E-Paper
Advertisement

Visakhapatnam : కుప్పకూలిన భవనం.. పిల్లలు మృతి.. తల్లిదండ్రులకు కడుపుకోత..

Visakhapatnam : కుప్పకూలిన భవనం.. పిల్లలు మృతి.. తల్లిదండ్రులకు కడుపుకోత..
Advertisement

Visakhapatnam : ఆ బాలిక పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా జరుపుకుంది. తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఉత్సాహంగా గడిపింది. ఆ వేడుక జరిగిన కొన్ని గంటలకే ఆ అమ్మాయికి నూరేళ్లు నిండిపోయాయి. సోదురుడు కూడా ఆమెతోపాటు ప్రాణాలు కోల్పోయాడు. బిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసెలా రోదిస్తున్నారు.

ఏం జరిగిందంటే..?
విశాఖపట్నం కలెక్టరేట్‌ సమీపంలోని రామజోగిపేటలో బుధవారం అర్ధరాత్రి మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ సమయంలో భవనంలో మొత్తం 8 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో అన్నాచెల్లెలు ప్రాణాలు కోల్పోవడం తల్లిదండ్రులకు కుడుపుకోతను మిగిల్చింది.

Advertisement

విశాఖకు చెందిన సాకేటి రామారావు, కల్యాణి దంపతులకు దుర్గాప్రసాద్ (17), అంజలి (14) సంతానం. బుధవారం కుటుంబ సభ్యులందరూ కలిసి అంజలి పుట్టినరోజును వేడుకగా చేసుకున్నారు. ఆ వేడుక జరిగిన కొన్ని గంటల కూడా కాకముందే దుర్గాప్రసాద్‌, అంజలి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కంటికిరెప్పలా పెంచుకుంటున్న ఇద్దరు పిల్లలు ప్రమాదంలో చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదంలో గాయపడిన తల్లిదండ్రులు రామారావు, కల్యాణి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

భవనం కుప్పకూలిన సమాచారం అందగానే పోలీసు, అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. సహాయ చర్యలు చేపట్టాయి. రెస్క్యూ సిబ్బంది గురువారం ఉదయం బిహార్‌కు చెందిన చోటు (27) మృతదేహాన్ని వెలికితీశాయి. గాయపడిన కొమ్మిశెట్టి శివశంకర, సున్నపు కృష్ణ, సాతిక రోజారాణి, రామారావు, కల్యాణిని కేజీహెచ్‌ కు తరలించారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని డీసీపీ సుమిత్‌ గరుడ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు.

Related News

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

Big Stories

Advertisement
×