BigTV English

Visakhapatnam : కుప్పకూలిన భవనం.. పిల్లలు మృతి.. తల్లిదండ్రులకు కడుపుకోత..

Visakhapatnam : కుప్పకూలిన భవనం.. పిల్లలు మృతి.. తల్లిదండ్రులకు కడుపుకోత..

Visakhapatnam : ఆ బాలిక పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా జరుపుకుంది. తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఉత్సాహంగా గడిపింది. ఆ వేడుక జరిగిన కొన్ని గంటలకే ఆ అమ్మాయికి నూరేళ్లు నిండిపోయాయి. సోదురుడు కూడా ఆమెతోపాటు ప్రాణాలు కోల్పోయాడు. బిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసెలా రోదిస్తున్నారు.


ఏం జరిగిందంటే..?
విశాఖపట్నం కలెక్టరేట్‌ సమీపంలోని రామజోగిపేటలో బుధవారం అర్ధరాత్రి మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ సమయంలో భవనంలో మొత్తం 8 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో అన్నాచెల్లెలు ప్రాణాలు కోల్పోవడం తల్లిదండ్రులకు కుడుపుకోతను మిగిల్చింది.

విశాఖకు చెందిన సాకేటి రామారావు, కల్యాణి దంపతులకు దుర్గాప్రసాద్ (17), అంజలి (14) సంతానం. బుధవారం కుటుంబ సభ్యులందరూ కలిసి అంజలి పుట్టినరోజును వేడుకగా చేసుకున్నారు. ఆ వేడుక జరిగిన కొన్ని గంటల కూడా కాకముందే దుర్గాప్రసాద్‌, అంజలి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కంటికిరెప్పలా పెంచుకుంటున్న ఇద్దరు పిల్లలు ప్రమాదంలో చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదంలో గాయపడిన తల్లిదండ్రులు రామారావు, కల్యాణి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


భవనం కుప్పకూలిన సమాచారం అందగానే పోలీసు, అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. సహాయ చర్యలు చేపట్టాయి. రెస్క్యూ సిబ్బంది గురువారం ఉదయం బిహార్‌కు చెందిన చోటు (27) మృతదేహాన్ని వెలికితీశాయి. గాయపడిన కొమ్మిశెట్టి శివశంకర, సున్నపు కృష్ణ, సాతిక రోజారాణి, రామారావు, కల్యాణిని కేజీహెచ్‌ కు తరలించారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని డీసీపీ సుమిత్‌ గరుడ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు.

Related News

Ysrcp Digital Book: రివర్సైన వైసీపీ డిజిటల్ బుక్.. ఆ పార్టీ నేతలపైనే ఫిర్యాదులు!

Antarvedi Sea Retreats: 500 మీటర్లు వెనక్కి.. సునామీ వస్తుందా? అంతర్వేది వద్ద హై అలర్ట్

AP Rains: మహారాష్ట్ర పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. ఏపీకి పొంచివున్న ముప్పు..

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అన్ని కంపార్టుమెంట్లలో భక్తుల రద్దీ

AP News: పోరుబాటలో గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులు.. వాట్సాప్‌ గ్రూప్‌‌ల నుంచి ఎగ్జిట్, అక్టోబర్ ఒకటిన

YCP MLA’s in Assembly: అసెంబ్లీలో మాట్లాడని వైసీపీ ఎమ్మెల్యేలు.. గెలిచి ప్రయోజనమేంటి.?

Ntr Vidya Lakshmi Scheme 2025: ఏపీలో డ్వాక్రా మహిళలకు కొత్త పథకాలు.. ఒక్కొక్కరికి లక్ష

AP Ministers: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు.. ఎందుకు వెళ్లారంటే?

Big Stories

×