారం పిల్లాడి పెదవులకు చేపను తాకిస్తే ఆరోగ్యంగా ఉంటారని ఆ కుటుంబ సభ్యుల నమ్మకం.

శనివారం బాలుడి పెదవులకు చేపను తాకించే ప్రయత్నం చేశారు.చేతిలో ఉన్న చేప జారి పిల్లాడి నోట్లోకి వెళ్లిపోయింది. పిల్లాడి నోట్లో చేప ఇరుక్కుపోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి అపస్మారక స్థితికి వెళ్లాడు. తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతికష్టం మీద గొంతులో ఇరుక్కున్న చేపను బయటకు తీశారు. దీంతో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×